పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తా.

పృథ్వీతత్త్వమున కెనిమిది గడియలు, జలతత్త్వమునకు నాలుగు గడియలు, అగ్నితత్త్వమునకు నాఱుగడియలు, వాయుతత్త్వమున కైదుగడియలు, నాకాశతత్త్వమునకు నేడుగడియలు. మొత్తము 40 గడియలు. ఆదివారము మొదలు బుధవారమువఱకుఁ బృథివ్యాదిగాఁ జరించును. గురుశుక్రశనివాసరముల నాకాశము మొదలుగాఁ జరించును. ఈయైదును వరుసగా సంపద, శుభము, ఆర్తి, రోగము, దారిద్ర్యము నిచ్చునవి గనుక నివి తెలిసి కవిత్వము చెప్పునది.

ఇందుకు లక్ష్యము, కవిసర్పగారుడమున
సీ.

ఉర్వికి నెనిమిది యుదకంబునకు నాల్గు, గాడ్పునెచ్చెలి కాఱు గాలి కైదు
నాకాశమున కేడు నై తత్త్వముల కిట్లు, ముప్పదిగడియలు తప్పకుండు
రవిశశికుజబుధదివసంబులను భూజలాగ్నివాయువులకు నాది యగుచు
వరుసఁ బ్రవర్తిల్లు గురుశుక్రశనులందు, నాకాశమున నాది యగుచు నడుచుఁ


తే.

గాన నిట్లుండు వారసంగతులు దెలిసి, తత్త్వవేళల నాయైదుతత్త్వములకుఁ
బ్రమదశుభమృతిరుగ్దరిద్రత్వములగు, ఫలముల నెఱింగి కవిత చెప్పంగవలయు.

171
మఱియును
క.

కలిమి శుభ మార్తి రోగము, తిలకింపఁ దరిద్రతయుఁ బృథివ్యస్తేజో
నిలగగనవేళలన్ గవి, తలు చెప్పిన నొదవు రంగధరణీనాథా!

172

బాలాదిపంచస్వరములు

.

సీ.

మొనసి కకారంబుమొదలు క్షకారంబు, వఱకును గల్గినవర్ణసమితి
ముప్పదైదక్షరంబులకు బాలకుమార, రాజ్యవృద్ధమృతస్వరంబు లనఁగఁ
బరగుచు నొక్కొక్కస్వరమున కాఱేసి, గడియ లేడేసి యక్షరము లొప్పు
గ్రమముగా నది యింద్రయమవరుణకుబేర, భర్గదిక్కులరేయుఁ బగలు వెలుఁగు


తే.

నెట స్వరములొండె దానికి నెదురుకొనుచుఁ, గుశలధనధాన్యపీడార్తు లొసగువాని
ఫలముల నెఱింగి కవి కవిత్వంబు పలుకు, నాయకుని జేరు లక్ష్మి యానందరంగ!

173


తా.

కకారము మొదలు క్షకారమువఱకుఁ గలిగిన 35 అక్షరములకు, బాలస్వరము, కుమారస్వరము, రాజ్యస్వరము, వృద్ధస్వరము, మృతస్వరము నన 5 విధంబుల స్వరములు చెలఁగు. నందొక్కొక్కస్వరమునకు వరుసఁగ నేడేసియక్షరములవంతునఁ జెల్లును. ఒక్కొకస్వరమున కాటేఱేసిగడియలచొప్పున గలుగుటఁ జేసి, బాలస్వరము తూర్పునను, గుమారస్వరము దక్షిణమునను, రాజ్యస్వరము పడమరను, వృద్ధస్వర ముత్తరమునను మృతస్వర మీశాన్యమునను రేయుంబవలు వెలుగుచు, సంతోషము ధనలాభము, రాజ్యలాభము, శరీరపీడ, యధికక్లేశము ననయైదు ఫలముల నిచ్చును గనుక