పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57. మా ప్రభుత్వం 4,133 దివ్యాంగుల జీవనాధార సహాయం నిమిత్త 35.87 కోట్ల రూపాయలను కేటాయించింది. దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత నిస్తూ వారికి పునరావాసం మరియు కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేసే కార్యక్రమానికి 2019-20 సంవత్సరానికి కేటాయింపులకు కేటింపు చేస్తూ 70 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను.

58. ఉచిత విద్యుత్ పధకం: జగజ్జీవన్ జ్యోతి పధకం క్రింద నెలకు ఉచిత విద్యుత్ యూనిట్ సంఖ్యను 50 నుండి 100 యూనిట్లకు పెంచడం వలన గత నాలుగున్నర సంవత్సరాలలో సగటున 11 లక్షలు ఎస్సీ కుటుంబాలకు 3440 కోట్ల రూపాయలు, 3.89 లక్షల ఎస్టీ కుటుంబాలకు 97.2 కోట్ల రూపాయల మేర లబ్ది చేకూరింది.

59. మా ప్రభుత్వం 2 లక్షల అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాలకు 100 యూనిట్లు వరకు నాయీ బ్రాహ్మణ సంక్షేమం కోసం, వారి సెలూన్లకు 150 యూనిట్ల వరకు, రజకుల సంక్షేమంలో భాగంగా పూర్తి ఉచితంగా, స్వర్ణకారులకు 100 యూనిట్లు వరకు, చేనేత కార్మికులకు 150 యూనిట్లు వరకు, ఉచిత విద్యుత్ ను అందించడం జరుగుతున్నది.

60. కమ్యూనిటీ సౌకర్యాలు: ఎస్సీ సబ్ కంపోనెంట్ క్రింద గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో 745 కి.మీ. సీసీ రోడ్లును, 1,225 కి.మీ. బి.టి. రోడ్ల పనులను చేపట్టడం జరిగింది. 930 ఎస్సి నివాస ప్రాంతంలో త్రాగునీటి సదుపాయాన్ని కల్పించడం జరిగింది. నగర పాలక సంస్థల పరిధిలో ఎస్సీ ప్రాంతంలో నూతనంగా రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టాము.2019-20 సంవత్సరానికి మౌలిక సదుపాయాలను సమకూర్చటానికి 600.56 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాము.

61. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎస్టీ కాంపోనెంట్లో భాగంగా వివిధ పథకాల కింద 250 కంటే ఎక్కువ జనాభా కలిగిన 248 ప్రాంతాలను కలుపుతూ రోడ్లు వేయడం జరిగింది. గిరిజన గ్రామ పంచాయితీలలో కమ్యూనికేషన్ సౌకర్యాలను మెరుగుపర్చడానికి 184 మెబైల్ టవర్లను ఏర్పాటుచేసాము.

62. బిసి కాంపోనెంట్ క్రింద 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో, అమరావతి 10 ఏకరాల విస్తీర్ణంలో మహాత్మా జ్యోతి బాపూలే స్మారక భవన్ మరియు పార్క్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అంతేకాక, మా ప్రభుత్వం 76 నూతన బిసి రెసిడెన్షియల్ స్కూళ్లను, కేవలు మత్స్యకారుల వర్గానికి ప్రత్యేకంగా 6 సూళ్లను, రెండు రెసిడెన్షియల్‌లో కళాశాలను ప్రారంభించడమే కాకా 12 జూనియర్ కాలేజీలో ఉన్నతీకరించడం జరిగింది. బిసిల సామాజిక సాంస్కృతిక సమైక్యత కోసం జిల్లాలో 5 కోట్ల వ్యయముతో బిసి భవనంను, డివిజన్ స్థాయిలో 50 లక్షల రూపాయల వ్యయముతో కమ్యూనిటీ హాళ్ళను, మండల స్థాయిలో 25 లక్షల రూపాయల వ్యయముతో, 10 లక్షల రూపాయల వ్యయముతో గ్రామ స్థాయిలో కమ్యూనిటీ హాళ్లు మొత్తం 135 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడము జరిగింది. పైన చెప్పిన దానికి అదనంగా 308 కాపు భవనాల నిర్మాణానికి మరో 123 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది.

12