Jump to content

పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపయోగం కదా! ఇందుకు పదపద్ధతి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.

పద పద్ధతి :- పదపద్దతిలో కూడా అక్షరాలే నేర్చిస్తాం. కాకపోతే అక్షరాలు దేనికది విడిగా కాకుండా ఒక పదం ఆధారంగా నేర్పిస్తాం. ఈ పదాలు పిల్లలకు బాగా తెలిసినవై ఉండాలి. ఆ పదానికి జొమ్మకూడా ఉండాలి. తెలిసిన దాని ఆధారంగా తెలియంది నేర్చుకొంటారు. పలక అనే వస్తువు తెలుసు. పదం తెలుసు. కాని పలకలోని అక్షరాలు తెలియవు. ఈ తెలియని లిపిని తెలిసిన పదం ద్వారా నేర్చుకోవడం శాస్త్రీయం.

1. అక్షరాలు వరుసగా నేర్చడానికి కుదరదు. ఏ అక్షరాలు ఎక్కువ మన మాటల్లో వస్తాయో ఆ అక్షరాలను ముందుగా నేర్పించాలి. ఎందుకంటే ఆ అక్షరాలతో మరిన్ని పదాలను సృష్టించవచ్చు. ఉదా: పలక - అనే పదంలోని మూడు అక్షరాలతో- కల, పకపక, లకలక, అనే మూడు పదాలు వస్తాయి. రెండో పాఠంలో “పడవ” అనే పదం నేర్చిస్తాం. ఇందులో 'ప” మొదటి పాఠంలో వచ్చింది. డ,వ, రెండక్షరాలు కొత్తవి. మొత్తం ల,క,డ,వ,- ఈ నాలుగు అక్షరాలతో కల, వల, వద, కడవ, కడప, పడక, - 6 పదాలు కొత్తవి వచ్చాయి. పడవ అనే పాఠంకింద - 6 పదాలు ఉంటాయి. వీటిని పిల్లలు చదవాలి. ఇలా ఒక్కోపాఠం చెప్పుకుంటూ వెళ్లేటప్పుడు పాత పదాల్లోని అక్షారాలన్నీ కొత్త పాఠాల్లో వస్తూ ఉంటాయి. పది పాత అక్షరాలలో ఒక కొత్త అక్షరం గుర్తు పెట్టుకోవడం సులభం. గుర్తుకురాకపోతే బొమ్మ ఆధారంగా గుర్తిస్తాడు. అంటే పదిపాఠాల తర్వాత టీచర్‌ సహాయం లేకుండానే తమకు తాము నేర్చుకోగలరు. ఇదే స్వయం అభ్యాసనం.

2. పాత అక్షరాలు ఎప్పుడూ ఎదురవుతూ ఉంటాయి గాబట్టి మరిచిపోవడం ఉండదు. అక్షరాలను గుర్తుకు తెచ్చుకోవడానికి పదాన్ని ఉపయోగించుకొంటారు. పలకలో 'ప పలకలో “క అంటూ గుర్తుకు తెచ్చుకొంటారు.

3. ఒకేసారి అక్షరాలు నేర్చుకొంటూ చదవడం కూడా నేర్చుకొంటారు. పిల్లలకు ఒక క్రీడగా ఉంటుంది. వుస్తకం చదువుతున్నామనే నమ్మకం ఏర్పడుతుంది. ఆత్మ విశ్వాసం కలుగుతుంది.

పాఠం ఎలా చెప్పాలి?

1. పైన బొమ్మను చూవించి బొమ్మ పేరు చెప్పమనాలి. బొమ్మ పేరు చెవ్పగానే ఆ పేరు కింద అక్షరాలలో ఉంది చదవమనాలి. పిల్లలు చదవలేకపోతే మనం చదివి వినిపించాలి. పదంలోని అక్షరాలను విడివిడిగా పలికించాలి. కింద పదాలను కూడా చదివి వినిపించాలి. ఇలా జరిగిన తర్వాత పాఠం యొక్క పద్దతి అర్ధమవుతుంది. పిల్లలు వేగం అందుకొంటారు.

2. మొదట అక్షరాలు విడివిడిగా పలికి పదం చదవడం అలవాటు అవుతుంది. నాలుగైదు పాఠాలు జరిగిన తర్వాత విడిగా అక్షరాలు చెప్పకుండా ఒకేసారి పదం చదవడం అలవాటు చేయాలి. లేకపోతే విడివిడిగా చదివి వదం చదివే పద్దతి చాలా రోజులు కొనసాగుతుంది. ఇది పిల్లలకు ఏంతో శ్రమ.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

1. మనం పదాలు పలికించేటపుడు పిల్లలు అదే పదాన్ని చూస్తూ ఉండాలి. తమ వేలును ఆ పదం పైన ఉంచి పలికే అలవాటు చేయాలి. ఎప్పుడు చదువుతున్నా వేలు ఆ పదంపై ఉండేటట్లు అలవాటు చేయాలి. లేకపోతే చూపు చదివే వరుసనుండి పక్క వరుసలోకి వెళుతుంది. ఇవన్నీ చాలా చిన్నవిషయాలనిపించవచ్చు. పలికే పదాన్ని కాకుండా వేరే పదాన్నిచూస్తే మొత్తం గందరగోళం అవుతుంది.

2. పిల్లల్ని హైరానా పెట్టకూడదు. సాధ్యమైనంతవరకూ సొంతంగా చదవనీయాలి. ఆలస్యమవుతూ ఉంటుంది. పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు. మనం తొందరపడి ఆ పదాన్ని చెబితే పిల్లలు నిరుత్సాహ పడతారు. వాళ్లకు ఎలాంటి ఆసక్తి ఉండకుండా సోతుంది. మన సాయం కోనం ఎదురుచూస్థూ స్వతంత్ర ప్రయత్నం మానుకుంటారు.

3. ప్రతిరోజు వెనకటి ఒకటి రెండు పాఠాలు చదివిస్తూ ఉండాలి. నేర్చుకున్న కొత్త పాఠాలు స్వయంగా టీచరు వినాలి. లేదా పెద్ద పిల్లల్ని సహాయకులుగా నియమించుకోవచ్చు.

అక్షరాలు నేర్చిన క్రమం : (మేము రాసిన వాచకాలలో)

1వ తరగతి :- 1. అఆ, ఇఈ, ఉఊ, ఎఏ, ఒ,ఓ,౦ కచటతప, గజడదబ, నమయరలస - (28 అక్షరాలు) - హల్లులకు గుణింతాలు.

2. అన్ని అక్షరాలకు ఒక గుణింతం పద్దతిలో నేర్పడం జరిగింది. కా,పా,దా,తా,లా పదాలతోపాటు జంట పదాలు, విశేషణంతో కూడిన పదాలు, వాక్యాలు

3. ఒక పాఠం , ఒక కథ, ఒక ఉత్తరం .

4 మధ్యమధ్యలో టీచర్‌ పాడి వినిపించి పిల్లలకు చేర్చడానికి పాటలు, గేయాలు, పాఠం చివర అభ్యాసాలు - రాతకోసం

2 వ తరగతి :

1. సారూప్య ద్విత్వాలు -ప్ప, చ్చ, ట్ట, డ్డ,
2. వైరూప్య ద్విత్వాలు - క్క,త్త, న్న, మ్మ
3. సారూప్య సంయుక్తాలు - ర్బ, ద్ద, ర్గ
4. వైరూప్య సంయుక్తాలు -ర్క, ర్మ, ర్న
5. వత్తు అక్షరాలు - ఖ, ఘ,ఛ, ఝ,
6. ఐ, ఔ,శ, ష,హ,ణ,ఞ,ఙ - క్‌ ర్‌ హల్లులు

పాఠాలన్నీ గేయాలు, పాటలు, వ్యాసాలు, కథల రూపంలో ఉంటాయి. ఈ పద్దతిలో జనవిజ్ఞానవేదిక తరపున 50 మంది టీచర్లు చర్చోపచర్చలు చేసి రూపొందించిన వాచకాలు - తేట తెలుగు-1, తేట తెలుగు - 2, . నేను స్వయంగా మూడేళ్లు 1,2 తరగతుల పిల్లలకు చెప్పిచూసాను. నేను హైస్సూల్లో సీనియర్‌ తెలుగు పండితుడిని. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో మూడేళ్లు ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసాను.

నేను. విజయవాడ పోరంకిలో ఉంటున్నాను. “వికానవిద్యావనం” బడితో అనుసంధానమై ఉన్నాను. అక్కడ ప్రాథమిక విద్య వరకు తెలుగు మీడియం, 6 నుండి ఇంగ్లీషు మీడియం. 5 లోపు చేరే పిల్లలకు తెలుగు వచ్చి తీరాలి. ఇతర దేశాల నుండి - ఇతర రాష్ట్రాలనుండి వచ్చిన పిల్లలకు తెలుగు రాదుకదా. అలాంటి పిల్లలు 2,3,4 తరగతుల పిల్లలు రోజుకు గంటచొప్పున రెండు మూడు నెలల్లోనే ఇతర పిల్లలతో సమానంగా