పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాష్ట్రంలో 4 మూల స్తంభాల అమలు

21. ఈ నాలుగు మూల స్తంభాల లక్ష్య సాధనకు, వివిధ పథకాలను అమలు చేయడం మరియు సుపరిపాలనను అందించడం ద్వారా మన ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. చాలా సంవత్సరాలుగా మానవ వనరుల కొరతను వివిధ శాఖలు ఎదుర్కొంటున్నాయి. మన ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను విడుదల చేయడం మరియు పారదర్శక నియామక ప్రక్రియల ద్వారా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారీ నియామకం చేపట్టింది. గ్రామ మరియు వార్డు సచివాలయాలు మరియు ఇటీవల ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ సేవా పోర్టల్ 2.0 ద్వారా, పాలనను ప్రజల ఇంటి వద్దకు తీసుకెళ్లడంలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో మన రాష్ట్రం ప్రత్యేక స్థానం పొందింది. మన ప్రభుత్వం ముందుగా ప్రకటించిన వార్షిక క్యాలెండర్ ఆధారంగా ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీపై దృష్టి సారించి, వివిధ ప్రభుత్వ ప్రయోజనాలను సకాలంలో అందజేయడంలోని లోటుపాట్లను తొలగిస్తోంది. జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారనే వాస్తవాన్ని అంగీకరిస్తూ, సామాజిక అభివృద్ధిలో మరియు ఇళ్లలో వారి కీలక పాత్రను దృష్టిలో ఉంచుకుని, మన ప్రభుత్వ కార్యక్రమాలు మరియు పథకాలను బాలికలు మరియు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించడం జరిగింది. చివరగా, నిబద్ధత, విశ్వసనీయత, పారదర్శకత మరియు విశ్వాసం అనే లక్షణాల ద్వారా రాష్ట్ర ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మరియు సుస్థిరమైన అభివృద్ధి సాధిస్తూ అధిక ఆర్థిక వృద్ధి చెందే దిశగా మన ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

22. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన భారీ ప్రతికూలతతో కూడిన దిగ్ర్భాంతిని అధిగమించడానికి మన రాష్ట్రానికి ఈ విధానం అమలు ఎంతగానో సహాయపడింది. గౌరవనీయ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ధృఢమైన నాయకత్వంలో ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి బడుగు బలహీన వర్గాల జీవితాలను మరియు జీవనోపాధిని రక్షించడానికి మన ప్రభుత్వం అనేక అత్యవసర చర్యలు చేపట్టింది. ఈ మహమ్మారి ఉన్న సమయంలో గౌరవనీయ ముఖ్యమంత్రిగారు తరచుగా సమీక్షలు జరిపారు. వారి నిర్విరామ కృషికి ఈ గౌరవ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు, ప్రజారోగ్యం, రెవెన్యూ మరియు ఇతర శాఖల సిబ్బంది కృషి వలన మన రాష్ట్రం ఈ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కోగలిగింది.

23. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, మన రాష్ట్రం దాదాపు 8.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్ర ప్రజలకు అందించింది. ఈ సంఖ్య రాష్ట్ర జనాభా కంటే దాదాపు రెట్టింపు అని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. లాక్ డౌన్ మరియు ఇతర అంతరాయాల వల్ల ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్ర ప్రజలకు విస్తృతమైన ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నగదు ప్రయోజనాలను అందించగలిగింది.

24. నవరత్నాలు మరియు మేనిఫెస్టోలో సూచించిన ఇతర పథకాల అమలు ద్వారా ఎస్.డి.జి.లను సాధించాలనే తపన మరియు అలుపెరగని కృషి మన రాష్ట్రాన్ని శ్రేయస్సు మార్గంలో ఉంచాయి. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారు

6