పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

97. అదనంగా, 127 కోట్ల రూపాయల పెట్టుబడితో 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక మరియు రాయదరువులలో అభివృద్ధి చేయడం జరిగింది.

98. అంతర్గత జల రవాణా అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీని 2023 జూన్ లో స్థాపించడం జరిగింది. మన రాష్ట్రములో కృష్ణానదిపై ముక్త్యాల-మద్దిపాడు మధ్య తొలి నదీప్రవాహ ప్రాజెక్టు ఐదు నెలల రికార్డు స్థాయిలో రూపొందించబడింది.

99. మా ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి పనులను చేపట్టింది. గన్నవరం, కడప, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు మరియు విశాఖపట్నం విమానాశ్రయాల అభివృద్ధి పనులను పునరుద్ధరించింది. ఇప్పటికే కర్నూల్లో విమాన సర్వీసులు ప్రారంబించ బడ్డాయి.

రహదారులు

100. మా ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 2,626 కోట్ల రూపాయలు ప్రధాన జిల్లా రహదారులకు 1,955 కోట్ల రూపాయలు మరియు LWE ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధాన పథకం క్రింద 272 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. NDB ప్రాజెక్ట్ మొదటి దశ క్రింద 3,014 కోట్ల రూపాయలతో 1,243 కి.మీ రోడ్లు అభివృద్ధి చేయబడుతున్నాయి. NIDA-మొదటి దశ క్రింద 1,158 కోట్ల రూపాయల వ్యయంతో 98 రాష్ట్ర రహదారుల పనులు, 132 MDR లు పూర్తయ్యాయి. APRDC ద్వారా 2,205 రూపాయల ఖర్చుతో 8,286 కిలోమీటర్ల రహదారుల నాణ్యత మెరుగుపడింది. సేతు బంధన్ మరియు ఇతర గ్రాంట్ల కింద 992 కోట్ల రూపాయలతో 19 ROB లను అభివృద్ధి చేస్తున్నారు. 7,182 కోట్ల రూపాయలతో సుమారు 350 కి.మీ జాతీయ రహదారులు రెండు/నాలుగు వరుసలలో అభివృద్ధి చేస్తున్నారు. MORTH ద్వారా 872.52 కి.మీ పొడవున్న 10 రహదారులను నూతన జాతీయ రహదారులుగా ప్రకటించారు.

26