పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రస్తారప్రత్యయము

గీ.

వరుస సర్వగురువు లుంచి గురువుక్రింద, లఘువు నవతలఁ బైబండిలాగు వ్రాసి
దాపటను గురు లుంచఁ బ్రస్తార మయ్యె, నసఘ! యానందరంగరాయాగ్రగణ్య.

89


తా.

ఎన్నవఛందము ప్రసరింపవలె నన్న నన్ని గురువులు వరుసఁగ వ్రాసి యందు తొలిగురువు క్తింద లఘువును నావలఁ బైబంతి యెట్లున్నదో యామేరకు వ్రాసి దాపట గురువు వాసినఁ బ్రస్తారమగును. ఇట్లు సర్వలఘువు లగువఱకు వ్రాయునది.

అధ్వప్రత్యయము

గీ.

అమర నుక్తాది యిన్నిఛందములవఱకు
నివృత్తంబు లెఱిఁగింపు మన్న దాని
లెక్క రెట్టించి యందులో రెండు త్రోయఁ
దక్కినది యధ్వ మగు రంగధారుణీంద్ర!

90


తా.

మొదటిఛందస్సు మొదలుకొని యిన్ని ఛందస్సులవఱకు నెన్ని వృత్తము అనిచో నడిఛందస్సుకుమాత్ర మెన్నివృత్తము లున్నవో యవి రెట్టించి
యందులో రెండు త్రోసి మిగిలిన వెన్నియో యన్ని చెప్పునది.

నష్టప్రత్యయము

గీ.

పలుకఁబడు లెక్కభాగ మేర్పడినలఘువు, వ్రాసి బేసైన నొక్కటి వ్రాసిఁ గూర్చి
యది సగము చేసి గురువుంచి తుదకుఁ గనిన, నష్టాలబ్దాఖ్య మయ్యె నానందరంగ!

91


తా.

ఎన్నవవృత్త మేరీతి నుండు నని యడిగిన నాలెక్క భాగించి సరిగా నున్నలఘువు వ్రాసికొని బేసిగానుండిన నొకటి కూర్చి భాగించి యందుకు గురువు వ్రాసికొనునది. ఇట్లు కడదనుక భాగించుకొని గురువు లఘువు వ్రాయుచు వచ్చినట్లయిన నది నష్టప్రత్యయ మగును.

సంఖ్యాప్రత్యయము

గీ.

వెలయ నీఛందమున కెన్నివృత్తము లని, యడుగ నేకోత్తరంబుగా నదివఱకును
గూర్చి యా లెక్క రెట్టించుకొనిన వృత్త, సంఖ్య యగు నది రంగరసాతలేంద్ర!

92


తా.

ఈఛందమున నెన్నివృత్తములు పుట్టు నని యడిగిన నెన్నవఛందము చెప్పుచున్నాఁడో యదివఱకు నేకోత్తరవృద్ధిగా రెట్టించి కడనువచ్చిన లెక్కను రెట్టించి యిన్నయని చెప్పునది.

ఉద్దిష్టప్రత్యయము

గీ.

వృత్తమున గురులఘువులు పేర్చి దాని క్రింద నేకోత్తరర్థి లెక్కించి యాల
ఘువులసంఖ్యలో నొక్కటి గూర్చుకొనిన, నామ ముద్దిష్ట మయ్యె నానందరంగ.

93