పుట:ఆముక్తమాల్యద.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాద్యంబు లైన దేవాలయంబులు వ్రాల
                   నవని నిరాళ మఠాళి నిలుపుఁ;


తే.

జందె ముత్తరశైవంబుఁ జెంది త్రెంచుఁ;
బతితు లారాధ్యదేవళ్ళె ప్రాప్యు లనుచు
నుపనిషత్తులు వారిచే నుబ్బి వినుచు,
వెండి యే జంగ మెత్తిన వెరఁగుపడును.

43


క.

శివలింగముఁ దాల్చిన జన
నివహం బేమైనఁ జేయనిది పాపము దా
నవుఁ గా దనఁ; డా సమయము
నవు నను విప్రులక యగ్రహారము లిచ్చున్.

44


తే.

అతఁడు రాజ్యంబుఁ బాలించు నవసరమునఁ
దనవశం బైనయట్టియత్తామ్రపర్ణిఁ
గలుగు నలపుట్టరాని ముక్తామణీకు
లంబు మాహేశ్వరుల కందలకునె తీఱె.

45


తే.

అప్పు డిచ్చకులగు బ్రాహ్మణులు కొంద
ఱాత్మజనిభూమి విడువలే కలికభూతి
గడ్డముల నాన రుదురాక లిడ్డనంది
సూతసంహిత లిఱికించి చొరఁ దొడఁగిరి.

46


క.

శీలముఁ బట్టియు గంజా
హాల లుపాంశున భుజించు నధముల బైటం
జాలఁడు వైవన్, విప్ర
స్ఖాలిత్యము బైలుసేసి కనుగిఱపు సభన్.

47


క.

ఆరాజుమహిషి యేని మ
దారాధనపరత నుండు; నట్లుండియు దు
ర్వారవ్యథకుం గానదు
సారము, విభుఁ దస్మదంఘ్రిభక్తుఁడు గామిన్.

48


వ.

మఱియు నప్పురంధ్రీరత్నంబు.

49