అని 27విధములుగా జెప్పివున్నవి. ఇది గాక జయదేవచ్ఛందంబున తొమ్మిదియతులున్ను,
కవిలోకసంజీవనియందు పండ్రెండుయతులున్ను, అనంతచ్ఛందంబున ఇరువదినాలుగు
యతులున్ను, నీలకంఠచ్ఛందంబున ఇరువదియైదు యతులున్ను, శ్రీధరచ్ఛందంబు
న ముప్పదియతులున్ను, ఉత్తమగండచ్ఛందంబున పదునెనిమిదియతులును గా వా
రువారు వేఱువేఱువిధంబుల నేర్పరిచి యుండుదురు. వాని నన్నిటిని బరికించి
యిందు స్వరయతీయు, గూఢస్వరయతియు, కాకుస్వరయతియు, వాహ్వానప్లుత
యతియు, రోదనప్లుతయతియు, సంశయఫ్లుతయతియు, గానప్లుతయతియు, వృద్ధి
యతియు, నఞ్ సమాసయతియు, భిన్నయతియు, నిత్యసమాసయతియు, దేశ్యయ
తియు, మకారయతియు, వికల్పయతియు, బిందుయతియు, ప్రాదియతియు, నర్ధ
బిందుయతియు, నాదేశయతియుఁ, బ్రభునామాఖండయతియు, ఘఙ్ యతియు,
శకంధుయతియు, సంయుక్తయతియు, విభాగయతియు, చక్కటియతియు, సరసి
యతియు, నభేదయతియు, నెక్కటియతియు, ఋయతియుఁ, బ్రాకృతాదేశయతి
యు, బోలికయతియు, నఖండయతియు, సమలఘుప్రాసయతియు, రియతియు,
గుణితపుయతియుఁ, బ్రాసయతియు నివి మొదలుగా గలయతిభేదంబులను బ్రాసవి
న్యాసంబులును విమర్శించి యన్నియు నొకటిగా సంఘటించి దానిదానికిఁ బూర్వ
కవిప్రయోగములు లక్షణలక్ష్యంబులు నిలిపి యేయేజాతిలక్షణంబులు వివరించిన
నందుకు భవదీయనామాంకితంబులుగా బద్యంబులు రచియించి యనంతరంబ
లక్ష్యంబులు విభియించి భవదీయదయావిశేషసంపాదితమదీయమనీషాచమత్కా
రంబుఁ దేటపఱచెద. పామరులు పండితు లగురీతిఁ బండితులు సంతసిల్లుభాతిగా
నాయేర్పరిచిన యీయానందరంగచ్ఛందంబున ముందుగాఁ బ్రాసంబులు వివరించె
ద నందు.