Jump to content

పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45. వెనుకబడిన కార్పొరేషన్లకు 3,000 కోట్ల రూపాయలను కేటాయించేందుకు ప్రతిపాదిస్తున్నాను. వివిధ వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లకు వారిలో దారిద్ర్య దిగువరేఖ క్రింద ఉన్న జనాభా దామాషాపద్దతిలో ఈ కేటాయింపును పంచడం జరుగుతుంది.

46. 2014 సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్, 2015 సంవత్సరంలో కాపు కార్పొరేషన్, 2016 సంవత్సరంలో అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ మరియు వైశ్య కార్పొరేషన్ ను స్థాపించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నూర్భాష/దూదేకుల ముస్లిం కోపరేటివ్ ఫెడరేషన్లు కూడా 2018 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ సంస్థలు సదరు సామాజిక వర్గాలలో వెనుకబడిన తరగతుల వారి ఉన్నతి కోసం కృషి చేస్తాయి. కాపుల సంక్షేమానికి 1,000 కోట్లు, బ్రాహ్మణల సంక్షేమానికి 100 కోట్లు, ఆర్య వైశుల సంక్షేమానికి 50 కోట్లు, క్షత్రియులు (రాజులు) సంక్షేమానికి 50 కోట్లు ప్రత్యేకించడమైనది.

47. విద్యా పురోభివృద్ధి: పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ పధకం క్రింద అన్ని వర్గాలకు (SC/ST/BC/ EBC/Kapu/MW/DW) చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్ రేట్లను ప్రభుత్వం ఈ క్రింది విధంగా పెంచడం జరిగింది. డిపార్ట్ మెంట్ అనుబంధహాస్టళ్లకు 33% వరకు, కళాశాల అనుబంధ హస్టళ్ళకు 131% వరకు, డేస్కాలర్లకు - 150% వరకు 71 లక్షల స్కాలర్షిప్‌లను అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు (14.5 లక్షల మంది SC, 2.8 లక్షల మంది ST, 36.9 లక్షల మంది BC, 11.5 లక్షల మంది EBC/Kapu, 5.4 లక్షల మంది మైనారిటీలు మరియు 2,666 లక్షల మంది దివ్యాంగులు) మొత్తంగా 2,833 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది.

48. హాస్టల్ విద్యార్థులకు సార్వత్రిక పోషకాహార మెనూ ప్రకారం వారానికి 5 రోజులు గుడ్లు, ప్రీమెట్రిక్ హాస్టళ్లలో వారానికి 3 సార్లు చికెన్, రెసిడెన్షియల్ సూళ్ళు మరియు కాలేజీ హాస్టళ్లలో వారానికి 2 సార్లు చికెన్ అందించడం జరుతుగుంది. వీటితోపాటు 200 మీ.లీ. పాలు, రాగి మాల్ట్ మరియు చిక్కని రోజువారి అందించడం జరుగుతుంది.

49. మా ప్రభుత్వం హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు చెల్లించే కాస్మోటిక్స్ చార్జీలు, హెయిర్ కట్ చార్జీలు మరియు యూనిఫామ్ కట్టుకూలిని 150% వరకు పెంచడం జరిగింది. మొట్టమొదటి సారిగా కాలేజీ పోస్టుమెట్రిక్ హాస్టళ్ల విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలను మంజూరు చేయడం జరిగింది.

50. మా ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు మైనారిటీ వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు విదేశీ విద్యా పధకం పరిధికి తీసుకురావడం జరిగింది. అంబేద్కర్ విదేశీ వద్య పధకం క్రింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన విద్యార్థులకు విదేశాలలో ఉన్న విద్యను అభ్యసించడానికి మంజూరు చేసే స్కాలర్ షిప్ మొత్తాన్ని 10 లక్షల నుండి 15 లక్షలకు పెంచడం జరిగింది. బి.సి. విద్యార్థులకు కూడా విదేశీ విశ్వవిద్యాలయాలలో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించేందుకు 10 లక్షల సహాయం అందించడం జరుగుతున్నది. ఈ పధకం క్రింద గత ఐదు సంవత్సరాలలో మొత్తం 4,528 మంది విద్యార్థులు లబ్ధిపొందారు.

10