పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్య సంపద

60. వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా క్రింద, 2 లక్షల 43 వేల మంది మత్స్యకార కుటుంబాలు చేపల వేట నిషేధ కాలములో అందించే ఆర్థిక సహాయాన్ని 4 వేల రూపాయాల నుండి 10 వేల రూపాయలకు పెంచడం ద్వారా లబ్ధి పొందాయి. 20,034 మత్స్యకారుల పడవలకు వాడే డీజిల్ ఆయిల్ పై లీటరుకు 6 రూపాయల 3 పైసల నుంచి 9 రూపాయాలకు సబ్సిడీని పెంచడం జరిగింది. చేపల వేటలో అకాల మరణాలకు గురైన మత్స్యకారులకు నష్ట పరిహారాన్ని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది.

61. మత్స్యకారులకు సముద్రం మీద చేపల వేటను సులభతరం చేయడానికి మా ప్రభుత్వము అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణము చేపట్టింది. గ్రామ స్థాయిలో ఆక్వా రైతులు ఉపయోగించే పనిముట్లను పరీక్షించే సౌకర్యాలను అందించడానికి మా ప్రభుత్వం 35 సమీకృత మత్స్య సంపద ప్రయోగ శాలలు ఏర్పాటు చేసింది. చేపలు, రొయ్యలను సమర్ధవంతముగా మార్కెటింగ్ చేయడం కోసం, 2,000 ‘ఫిష్ ఆంధ్రా’ రిటైల్ దుకాణాలు స్థాపించబడ్డాయి. ఇవి 26 ఆక్వా హబ్లకు అనుసంధానించబడ్డాయి.

62. మత్స్య సంపద ఉత్పత్తిని ప్రోత్సహించి దాని నియంత్రణ మరియు పర్యవేక్షణ కొరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధి సంస్థ స్థాపించబడింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషరీ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏప్రిల్ 1, 2022 నుండి పని చేస్తోంది. 63. మా ప్రభుత్వం 2 లక్షల 12 వేల హెక్టార్ల విస్తీర్ణాన్ని ఆక్వాకల్చర్ క్రిందకు తీసుకురావడం ద్వారా 16 లక్షల 5 వేల మందికి కొత్తగా జీవనోపాధి అవకాశాలు కల్పించి, మన రాష్ట్రాన్ని దేశము యొక్క ‘ఆక్వా హబ్ గా తీర్చిదిద్దింది.

17