తెలుగు జనమాధ్యమాల దినోత్సవం-
సెప్టెంబరు 19 డా॥ నాగనూరి వేణుగోపాల్ 9440732392
ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్మికత, హాస్యాల మేళవింపు తాపీ ధర్మారావు సాహిత్య విమర్శ
ఇది క్వారంటైన్ కాలం...లాక్ డౌన్ టైం! తాపీ ధర్మారావు... లాక్డౌన్లో ఉన్నారు...మీకు తెలుసా? అయితే ఇది చదవండి
పూర్వపు రీతినే వ్రాసివేద్దామంటే, నా హృదయంలొ కలిగిన మార్చు దానికి ఒప్పుకునేది కాదు. అందుచేత మౌనం కలిగింది నా కలానికి. దీనివల్ల స్నేహితులయిన పత్రికా సంపాదకులకి నాపై కోపం కూడా కలిగింది. ఏమి చేయను? నాపై నాకే కోపం కలిగినపుడు ఇతరులకి కలగదా!...” దీనికి నేపథ్యం ఇది -
“మూడు సంవత్సరాలు - వెయ్యిరోజులు - దాటిపోయాయి. ఒక్క ముక్క అయినా వ్రాయలేదు... ప్రచురించడం అంతకన్నా లేదు. నిజమే, కాని, చదివినది మాత్రం చాలా ఉంది. నేను దగ్గరదగ్గర 40, 50 వేల పేజీల సారస్వతం చదవగలిగాను. సారస్వతం అంటే ఎలాంటి సారస్వతం? దిక్కూమొక్మూ లేని సారస్వతం కాదు. అనుకరణమే ప్రధానమనుకునే సారస్వతం కాదు. జీవం లేని పాత్రలు కావు. జీవకళలు ఉట్టిపడుతూ ఉండే గ్రంథాలు. చాలా ప్రశస్తమైనవి దేశదేశాలలోనూ, ఖండఖండాలలోనూ ప్రఖ్యాతి పొందిన గ్రంథాలు. వందలకొద్ది ఇతర భాషలలోకి తర్జుమా అయిన గ్రంథాలు, అన్ని జాతులవాళ్ళ పొగడ్తల్నీ లక్షలకొద్దీ బహుమానాన్ని పొందిన గ్రంథాలు. ప్రపంచంలోనీ జనులనీ, వాళ్ళ అభిప్రాయాలనీ ఒక్కసారి మార్చివేసిన గ్రంథాలు. రష్యా జర్మనీ, నార్వే, స్వీడను, ఫ్రాన్సు, ఇంగ్లండు, అమెరికా... ఈ దేశాలలో మిక్కిలి ఉత్తమమైన గ్రంథాలు.
ఈ గ్రంథాలు కరువుదీర చదివాను. నా స్వభావాన్ని బట్టి చదివిన వాటిని గురించి విమర్శించుకున్నాను. ఆలోచించు కున్నాను. తరువాత ఆయా దేశాలలో ఆ గ్రంథాలను గురించి విమర్శనలు చూశాను. నోబెల్ మొదలైన గొప్ప గొప్ప బహుమానాలు ఈ గ్రంథాలకెందుకిచ్చారో తెలుసుకున్నాను.
దీని అంతటివల్ల నా అభిప్రాయాలు చాలా ఎక్కువగా మారిపోయాయి. మారక తప్పదు ఆ గ్రంథాలని చూచిన తర్వాత. సారస్వతం అంటే ఏమిటి? భాష ఎటువంటిది? భావం ఎలాగుండాలి? కవి ఎటువంటివారు? .... గురించి నా అభిప్రాయాలు మారిపోయాయి... పూర్తిగా మారిపోయాయి.”
ఈ మాటలన్నీ తాపీ ధర్మారావు 1936 సంక్రాంతి సంచిక నుంచి గూడవల్లి రామబ్రహ్మం నడిపిన “ప్రజామిత్ర ' పత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడిన 'కొత్త పాళి ' తొలి నాలుగు పేరాలు!
1933 నుంచి 1936 మధ్యకాలంలో తాపీవారు రాయకుండా చదివిన సమయం. ఏమి చదవాలి, ఎలా చదవాలి - అనే ప్రశ్నలకు వారు ఇచ్చిన జవాబుగా ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉంది. చదివిన తర్వాత తన స్వభావాన్ని బట్టి విమర్శించుకున్నారు, ఆలోచించుకున్నారు. తర్వాతనే ఇతరులు ఆ గ్రంథాల గురించి వ్రాసింది చదివారు. ఈ ధొరణి మనం ఎదగడానికి దోహదపడే విధానం. ఈ దశ పూర్తి చేసేటప్పటికి ధర్మారావు వయసు నలభైకు మించలేదు. తాపీవారిని వ్యావహారిక భాషా వైతాళికుడిగా మనం కొనియాడుతాం. ఘనమైన పత్రికా సంపాదకుడిగా గౌరవిస్తాం, తెలుగు సినిమాలకు చక్కని భాషను, స్కీన్ ప్లే విధానాన్నీ ఇచ్చిన దార్భనికుడిగా కీర్తిస్తాం. అయితే ఆయనను తెలుగు సాహిత్య విమర్శకుడిగా కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం చాలా ఉంది అనిపిస్తోంది.
లాక్ డౌన్ టైంలో మళ్ళీ ఇనుప కచ్చడాలు, దేవాలయాలపై బూతు బొమ్మలు, సాహిత్యమొర్మరాలు, పాతపాళీ, కొత్తపాళీ పుస్తకాలను జాగ్రత్తగా చదివాను. సాహిత్య విమర్శను కూడా బొరుగులు తిన్నంత సులువుగా అందివ్వగలిగిన ప్రతిభాశీలి తాపీ. కొత్తపాళీ గురించి చాలామంది రాశారు, శ్లాఘించారు, తాపీవారికి పర్యాయపదంగా వాడారు. అయినా ఇప్పటికీ తెలుగు పాఠకులు కొత్తపాళీని కొత్తగా సమగ్రంగా, సవ్యంగా చూడాల్సి ఉందేమో అనిపిస్తోంది. అందుకే ఈ విశ్లేషణ.
నిజానికి తాపీ ధర్మారావు 'కొత్తపాళీ ' ద్వారా సాహిత్యరచనకు ఒక సిలబస్ రూపొందించారు. ఏదిసాహిత్యం? ఎవరికోసం ఆ సాహిత్యం? దాని ఉద్దేశ్యం (విషయం) ఏమిటి? ఎలా ఠాయాలి? అలానే ఎందుకు రాయాలి? - అనే విషయాలపట్ల సమగ్రమైన అవగాహన కల్షిస్తారు. అలాగే కవి లేదా రచయిత నిల్ఫున్న కాలానికి, సమయానికీ - గతాన్నీ గత సాహిత్యాన్ని ఎలా చూడాలి? ఏమి స్వీకరించాలి అలాగే భవిష్యత్తులో బాధ్యత ఏమిటి అనీ కూడా చాలా సులువుగా బోధపడేట్టు విశ్లేషిస్తారు వారు.
సాహిత్య విమర్శకుడిగా ధర్మారావులో అ) పాండిత్యం ఆ) విశ్లేషణ ఇ) ఓపిక విశేషంగా ఉన్నాయి. అంతకుమించి వారిలో మనం చూడాల్సినవి అ)సాహిత్య విమర్శను చదివించేదిగా రాయడం అ) హస్యాన్ని వ్యంగ్యాన్ని వెటకారాన్నీ పుష్కలంగా వాడటం ఇ) ఎటువంటి ద్వేషం లేకుండా సహనం, సమన్వయంతో కూడిన దృష్టితో సాహిత్య పరిశీలన ఈ) హేతుబద్ధంగా ఏది ప్రయోజనకరమో, కాదో అని విశ్లేషించి చూపడం. బు) తెలుగునూ, తెలుగు సాహిత్యాన్నీ నెత్తిన పెట్టుకుని అవి మరింత ఉజ్జ్వలంగా ఉండాలనడం. - వెరసి నవనవోన్నేషంగా తెలుగు సాహిత్య విమర్శకు కొత్తచూపు ఇవ్వడం!
మూడు సంవత్సరాల అద్యయనం తర్వాత వెలువరించిన వ్యాస సంపుటి - కొత్తపాళి. ఈ వ్యాసాలను 1955లో పుస్తకంగా వెలువరిస్తూ ఇలా అంటారు.
..నాకు సంస్కృతం మీద పదద్వేషమని కొందరయ్యలంటూంటారు.