నా పర్యవేక్షణలో నేర్చుకొన్నారు. ఇలా చెప్పండి అని తల్లిదండ్రులకు వివరించి, 1,2, వాచకాలు ఇచ్చి పంపిస్తాను. తల్లిదండ్రుల సహకారంతో పిల్లలు నేర్చుకొన్నారు.
1,2, తరగతుల వాచకాలు తయారు చేసుకోవడం :
ఈ పద్దతిలో ఎవరికి వారు 1,2 తరగతుల వాచకాలు తయారు చేసుకోవటం అవసరం. ఎందుకంటే పిల్లలకు తెలిసిన పదజాలం జిల్లా జిల్లాకు మారుతుంది. గిరిజనుల పదజాలం వేరుగా ఉంటుంది. కనీసం 1వ తరగతి వారికైనా వాచకాలు తయారు చేసుకుంటే మంచిది.
గుర్తుంచుకోండి - కాలం మారింది. అనేక అశాస్త్రీయమైన భావాలు, సంప్రదాయాలు మన విశ్వాసంలో ఉంటాయి. సులువైన మంచి మార్దాలెన్నుకోడానీకి మనసు గింజుకులాడుతుంది. మనం ఆలోచించాలి.
వినడం ద్వారా మాట్లాడడం నేర్చుకొంటారు. చదవడం ద్వారా రాయడం నేర్చుకొంటారు. కింది తరగతిలో రాతకు ప్రాధాన్యత తగ్గించి చదవడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
తెలుగు త్వరగా సులభంగా నేర్చడంలో ఇవి నా అనుభవాలు. ఇంకా చాలామందికి చాలా అనుభవాలు ఉండవచ్చు. ఇలా అనుభవాలు ఉన్నవారు వారి అనుభవాలను కూడా పంచుకోవాలని కోరుకున్నాను. “అవి ప్రత్యక్షంగా తామ పిల్లలకు చెప్పి చూసిన అనుభవాలె ఉండాలి. ఊహలుకాదు.
పదవ తరగతి వరకు చదివి, తప్పులుపడతాయేమోనని భయపడి తెలుగును ఉపయోగించుకోలేని యువకులకు వారం రోజులపాటు రోజుకు గంట చొప్పున చెప్పి, ఉద్యోగంలో చేర్చిన ఒక అనుభవాన్ని. వచ్చే సంచికలో వివరిస్తాను -రచయిత.
ఈశాన్య రా(్షైల జనజాతుల భాషలకు....
11వ పుట తరువాయి.......
తీసుకోవాలి. ఇవన్నీ విద్వా విధానంలో చేర్చలేదు. భాషగా ఆంగ్లం నేర్పే పద్దతి సమూలంగా మార్చి, సంభాషణలకు, బయట వాడుకకు అవసరమైన ఆంగ్లం మాత్రమే నేర్చి, మిగితా సమయం మాతృభాషల అధ్యయనానికి కేటాయించాలి. కానీ పరిస్థితి అలా లేదు. విద్యావిధానంలో ఒక పక్క మాతృభాషల/ప్రాంతీయ భాషల పరిరక్షణ ఊసూ లేదు, పనికొచ్చే ఆంగ్లం నేర్పే విషయమై ఎలాంటి సూచనలు లేవు. రెంటికీ చెడ్డ రేవడిలా విద్యార్థుల బ్రతుకులు తయారయ్యేలా ఉంది. అమలులో కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలపై మాతృభాషా మాధ్యమ అంశం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై ఎంత జాగరూకతతో వ్యవహరిస్తున్నాయో మనకు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంది. ఎంత అల్పసంఖ్యాక భాషీయులున్నా ఒక భాషను మాతృభాషగా కలిగిన 40 మంది పిల్లలున్నా ఆ భాషలో బోధించే ఒక ఉపాధ్యాయురాలిని/ఉపాధ్యాయుడిని అందుబాటులో ఉంచాలన్నది మన స్వాతంత్య్రానంతర ప్రభుత్వ ఉద్దేశ్యం. డెబ్బై ఏళ్ళ తరువాత పూర్తి సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ తరుణంలో ఒక్క విద్యార్ధి కోరినా వారి మాతృభాషలో విద్యను అందించగలిగే అవకాశం నేడు కలదు, ప్రత్యక్షంగా ఉపాధ్యాయులు ఉన్నా లేకపోయినా! అయినా ఈ విద్యావిధానం ఆ విషయమై స్పష్టతను ఇవ్వలేదు.
భావ ప్రకటనకు, సాంకేతిక విషయాలకు, విజ్ఞాన సంబంధ విషయాలకు భారతీయ భాషల్లో ఉన్నంత పదసంపద బహుశా వేరే భాషల్లో దొరకవచ్చేమో. వందల ఏళ్ళ చరిత్ర గల భాషలు అన్ని శతాబ్టాల జ్ఞానాన్ని తమలో ఇముడ్చుకున్నాయి. ఖారతదేశ సాంస్కృతిక, సామాజిక వారసత్వాన్ని పదిల పరచాలంటే బహుభాషా సమాజంలో అన్ని భాషలు మనగలిగే పరిస్థితి రావాలి. భాషా రాజకీయాలకు స్థానం ఉండకూడదు. ఆంగ్లానికిచ్చిన అనవసరపు హోదాను వెంటనే తీసివేసి అన్ని భాషలు సమానమే అని చాటాల్సిన విద్యావిధానం, మళ్ళీ తిరిగి ఆంగ్లం వైపుకు, హిందీ వైపుకు, సంస్కృతం వైపుకు పక్షపాతం వహించడం సరైన పద్ధతి కాదు.
జనజాతుల పిల్లలను వారికి నంబంధించిన చరిత్రా సంస్కృతులు వారికి పరాయి అయిన భాషల్లో చదివించడం రాజ్యాంగ విరుద్ధం. జనజాతుల సంరక్షణ కోసం రూపొందించిన ఎన్నెన్నో విధాన చట్టాలను హేళన చేసేలా విద్యా విధానం మిగిలిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 21వ శతాబ్దంలో భారతదేశం తన స్వదేశీ జనజాతులకు వారి వారి మాతృభాషల్లోనే విద్యను అందించాలి. అ విద్య ఇంతకు ముందు జరిగిన తప్పిదాలను సరిదిద్దే దిశగా మరింత సృజనాత్మకంగా, సరికొత్తగా, అందరినీ కలుపుకుపోయేదిగా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉన్న మన ప్రభుత్వం ప్రజలను విద్యాపరంగా మరింత చైతన్యవంతులని చేసే విధంగా, ప్రతి ఒక్కరి సామాజిక-అర్జిక అభివృద్ధికి దోహద పడేదిగా ఉండాలని ఆశిద్దాం. కానిపక్షంలో మన హక్కుల కోసం పోరాడి సాధించుకుందాం.
కాళోజి పుట్టినరోజు: సెప్టెంబరు 9: తెలుగు మాండలిక భాషాదినోత్సవం
“ఏ భాషరా నీది ఏమి వేషమురా
ఈ భాష ఈ వేషమెవరికోసమురా
అంగ్రమందున మాటలాడగలిగిననే
వింతగా చూసెదవు ఎందుకోనమురా
సూటుబూటు హేటు సోకుగా తొడుగ
ఘనతేమి వచ్చెరా గర్వమేటికిరా
తెలుగుబిడ్డ, వయుండి, తెలుగురాదంచు
సిగ్గులేకా ఇంక చెప్పుడెందుకురా
దేశభాషలందు తెలుగులెస్స యటంచు
తెలుగుబిడ్డా ఎవుడు తెలునుకుందువురా
తెలుగుబిడ్డవయుండి తెలుగు మాట్లాడేందుకు
సంకోచపడేవు సంగతేమిటిరా
అన్యభాషలు నేర్చి అంధ్రమ్ము రాదంచు
సకలించు అంధ్రుడా చావవెందుకురా![”