పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51. ఉద్యోగ అవకాశాలు: యుపిఎస్‌సి సివిల్ సర్వీస్ పరీక్షల వంటి పోటీ పరీక్షలకు హజరయ్యే విద్యార్థులకు ప్రైవేట్ సంస్థలలో నిపుణులు మార్గదర్శకత్వాన్ని అందించేందుకు మా ప్రభుత్వం ఎన్.టి.ఆర్ ఉన్నత విద్యాధరణ అనే నూతన పధకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం క్రింద ప్రతి విద్యార్ధికి 1.5 లక్షల రూపాయలను సంస్థాగత రుసుముగాను, 9 నెలల కాలానికి నెలకు 10 వేల రూపాయల చొప్పున స్టైఫండ్‌గాను చెల్లించబడుతుంది. ఈ పథకం క్రింద 9,524 మంది (2,313 మంది షెడ్యూలు కులాలు, 947 మంది షెడ్యూల్డు తెగలు, 542 మంది మైనార్టీలు, 2,816 మంది వెనుకబడిన తరగతులు, 1,443 మంది ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మరియు 1,415 మంది కాపులు) విద్యార్థులకు 143 కోట్ల రూపాయల లబ్దిచేకూరింది.

52. షెడ్యూల్ కులాల యువతలో పారిశ్రామికత మరియు ఉద్యోగాలు పొందే సామర్థ్యాన్ని పెంచడానికి మా ప్రభుత్వం చంద్రన్న చేయూత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. ఇప్పటివరకు 31,815 మంది యువతకి దీని ద్వారా ప్రయోజనం పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 20,000 మంది షెడ్యూల్ తెగల నిరుద్యోగ యువత లబ్ది పొందడమే కాక, 4,000 మంది వివిధ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉపాధి పొందడం జరిగింది.

53. జీవనాధారములు: గత నాలుగున్నర సంవత్సరాలలో 3,795 కోట్ల రూపాయల వ్యయంతో 2,66,740 మంది ఎస్సి లబ్దిదారులు జీవనోపాధి సహాయం పొందారు. వీరికిచ్చిన 8,000 వాహనాలు; 2,386 ఎకరాల భూమి, 110 ట్రాక్టర్లు, చర్మకారులకు ఇచ్చిన 6,000 Toolkit లు వంటి ఈ కోవలోనివే.

54. ఎస్‌టిల జీవనోపాధి పెంచడం కోసం మా ప్రభుత్వం 5,42,333, ఎస్టి లబ్దిదారులకు 622 కోట్ల రూపాయల ఖర్చు చేసింది. వీటిలో800 ఎస్టి లబ్దిదారులకిచ్చిన ఋణాలు, భూకేటాయింపులు, కాఫీ తోటల పెంపకం, రైతు ఉత్పత్తిదారు సంఘాల ఏర్పాటు వంటివి ఉన్నాయి.

55. మొత్తం మీద గత ఐదు సంవత్సరాల కాలంలో వివిధ కార్పోరేషన్లు, పెడరేషన్లు, ద్వారా BC Component క్రింద 4,823 కోట్ల రూపాయల వ్యయంతో 6.46 లక్షల లబ్దిదారులకు ఆర్థిక మద్ధతులను అందించాము.

90 శాతం సబ్సిడీతో ఆధునిక పనిముట్లను వివిధ వృత్తికారులకు అందించాము. కాపు తెలగబలిజ/ఒంటరి సామాజిక వర్గాల వారికి బిసిలకు ఎంబిసిలకు, ఐబిసిలకు, ఆర్య వైశ్యులకు ఆయా కార్పోరేషన్ల ద్వార ఆర్థిక తోడ్పాటును అందజేసే కార్యక్రమం విస్తరించాము.

56. మైనారిటీలకు 279 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. APSMFC మరియు APSCMFC ద్వారా 47,678 లబ్దిదారులకు 264.7 కోట్లతో ఆర్థిక తోడ్పాటు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఆదాయ వనరులు లేని మసీదులకు చెందిన ఇమాంలకు నెలకు 5000 రూపాయలు, మౌజర్లకు నెలకు 3,000 రూపాయల చొప్పున పారితోషకం ప్రకటించడం జరిగింది. 18.57 శాతం పెంచుతూ మైనార్టీల సంక్షేమానికి 1,304.43 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాను

11