పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38. 2020-21 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి రూ.11,891.20 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

పశుగణాభివృద్ధి - మత్స్య పరిశ్రమ

మన గ్రామాలలో 'పాడిలేని ఇల్లు, పేడలేని చేను ఉండదు'

అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. దేశం బాగుండాలంటే రైతు బాగుపడాలి. పాడి అవసరాలతో పాటు వ్యవసాయానికి విత్తనాలు, ఎరువులు, కూలీలతో పాటు పశువులు అవసరం కూడా ఉంది.

‘గొడ్డువచ్చిన వేళ... బిడ్డ వచ్చిన వేళ' అని మన రైతులు సంతానంతో సమాన స్థాయిని పశు సంపదకు ఇచ్చి-పశువులను కొనేందుకు మంచిరోజు కోసం ఎదురుచూస్తుంటారు.

'ఆవులేనింట అన్నం కూడ తినరాదని' కూడా కొన్ని చోట్ల అంటుంటారు.

ఇంతటి కీలకమైన పశుపోషణను ప్రోత్సహించవలసిన అవసరాన్ని మా ప్రభుత్వం గుర్తించింది. ఆర్థిక పశుపోషణకు ఉన్న ప్రాధాన్యాన్ని, దాని అవసరాన్ని అవగతం చేసుకొని చేయూతగా నిలవాలని నిర్ణయించింది.

39. ప్రాథమిక రంగం మీద ఆధారపడ్డ కుటుంబాలలో అత్యధిక సంఖ్యాకులకు పశు గణాభివృద్ధి నిశ్చితమైన ఆదాయ వనరును సమకూరుస్తుంది. నవరత్నాలలో భాగంగా రూ. 50.00 కోట్ల మేరకు పశుగణ నష్టపరిహార నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఆవులు, గేదెలు మొదలైన వాటికి రూ.15,000 నుండి రూ.30,000 ల దాకా, మేకలు, గొర్రెలకు రూ. 6,000 ల దాకా నష్టపరిహారం రైతులకు అందచేయబడుతుంది.

జలంపై ఆధారపడి బతికే జనం మత్స్యకార సోదరులు. ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్ళి చేపల వేట సాగించి, వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్న జీవితాలు వారివి. తీరాన్ని నమ్ముకుని బతుకుతున్న మత్స్యకార

16