పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • పుంగనూరు పశువులను సంరక్షిస్తున్నందుకుగాను, శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం, తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.సి.ఏ.ఆర్.) నుండి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును అందుకుంది.
  • వ్యవసాయ మార్కెట్ కమిటీలలో షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే.
  • జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది.
  • మన రాష్ట్రం నేడు అంకుర సంస్థల అభివృద్ధికి దోహదపడే వాతావరణాన్ని కలిగి ఉంది. కొత్త సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల రిజిస్ట్రేషన్లు 2020 సంవత్సరంలో 65,174 నమోదు కాగా నేడు 2023 సంవత్సరంలో ఈ రిజిస్ట్రేషన్లు 7 లక్షల 20 వేలకు పెరిగాయి.
  • దేశంలో 5% వాటాతో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల అభివృద్ధి పరంగా మన రాష్ట్రం 7వ స్థానంలో ఉంది.
  • 2017 సంవత్సరానికి ఒక లక్ష 17 వేల మంది సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలలో ఉపాధి పొందుతుండగా, ఉద్యమ్ పోర్టల్ క్రింద ఈ ఉపాధి కల్పన 2023 సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి, ఈ తరహా సంస్థలలో 27 లక్షల 45 వేల మంది ఉద్యోగులు ఉపాధిని పొందుతున్నారు.
  • మన రాష్ట్రము 'ఒక జిల్లా-ఒక ఉత్పత్తి' క్రింద ఉప్పాడ జన్దనీ చీరలకు బంగారు బహుమతిని పొందటమే కాకుండా, చేనేత ఉత్పత్తుల క్రింద మరో నాలుగు అవార్డులను అందుకుంది.
  • ప్రధాన మంత్రి పట్టణ ఆవాస యోజన క్రింద ఉత్తమ పనితీరు అవార్డును మన రాష్ట్రము అందుకుంది. అదే విధంగా, మన రాష్ట్రానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి నుండి ఉత్తమ గృహ నిర్మాణ అవార్డును అందుకున్నారు.

40