పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3



తెలుస్తున్నది ఇంకా ఆంధ్రులకు దాదాపు 30 కోటలు, ఒక లక్ష కాల్బలము, 2000 అశ్వాలు, 1000 ఏనుగులు ఉండేవని తెలుస్తున్నది.

కణ్వవంశీయుల్లో చివరివాడైన సుశర్మ అను మగధరాజును ఆంధ్రరాజైన శ్రీముఖుడు హతమార్చి మగధ రాజ్యాన్ని ఆక్రమించినట్లు మత్స్య, వాయు పురాణాలు చెపుతున్నాయి. కాని శాతవాహనుల పాలన ఇంకా ముందే (క్రీ. పూ. 236లో) ప్రారంభం అయినట్లు శాసనాధారాలు చెబుతున్నాయి. మౌర్యుల ప్రాభవం క్షీణించిన తర్వాత వారి సామంతులైన ఆంధ్రులు స్వతంత్రతను ప్రకటించారు.

శాతవాహనులు

ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరాలు

ఆంధ్రుల పుట్టుకను గురించి అనేక వాదోపవాదాలున్నాయి. ఆంధ్రులు ఆర్యులని, దక్కను ప్రాంతానికి వలస వచ్చి స్థానికులతో కలసిపోయి వారి సంస్కృతిని అలవర్చుకొన్నారని కొందరి భావం కాని ఆంధ్రులు ఆర్యులు కారని, ద్రావిడులేనని, ద్రావిడులు అతి ప్రాచీనకాలం నుండి దేశమంతటా నివసిస్తున్నారని మరికొందరి వాదన

ఆంధ్రుల జన్మస్థానం గురించి గూడా వివాదం ఉంది. ఆంధ్రుల జన్మస్థానం గోదావరి, కృష్ణా నదుల మధ్య ప్రాంతమని కొందరు భావించగా, ఆంధ్రశాతవాహనుల పాలన మొదట మహారాష్ట్రలోని మరధ్వాడ ప్రాంతంలో స్థాపించబడిందని, వారు తమ సామ్రాజ్యాన్ని తూర్పుదిశగా కృష్ణా గోదావరిలోయ ప్రాంతాలకు విస్తరింపచేశారని, పశ్చిమ ప్రాంతంలో తమ ఆధిపత్యం క్షీణించిన తర్వాతనే ఆంధ్రప్రాంతానికి తమ రాజధానిని మార్చారని మరికొందరు పండితులు అభిప్రాయపడ్డారు.

ఆంధ్రులు అసలు శాతవాహనులేనా? అన్న వివాదం గూడా మరొకటి ఉంది. కొందరు పండితులు, శాతవాహనులు ఆంధ్రులు కారని, వారు సర్వస్వతంత్రులైన ఒక రాజవంశీయులని భావించారు. కాని బండార్కర్, రాప్సన్, వి ఎ స్మిత్ వంటి ప్రసిద్ది చెందిన చరిత్రకారులు మాత్రం శాతవాహనులు ఆంధ్రదేశానికి చెందినవారుగానే అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయనికనుగుణంగా