పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2022-23.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2022-23 లో పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక రంగాల విభాగానికి 685.36 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

నీటి వనరులు

89. మంచి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పారిశ్రామిక వృద్ధికి మరియు పర్యావరణ స్థిరత్వానికి కూడా నీరు ఎంతో కీలకం. నీతి ఆయోగ్, 6వ ఎస్.డి.జి. అయిన 'స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యం' అనే అంశంలో ఆంధ్రప్రదేశ్ కు 4వ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా, 'స్వచ్ఛమైన నీరు మరియు పారిశుధ్యం' కార్యక్రమానికి అనుగుణంగా, దాదాపు 97% పరిశ్రమలు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధనలను పాటిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సాగునీటి సౌకర్యాలు, త్రాగునీటి కల్పన, పరిశ్రమలకు భరోసా కల్పించేందుకు జలయజ్ఞం కింద చేపట్టిన భారీ ప్రాజెక్టులకు మన ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సమకాలీన సమాచారాన్ని ఈ గౌరవ సభకు అందించడం నాకు సంతోషంగా ఉంది.

90. పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ నిర్మాణం షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది 2023 నాటికి దీనిని పూర్తి చేయాలని మా ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాల పునరావాసంలో చురుకైన పురోగతితో పాటు పునరావాస మరియు పునర్నిర్మాణ కాలనీల నిర్మాణ పనులు కూడా ఏకకాలంలో కొనసాగుతున్నాయి.

91. వెలిగొండ ప్రాజెక్ట్ 1వ టన్నెల్ పూర్తయింది. నల్లమల సాగర్ రిజర్వాయర్ ఇప్పటికే పూర్తికాగా, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలోని కరువు పీడిత ప్రాంతాలకు వచ్చే ఖరీఫ్ లో రిజర్వాయర్ లో నీటిని నిల్వవుంచి అందించేందుకు పునరావాస మరియు పునర్నిర్మాణ పనులు ఏకకాలంలో కొనసాగుతున్నాయి. పెన్నా డెల్టా వ్యవస్థ, కావలి కాలువ, కానుపూరు కాలువల క్రింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించేందుకు నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిపై ఉన్న సంగం మరియు నెల్లూరు బ్యారేజీలు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతానికి మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని అందించడానికి, వంశధార ప్రాజెక్ట్ రెండవ ఫేజ్ లోని రెండవ స్టేజ్ మరియు వంశధార-నాగవళి అనుసంధాన ప్రక్రియను 2022 జూన్, నాటికి పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గండికోట రిజర్వాయర్‌కు అదనంగా 10,000 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు 2022 ఆగస్టు నాటికి అవుకు టన్నెల్ రెండవ దశను పూర్తి చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది.

92. అదనంగా, సెప్టెంబర్ 2020లో ప్రారంభించబడిన వై.ఎస్.ఆర్. జలకళ కార్యక్రమం క్రింద, మరింత సాగుకు యోగ్యమైన భూమిని సాగులోకి తీసుకురావడానికి అవసరమైన మరియు అర్హులైన రైతుల కోసం మన ప్రభుత్వం 9,187 బోర్ వెల్స్‌ను ఉచితంగా డ్రిల్ చేయించడం జరిగింది.

25