పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • 2018-19 సంవత్సరంలో మన రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3 శాతంతో 12వ స్థానంలో ఉండగా, ఈ రోజు, మన రాష్ట్రం 13% వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 6వ స్థానంలో ఉంది.
  • డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపచేసిన మొదటి మరియు ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే.
  • 13 లక్షల 5 వేల మంది రైతులకు సేవలను అందిస్తూ, మన రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకుచే ప్రశంసలు అందుకున్నాయి. ఇథియోపియా, బంగ్లాదేశ్ మరియు వియత్నాం దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు మన రాష్ట్రంలో రైతులకు 'విత్తనం నుండి అమ్మకం వరకు' అందిస్తున్న భరోసాను చూసి తమ తమ దేశాలలో అనుకరించాలనుకుంటున్నారు.
  • సూక్ష్మ నీటిపారుదల పధ్ధతి అమలులో మన రాష్ట్రము రెండవ స్థానంలో ఉంది. అంతే కాకుండా, దేశంలోని మొదటి 15 జిల్లాలలో, 6 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి.
  • భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐ.సి.ఏ.ఆర్.) - జాతీయ అరటి పరిశోధన సంస్థల నుండి ఎగుమతి కార్యకలాపాలకు గాను ఉత్తమ రాష్ట్ర అవార్డును మన రాష్ట్రము గెలుచుకుంది. 2019 సంవత్సరానికి ముందు 387 మెట్రిక్ టన్నుల అరటిని మాత్రమే ఎగుమతి చేయగా, నేడు ఒక లక్ష 67 వేల మెట్రిక్ టన్నుల అరటిని ఎగుమతిని చేస్తున్నాం.
  • మన రాష్ట్రము మొత్తం చేపల ఉత్పత్తిలో 30% వాటాతో మరియు మొత్తం సముద్ర ఆహార ఎగుమతులలో 31% తో దేశంలోనే ముందంజలో ఉంది. అందుకు ఫలితంగా 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డు పొందటం జరిగింది.

39