పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చుండు, వెండియు నతండే విజిగీష్వరులకు భేదం బగుటం
జేసి వీరలిరువురు దొరల గలయది మండలంబని పలుకుచుండు.
మఱికొన్ని మతంబులవారు విజిగీష్వరి మధ్యము లనియెడి
మువ్వురు దొరలంగల యది మండలంబని పలుకుచుండుదురు.
మఱియు మయమతంబువారు విజిగీష్వరి మధ్య మోదాసీను
లనియెడి నలువురు దొరలం గల యది మండలంబని పలుకు
చుండుదురు. మఱియుఁ గొన్నిమతంబులవారు విజిగీషునకు
వెనుకటి పార్ష్ణిగ్రాహాక్రందు లిరువురును ముందరి యరి మిత్రు
లిరువురునుం గూడి విజిగీషువుతోడ నేవురు దొరలంగలయది
మండలంబని పల్కుచుండుదురు. మఱియుఁ బులోమేంద్రులు
విజిగీష్వరి మిత్రపార్ష్ణిగ్రాహ మధ్య మోదాసీను లనియెడి
యార్వురు దొరలంగలయది మండలంబని పల్కుచుండుదురు.
మఱియుఁ గొన్నిమతంబులవారు విజిగీష్వరి మధ్యమోదాసీను
లనియెడి నలుగురు దొరలకును నలుగురు మిత్రులం గూడి
యెనమండ్రు దొరలం గలయది మండలంబని పల్కుచుండు
దురు. మఱియుఁ గొన్నిమతంబులవారు విజిగీషునకు
ముందరి యరిమిత్రాదు లేవురును వెనుకటి పార్ష్ణిగ్రాహాదులు
నలువురును విజిగీషువును గూడి పదువురు దొరలం గలయది
విజిగీషుమండలం బనుపేరఁ బ్రసిద్ధంబుగాఁ బలుకుచుండుదురు.
మఱియు శుక్రమతంబువా రిట్టి విజిగీషుమండలంబు రాజులు
పదుగురును మధ్యమోదాసీను లిరువురునుం గూడి పన్నిద్దరు
దొరలఁ గలయది యగుటం జేసి ద్వాదశరాజమండలంబునకే
తొలుతఁ జెప్పఁబడిన యమాత్యాది పంచప్రకృతిభేదంబుల
వలనను స్వామ్యాది సప్తప్రకృతిభేదంబుల వలనను విజిగీష్వ
రులకుఁ గార్యంబువలన నయ్యేడు నుభయార్యుభయ మిత్ర