పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తా.

అక్షరానికి సావత్తు, పావత్తు, మావత్తు, వలపలిగిలుక, కొరవడి యివిమొదలైనవర్ణము లేవి కూడియుండినా ఆజాతియక్షరములకు కూడా యతులు చెప్పవచ్చును.

లక్ష్యము
గీ.

ప్రకటమతి విజయానందరంగనృపతి, క్షణములోఁ దృణమును మేరుసమము చేయు
క్షణములో మేరువుఁ దృణముఁగాఁగ జేయుఁ, దనదుచూపుల నిది విచిత్రంబు గాదె.

250
ఆముక్తమాల్యదయందు
గీ.

ఆతఁ డఘమర్షణస్నాన మమ్మరుద్ధ్ర, దాంబువుల నాడి మాధ్యాహ్నికంబు దీర్చి
స్నాతయు నలంకృతయు నౌతనయను దోడి, కొనుచు వైష్ణవపరిషత్తు కొలువ నరిగి.

251
భీమన నృసింహపురాణమున
క.

మానవనాథుఁడు గంగా, స్నానానంతరము సకలదానములు మహా
దీను లగువిప్రకోటికి, సేనాదయతోడ నిచ్చి శివు సేవించెన్.

252


వ.

దీనినే కొందఱు తకారయతి యందురు. కడమ సంయుక్తయతులు నిట్లే యని
యెఱుంగునది.

253

విభాగయతి

[1]కవిరాక్షసచ్ఛందమున
గీ.

సంఖ్యకును బరిణామసంజ్ఞకుఁ దనర్చు
శబ్దములపై విభాగోక్తి సంఘటించు
నప్పుడు యతులు రెండేనియగు నుపేంద్రు
డిచ్చుచుం డర్థమును మోపెఁడేసి యనఁగ.

254


తా.

రెండవది, మూఁడవది, నాలవది యనిపలుకఁబడు సంఖ్యాపరమైనశబ్దములకున్ను గంపెఁడేసి, మోపెఁడేసి, చేరిఁడేసి, పట్టెఁడేసి యనిపలుకఁబడు ప్రమాణమైనశబ్దములకును అచ్చుహల్లులకు రెంటికిని యతి చెల్లును.

లక్ష్యము
గీ.

అతులవైభవపటిమ రెండవసురేంద్రు, డీతఁడే యనఁ దగి పెట్టెఁడేసి సొమ్ము
లింపుతో నర్థులకు మోపెఁడేసివలువ, లిచ్చునానందరంగేంద్రు నెన్నవశమె?

255
భారతమున
సీ.

ఆయంబునందు నాలవభాగ మొండె మూఁ, డవభాగ మొండెఁ దదర్థ మొండె...

256
  1. ఈ పద్యము అనంతచ్ఛందములో అనంతుఁడు చెప్పిన ట్లున్నది. (1-121).