పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

V. సంక్షేమ ఆంధ్ర

దృఢమైన సామాజిక భద్రతా వలయం - పేదరికంపై యుద్ధం

ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్ మాటలలో...

“మన పురోగతికి పరీక్ష, వున్న వాళ్ళ సంపదను మరింత పెంచామా అని కాదు,
లేని వాళ్ళకి తగినంత అందించామా” అని

64. ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి మా ప్రభుత్వం ఒక బలమైన సామాజిక భద్రతా వలయాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ఇంటి స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణము, సంక్షేమ పింఛన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా రేషనన్ను ఇంటింటికీ పంపిణీ చేయడం వంటి వివిధ పథకాల ద్వారా ఆర్ధిక మద్దతును అందిస్తుంది. ఈ కృషి పేదరికాన్ని దాని మూలాల నుండి నిర్మూలించాలనే నిబద్ధతను నొక్కి చెబుతుంది. ప్రతి వ్యక్తి, వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా, గౌరవప్రదమైన మరియు సురక్షితమైన జీవితానికి గడపటానికి మా ప్రభుత్వము సహకారం అందచేస్తుంది .

గృహ రంగము

65. గత ప్రభుత్వం తన ఐదేళ్ల కాలములో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా మా ప్రభుత్వం 2019 వ సంవత్సరము నుండి 1 లక్ష 53 వేల కోట్ల రూపాయల విలువగల 30,65,315 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది.

66. పేదలందరికి ఇల్లు పథకము క్రింద మా ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి ఇంటి ఖర్చుకు లక్షా 80 వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కొ ఇంటికి 6 లక్షల 90 వేల రూపాయలు కేటాయించిన ఫలితంగా గృహ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఈ పథకము క్రింద 22 లక్షల ఇళ్లు కేటాయించగా దాదాపు 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లను 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.

18