పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

63. మైనారిటీ భాగం క్రింద విజయవాడ, కడప పట్టణాలలో 23 కోట్లు, 13 కోట్లు వ్యయముతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ హౌస్‌ను నిర్మించడము జరుగుతుంది. అదేవిధంగా చర్చిల నిర్మాణం, రిపేర్లు, పునర్నిర్మాణం కోసం 5 లక్షలు ఆర్ధిక సహాయంతో 817 పనులు చేపట్టబడ్డాయి.

64. దివ్యాంగుల సంక్షేమ పరిధిలో, బధిరుల కోసం అనంతపురం మరియు కాకినాడలో 2 గృహాలు, 100 మంది లబ్దిదారులకు గుంటూరులో ఒక ఆర్థోపెడిక్ కేంద్రాన్ని, గుంటూరులో క్రొత్త Braille ప్రెస్లు, 1,224 మందికి ఒక్కటికి 80,000 వేల రూపాయల చొప్పున పెట్రోల్ స్కూటర్లను అందివ్వడం వంటి కార్యక్రామాలను మా ప్రభుత్వం చేపట్టింది.

65. చంద్రన్న పెళ్ళికానుక / దుల్హన్ పధకం: ఇది మా ప్రభుత్వం యొక్క భావ ప్రధానమైన చర్యల నిరుపేదలు కూడా తమ కుటుంబాలలో జరిగే శుభకార్యాలను హృదయపూర్వకంగా, ఎటువంటి ఒత్తిడులు లేకుండా జరుపుకోవాలని కుటుంబ పెద్దగా గౌరవనీయ ముఖ్యమంత్రిగారు ఎస్సీ, ఎస్టీ, బిసిలు, దివ్యంగులు మరియు కులాంతర వివాహాల సమయంలో లక్ష రూపాయల వరకు ఈ పథకం ద్వారా అందిస్తున్నాము. ఇప్పటివరకు, 139 కోట్ల రూపాయల ఖర్చుతో 68,481 దంపతులకు ఈ వివాహ కానుకలను 282.66 కోట్ల వ్యయంతో ఇవ్వడం జరిగింది. దుల్హాన్ పథకంలో 38,285 దంపతులకు 191 కోట్ల రూపాయల మేర కానుకలు ఇచ్చాము.

66. చంద్రన్న పెళ్ళికానుక పథకాన్ని మా ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన తరగతులవారిక శాచురేషన్ పద్దతిలో ప్రతి పేద కుటుంబానికి విస్తరించింది.

67. పండుగ కానుక /తోఫా: సంక్రాంతి, క్రిస్మస్ మరియు రంజాన్ వంటి శుభ సందర్భాలలో ఆనందాలు వెల్లివిరియాలనే ఉద్దేశ్యంతో ప్రవేశ పెట్టిన చంద్రన్న కానుక, రంజాన్ తోఫాల వంటి పధకాల ఉద్దేశ్యం కూడా అదే. గత నాలుగున్నర సంవత్సరాలలో 1.25 కోట్ల కుటుంబాలకు చంద్రన్న కానుకలు, 11.25 లక్షల ముస్లిం కుటుంబాలకు తోఫా ఇవ్వడం జరిగింది.

68. ఇదే బాటలో పవిత్ర స్థలమైన జెరూసలేం సందర్శించే క్రిస్టియన్ యాత్రికులకు అందించే ఆర్ధిక సహాయాన్ని 20,000 నుండి 40,000 రూపాయలకు పెంచడం జరిగింది. దీని వలన 6.09 కోట్ల రూపాయల వ్యయంలో 1668 యాత్రికులకు లబ్ధిచేకూరింది.

69. ఎస్సీ సబ్ ప్లాన్ కు క్రిందటి సంవత్సరంకంటే 28 శాతం పెంచుతూ 2019-20 సంవత్సరానికిగాను 14,367 కోట్లను ప్రతిపాదిస్తున్నాను. అలాగే, 29 శాతం పెంచుతూ ఎస్టీ సబ్ప్లాన్ కు 5,385 కోట్లు, 33 శాతం పెంచుతూ బిసి సబ్ ప్లాన్ కు 16,226 కోట్లు కేటాయిస్తున్నాను.

70. చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధి కోసం 1,004 కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా వర్ష ఋతువులో ఒక్కొక్క కుటుంబానికి 4,000 రూపాయల చొప్పున వేతన పరిహార ఉపశమనం క్రింద 90,765 చేనేత కుటుంబాలు లబ్దిపొందుతున్నాయి. నెలకు

13