" తొత్తమాట
స.వెం.రమేశ్
కొత్తమాటల పుట్టింపు
(శ్రా
“అన్నయ్యా, నువ్వేమో తెలుగుమూటలకు గూటాలు ఉండవు, ఉండకూడదు అంటావు. అయితే అన్నీ ఆకికల్లోనూ అందరూ, ముప్పై, నలబై, ఏవై,డెబ్సై,తొంబై అనే మాటలకు గూటలను పెట్టే రాస్తున్నారే! ఇవి తెలుగుమాటలు కావా, లేకుంటే కావాలనే తప్పుగా రాస్తున్నారా?” అడిగినాడు చిన్నయ్య.
“నాకు కూదా చాన్నాళ్లుగా అరగలి(సందేహం) ఇది. ఇవి తెలుగు మాటలే. మూడుపదులు ముప్పది. అదే ముష్పయి అయింది. “పదిలో “వకు గూటం లేదుకదా. ముప్పయి, నలబయి, ఏబయి, డెబ్బయి, ఎనబయి, తొంబయిలలో ఎలా వచ్చిందో!” నారాయణ కూడా అడిగాడు.
“అబ్బాయిలూ చెపుతాను వినండి. మీజేకాదు, తెలుగు వ్రాతలు నేర్చుకాన్నప్పటి నుండి నాకు కూదా అరగలే ఇది. కొన్నేళ్ల కిందట జరిగిన ముచ్చటను చెప్పాలి ఇక్కడ. ఏడాది నాకు సరిగా గురుతు లేదు కాన్సీ తెలుగు తెలివరులు, తెలుగునుడికి కూడా చెన్నుడి(శ్లాసికల్ లాంగ్వేజ్) గుర్తింపు ఇవ్వాలని గట్టిగా అడుగుతున్న నాళ్లు అవి. మైసూరులో బారతనుడుల నట్ట తెట్టువ(సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అఇందియన్ లాంగ్వేజెస్) నుండి నాకూ మా బాబాయికీ పిలుపు వస్తే బయలుదేరి వెళ్లినాం”
“బాబాయి అంటే అమ్మనుడి ఆకిళ కూర్చరి సామల రమేష్బాబుగారే కదా” నడుమన దూరి అడిగినాడు చిన్నయ్య.
“అవును ఆయనే. అప్పుడు ఆకికపేరు అమ్మనుడి కాదు, నడుస్తున్న చరిత్ర అనీ ఉందేది. మేమిద్దరమూ నుడివరులం కాము. కానీ తెలుగు ఎదుగుదల మీద అక్మర ఉన్నవాళ్లం. అందుకే కావచ్చు మాకు కూడా విలుపువచ్చింది. మునివావు వేళకు మ్రైసూరుకు వెళ్లినాం. మాకు ఒక విడిదిలులో ఒక గదిని చూపించినారు. పైకి పోసుకొని(స్నానమాడి), ఉడుపులు మార్చుకొని, విడిదిలు బయటకు వచ్చినాం. చక్కని వచ్చికబయులులో చల్లగా కూర్చుని ముచ్చట్లాడుకొంటున్నారు. ఏడెనీమిదిమంది పెద్దలు. అందరూ తెలుగువారే. అందరూ నుడివరు(బాషావేత్త)లే. మేము వెళ్లి వాళ్లతో కలినినాం. నాకేమో కాస్త జంకుజంకుగా ఉంది. ఎందుకంటే నుదెసిది(బాషాశాస్త్రం)లో తలపండిన వాళ్లు వాళ్లంతా. ఏం మాట్లాడితే ఏం చిక్కు వస్తుందో అని మెదలకుండా కూర్చునున్నాను. వారిలో నేనెరిగిన వారు ముగ్నరున్నారు. బాబాయి నోరు విప్పినారు. ముప్పయి, నలబయి వంటి తెలుగుమాటలకు గూటాలు పెట్టడం తప్పుకాదా అని అడిగేసినారు...”
“ఏమయింది ఆనక? నువ్వు అడిగుంటే మారాదకపోయి ఉండవచ్చు. పెద్దాయనే అడిగేసినారు కదా, ఏదో ఒకటి చెప్పుందాలే” తమిగా అడిగినాడు చిన్నయ్య, నడుమన మూరి.
“అవును చిన్నయ్యా, నువ్వన్నది నిక్మమే. ఆ మాటను నేను అడిగి ఉంటే పట్టించుకాని ఉండరు. నన్నేమిటి, పెద్దాయననే
| తెలుగుజాతి పత్రిక అవ్మునుడి ఆ మార్చి-2021 |
పట్టించుకోలేదు కాసేపు. ఇంకా నొప్పి కొద్దిగానైనా సలుపుతూవే ఉంది నన్ను ఇప్పటికీ. అంచల గుంపులోకి రెండు కాకుల వెళితే ఊరుకొంటాయా, చీదరించుకొంటాయి, పొడిచి తరుముతాయి. కానీ వెళ్లింది కాకులు కాదు, పదునైన గోళ్లూ ముక్కులూ ఉన్న (గ్రద్దలు. తరుమలేక పట్టించుకోనట్లు ఊరుకొన్నాయి...”
“అన్నయ్యా, వెళ్ళసం మాటలాడవద్గని నన్ను ఎమ్రుడూ కసరుతుంటావు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావేమిటి?” అన్నాడు చిన్నయ్య.
“చిన్నయ్యా, నడుమన దూరకు. అన్నయ్యను మాట్లాదనీ. ఇంకా ఎన్నాళ్లని ఈ తలవంపుల్ని దాచిపెట్టుకాని ఉంటాడు. బయటపెట్టనీ. అన్నయ్యవి వెళ్కనప్పు మాటలు కావు. నొప్పితో పలుకుతున్న పలుకులు. చెప్పనీ ఊరకుందు” అన్నాడు నారాయణ.
“సరే అన్నయ్యా, నడుమన దూరను. ఇంతకీ ఏమయిందో చెప్పూ” అడిగినాడు చిన్నయ్య.
“కాసేవు పట్టించుకోనట్లు ఉండి, వారిలో ఒకరు, “అవి రూడి(వాడుక) అయిపోయిన మాటలండీ, వాటిని ఇప్పుడేమీ చేయలేం” అన్నారు. “ఏదో చేయాలని కాదండీ, అలా వాడడం సరయినదేనా” అన్నారు బాబాయి. 'నరయినదే. అది తెలియాలంటే, మీకు 'దావిడనుడులన్నీటి గురించీ కొంతయినా తెలిసుండాలి. నుడెపిదిని సుంతయినా చదివుందాలి. తమిళంలో ముప్పదు, నాప్పదు అనే మాటల్లో “ప్ వినిపిస్తుంది కదా. అదే పెద్దుసురు(మహాప్రాణం)గా మారింది తెలుగులో. దానినీ గూటం అనకూడదండీ” అని తేల్చేసినారు. ఇంకొక పెద్ద. వేను ఊరుకోలేక, 'మరి ఐంబదు, ఎళువదు, ఎంబదు, తొన్నూరులలో “ఏ లేదు కదండీ. ఏబయి, డెబ్బయి, ఎనబయి, తొంబయిలకు గూటాలు ఎందుకొచ్చినాయి?” అని అడిగినాను. వారి మోము నల్లబడింది. ఇంకొక పెద్ద కల్పించుకొని, *“తినేని వడుకోవాలి కదా లేవండి” అంటూ ముగించేనినారు. పొగరుతో చెప్పుతున్నది కాదు నారాయణా. 'ద్రావిడనుడులు అన్నిటి గురించీ కొంతయినా తెలిసుండాలి అనీ, తమిళాన్ని ఆనుగా తెచ్చుకొన్న పెద్దకంటే, నాకే ఎక్కువ తమిళం తెలుసు. అది వారికి అప్పటికి తెలియదు అంతే. ఇటువంటి పట్టనితనాలూ పక్కకు తోసివేయదాలూ పిలిచి గొడవ పెట్టుకోవదాలూ చాలా చేసినారు నాపట్ల కొందరు. ముందుముందు మరికొన్ని చెప్పుకాందాంలే” అంటూ మారాడినాను.
“ఇంతకీ ఆ ముగ్గురిపేర్లు చెప్పనేలేదు అన్నయ్యా నువ్వు” అడిగినాడు చిన్నయ్య,
“అక్కరలేదు చిన్నయ్యా, చెప్పాలనుకొని ఉంటే అన్నయ్యే చెప్పేవాడు కదా” అన్నాడు నారాయణ.
“అవును చిన్నయ్యా, వాళ్లు ముగ్గురూ నిక్కంగానే చాలా గొప్పవారు. తెలుగునుడికి ఎంతో ఉడిగం చేసినారు. పేర్లు అచ్చుకు