పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
8



కూడ ప్రసిద్ధి చెండాడు. శాతవాహనుల సాంస్కృతిక సేవ విశేషంగాను, బహుముఖంగాను సాగిందని చెప్పవచ్చు.

గౌతమీ పుత్ర శాతకర్ణి హిందూమతాభివృద్ధికి విశేషంగా కృషి చేశాడు. హిందూ సాంఘీక వ్యవస్థలోని నాల్గు వర్ణాల్ని సమాన గౌరవంతో ఆదరించాడు. ఇతనితో పాటు రాణియైన వాసిష్ఠ ధర్మోద్దరణకు అంకితభావంతో కృషి చేసింది. రాజమాతయైన గౌతమీ బాలశ్రీ చాల గొప్ప వ్యక్తిత్వాన్ని కల్గిఉండేది. శాతకర్ణి తన్నుతాను 'గౌతమీపుత్రుడు'గా సగర్వంగా పిలుచుకునేవాడు. శాతకర్ణి తర్వాత ఆయన కుమారుడు వాసిష్ఠ పుత్ర పులోమావి రాజ్యాధికారానికి వచ్చి క్రీ. శ. 102 నుండి 130 సంవత్సరం వరకు పాలించాడు. తన తండ్రి ఇచ్చిన విస్తృత సామ్రాజ్యాన్ని పులోమావి చక్కగా కాపాడగల్గాడు. వాసిష్ఠ పుత్రపులోమావి తర్వాత శాతకర్ణి రాజ్యానికి వచ్చి క్రీ. శ. 130 సం. నుండి 154 సం. వరకు పాలించాడు. శాక్య రాజైన రుద్రదామనుడు శాతకర్ణిని ఓడించి శాతవాహన సామ్రాజ్యంలోని కొన్ని ప్రాంతాల్ని స్వాధీనం చేసుకున్నాడు.

గౌతమీ పుత్ర యజ్ఞశ్రీ (క్రీ. శ. 174 - 203)

ప్రసిద్ది చెందిన శాతవాహన రాజుల్లో చివరివాడు గౌతమీపుత్ర యజ్ఞశ్రీ. రుద్రదామనుని మరణం తర్వాత ఉజ్జయినిలో చెలరేగిన అల్లకల్లోల్లాల్ని ఆసరాగా తీసుకుని యజ్ఞశ్రీ ఆ రాజ్యంపై దండెత్తాడు. పశ్చిమ, మధ్య భారతాల్లోని చాల ప్రాంతాల్లో శాతవహనుల పూర్వ వైభవాన్ని నెలకొల్ప గలిగాడు.

అమరావతి స్తూపాన్ని విస్తృత పరచి మహా చైత్యానికి చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేశాడు. యజ్ఞశ్రీ ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు కొంత కాలం పాటు వున్నాడు. యజ్ఞశ్రీ మరణం తర్వాత శాతవాహన సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది. క్రీ. శ. 3 వ శతాబ్దికంతా రాజకీయంగా పూర్తిగా తెరమరుగయింది.

శాతవాహనుల సాంస్కృతిక సేవ

క్రీ. పూ 3 వ శతాబ్దినుండి క్రీ. శ 3 వ శతాబ్దివరకు దాదాపు అయిదువందల సంవత్సరాలు సాగిన శాతవాహనుల పాలన భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా భావించవచ్చు. శాతవాహనుల ప్రాభవానికి ముందు భారతదేశ చరిత్ర అంటే కేవలం ఉత్తర భారతదేశ చరిత్రగా భావించేవారు. ఉత్తరాన నర్మదా