పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రవిలసితంబును, జారుమతియును, భుజంగవిజృంభితయు, మంగళమహాశ్రీయు నను
నీ మొదలుగాఁగల వృత్తంబు లపారంబు లై విస్తరిల్లుటంజేసి తదీయలక్షణంబులు
వివరించెద. నానందరంగేంద్ర! విన నవధరింపుము మొదలియుక్తాచ్ఛందంబున
నొకయక్షరంబు పాదంబుగా రెండువృత్తంబులు పుట్టె. నందు

96
శ్రీయనువృత్తము (భీమనచ్ఛందమున)

"శ్రీ
శ్రీఁ
జే
యున్"

97


వ.

రెండవయత్యుక్తాచ్ఛందమున రెండక్షరములు పాదములఁ గలనాలుగుసమవృత్తం
బులు పుట్టె. అందు

శ్రీ పెంపు అనువృత్తము (భీమనచ్ఛందమున)

"శ్రీపెం
పొప్పున్
ప్రాపుం
దాపున్”

98


వ.

మూఁడవమధ్యాచ్ఛందంబున మూఁడక్షరములు పాదములఁ గలసమవృత్తము లెని
మిది పుట్టె. నందు నాలవ దగు

వినయ మనువృత్తము (భీమనచ్ఛందమున)

"వినయం
బునయం
జ్ఞునకున్.”

99


వ.

నాల్గవ ప్రతిష్ఠాచ్ఛందంబువ నాల్గక్షరములు పాదములఁ గలసమవృత్తములు పదు
నాఱు పుట్టె. నం దేడవ దగు

బింబ యనువృత్తము (భీమనచ్ఛందమున)

"పంబి భకా
రంబు గళా
రం బనఁగా
బింబ మగున్.”

100