49. స్త్రీల మరియు పిల్లల భద్రతను పెంపొందించడం కోసం, దిశా మొబైల్ యాప్ ను, దిశా పెట్రోల్ వాహనాలను మరియు 26 దిశా పోలీస్ స్టేషన్ లను ప్రారంభించాము. కోటికి పైగా వినియోగదారులు దిశా మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొన్నారు.
IV. అన్నపూర్ణ ఆంధ్ర
ప్రతిఫల మరియు సుస్థిర వ్యవసాయం - రైతే రాజు
డి.డి. ఐజన్ హోవర్ మాటలలో...
"మీరు మొక్క జొన్న చేనుకు వేల మైళ్ళ దూరంలో ఉండి
మీ చేతిలో ఉన్న పెన్సిల్ను నాగలిగా భావిస్తే
వ్యవసాయం చాలా సులభంగా కనిపిస్తుంది.”
రైతన్నకు జేజేలు!
50. రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి, వ్యవసాయ రంగములో గణనీయమైన ఉత్పత్తిని సాధించి, రైతుల ఆదాయాన్ని పెంచి వారి జీవనప్రమాణ స్థాయిలను మెరుగుపరచడానికి మా ప్రభుత్వము ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది. దీనిలో భాగముగా ధరల స్థిరీకరణ నిధి, పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించి, వ్యవసాయానికి స్థిరమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం జరిగింది.
51. మా ప్రభుత్వము 2019 సంవత్సరము నుండి, డా॥ వై.ఎస్.ఆర్. రైతు భరోసా - పి.ఎం. కిసాన్ పథకము క్రింద ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 1 లక్ష 60 వేల కౌలుదారులు మరియు 93 వేల అటవీ భూముల సాగు రైతులతో సహా మొత్తం 53 లక్షల 53 వేల మంది రైతుల ఖాతాలకు 33,300 కోట్ల రూపాయలను జమ చేసింది. కౌలు రైతులు మరియు అటవీ భూముల సాగుదారులకు 13,500 రూపాయల ఆర్థిక సహాయన్ని పూర్తిగా మా ప్రభుత్వమే అందిస్తోంది.
14