ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రాల్లో, సారస్వతవిహారాల్లో తనను మీరేవారు, ఆకాలంలో మరొకరు లేరనిపించాడు. సామ్రాజ్యపోషణలో అప్రమత్తుడుగా కళాసామ్రాజ్యాన్ని కూడా తోడునీడల్లో వర్ధిల్లచేశాడు. దేశంలో ప్రజల కన్నులూ మనసులూ ఆనందంతో విప్పారించాడు.
సముఖ మేకటకృష్ణప్పనాయకుడు[1] చొక్కనాథుని దళవాయి. కావ్యగీతావినోదాల్లో అతనితో సరిసమానుడుగా అరమరికెలు లేకుండా
- ↑ .........జైమిని భారతమునందుగూడ నీతనివంశావతార మభివర్ణింపఁబడియుండును గాని, పరిషత్తునకు దొరికిన ప్రతులయందు నవతారికాభాగము పోయినది. శేషము వేంకటపతికవి తనవంశావతారమును వర్ణించినట్లుగా నొక్కరీతిగా సారంగధరచరిత్రయందు, నహల్యాసంక్రందనమునందును, వర్ణించుకొనిన యాతని వంశక్రమ మిట్లని తెలియుచున్నది.
కేశవప్పనాయడు (మూలపురుషుడు)
|
వేంకటనాయడు
|
పెదగురవప్పనాయడు
|
ఎల్లి సెట్టినాయడు
|
వేంకటనాయుడు = వేంకటాంబ
|
మీనాక్షినాయడు = అలమేలమ్మ
|
వేంకటకృష్ణప్పనాయడు.—జైమిని భారతభూమితే, ఆం. సా. పరిషత్.