పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


  • మైక్రోసాఫ్ట్, జిందాల్, రిలయన్స్, అదానీ, లారస్ సింథసిస్, TCS, Infosys, Hero Motocorp, Yokohama, Grasim Industries, Greenko Energy వంటి అనేక దిగ్గజ పరిశ్రమలు గత 4 సంవత్సరాలలో మన రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి.
  • మన రాష్ట్రము 2022 సంవత్సరానికి గాను, అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల జాబితాలో 3వ స్థానాన్ని పొందింది.
  • విశాఖ పట్టణంలోని రుషికొండ బీచ్ అత్యంత పర్యావరణ అనుకూలమైన బీచ్ ‘బ్లూ ఫ్లాగ్' లేబుల్ను పొందింది.
  • 2023 సంవత్సరానికిగాను ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి గ్రామం కేంద్ర ప్రభుత్వ అవార్డు పొందింది.
  • మన రాష్ట్రము క్లీన్ మరియు గ్రీన్ పునరుత్పాదక ఇంధనం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడం, పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలను నెరవేర్చటం, ఇంధనం మరియు మౌలిక సదుపాయాల వినియోగం అనే మూడు అంశాలకుగాను, మన రాష్ట్రం 15వ ఎనర్షియా అవార్డు-2023 క్రింద మూడు అవార్డులను అందుకుంది.
  • పాలసముద్రంలో అత్యాధునిక వసతులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) కి ప్రాంగణాన్ని స్థాపించడంలో మా ప్రభుత్వం మద్దతును ఇచ్చింది. 500 ఎకరాల విస్తీర్ణంలో, ఈ ప్రధాన కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర మరియు భాగస్వామ్య దేశాలలోని రెవిన్యూ సర్వీస్ ఆఫీసర్ల సామర్థ్య పెంపుకై శిక్షణను అందించటం జరుగుతుంది.

41