పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం

90. అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థుల సామాజిక ఆర్థిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని తగ్గించడానికి పాఠశాల స్థాయి పరీక్షలు, పోటీ పరీక్షలు మరియు ఉద్యోగ ఆధారిత పరీక్షల శిక్షణను కల్పించడానికి మా ప్రభుత్వం సహాయం చేసింది. దీని ద్వారా 2023-24 సంవత్సరములో దాదాపు 5 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.

91. ఇమామ్లకు అందించే సహాయం 5 వేల రూపాయల నుండి 10 వేల రూపాయలకు పెంచడం ద్వారా 4,983 మందికి ప్రయోజనాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా మోజన్లకు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాన్ని నెలకు 3 వేల రూపాయల నుండి 5 వేల రూపాయలకు పెంచి 4,983 మంది కి మేలు చేయటం జరిగింది. 8427 మంది పాస్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి నుండి నెలకు 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము. 2023 సంవత్సరం నుండి విజయవాడ లోని ఎంబార్కేషన్ పాయింట్ నుండి హజ్ యాత్ర చేసే ప్రతి యాత్రికునికి 80 వేల రూపాయలు అందజేయడం ద్వారా 1,756 మంది యాత్రికులను ప్రోత్సహించటం జరుగుతోంది. అదేవిధంగా 2019 నుండి 1,178 మంది యాత్రికులకు జెరూసలేం వెళ్ళడానికి 60 వేల చొప్పున ఆర్థిక ప్రయోజనాన్ని అందించటం జరిగింది.

VI. సంపన్న ఆంధ్ర

మౌలిక సదుపాయాలు మరియు ఉత్పాదకత - అభ్యున్నతి సంకల్పం

92. ఆర్థికాభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన పునాది లాంటిది. పారిశ్రామికీకరణను వేగవంతం చేయడానికి మరియు పోటీతత్వాన్ని పెంపొందించడానికి, మా ప్రభుత్వం అనేక మార్గనిర్దేశక కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాల అమలులో భాగముగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానము 2023-27 ను మా ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ విధానం విభిన్న రంగాలలో శక్తివంతమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో పని చేస్తోంది.

24