పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20. ఈ నేపధ్యంతో, నా బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పిస్తున్నాను. సాంప్రదాయకంగా, బడ్జెట్ ప్రసంగాలలో, శాఖలు మరియు పథకాలకు కేటాయింపుల వివరాలు ఉంటాయి. నా ప్రసంగంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకాలు మరియు బడ్జెట్ ను గణనీయంగా పెంచిన పథకాలపై దృష్టి పెడతాను. శాఖల వారీ బడ్జెట్ కేటాయింపులు మరియు ప్రాధాన్యత / నూతన పథకాల వివరాలను ఈ ప్రసంగానికి అనుబంధంగా ఇవ్వడమైనది.

వైఎస్ఆర్ రైతు భరోసా

21. రైతులు స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిగారి మొదటి ప్రాధాన్యతగా ఉన్నారని గౌరవ సభ్యులకు తెలుసు. అందువలన ప్రభుత్వం ఆయన జన్మదినమైన జూలై 8వ తేదీని ‘రైతు దినోత్సవం"గా ప్రకటించింది. ఈ రోజును సాగు అంశాలను సమీక్షించడానికి, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, సేవల అందింపులో ఏవేవి ఇబ్బందులను పరిష్కరించడం, విస్తరణ మద్దతును అందించడం మొదలగు వాటికి ఉద్దేశించడమయింది.

22. రైతుల సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత. ఈ దిశగా గౌరవ ముఖ్యమంత్రిగారి అధ్యక్షతన ప్రభుత్వం వ్యవసాయ కమీషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమీషన్ క్షేత్ర ఆదాయాల పురోగతిని రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఆచరణలో పెట్టవలసిన అవసరమైన చర్యలను నిర్ణీత కాలంలో చేపడుతుంది.

యథాభజిం వినాక్షేత్రం

ముప్తం భపతి నిష్ఫలం

అంటే,
ఎంత సారవంతమైన నేల అయినా,
ఎంత బాగా దున్నినా,
ఎంత చేయి తిరిగిన రైతు అయినా ....
విత్తనం వేయకపోతే పంట పండదు.

9