పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మూలం: మానవవనరుల అభివృద్ది మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం 2017-2018 నివేదిక.

చదివిన విద్యార్థులకంటే చదవడంలోనూ, రాయడంలోనూ, ఆలోచనా విధానంలోనూ ఎక్కువ సృజనాత్మకత కలిగి ఉన్నారని తెలిపారు.

మాతృభాష విద్యామాధ్యమ ప్రయోజనాలు:

  • విద్వకు ఖర్చు తక్కువ అవుతుంది
  • తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలు నేర్చుకోవచ్చు
  • ఇంటి భాష- బడి భాష అనే అడ్డుగోడలు ఉండవు
  • పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకుంటారు
  • గ్రహణ శక్తి పెరుగుతుంది
  • తరగతి గదిలో చురుకుగా పాల్గొంటారు
  • ప్రశ్నించే తత్వం పెరుగుతుంది
  • సృజనాత్మకత పెరుగుతుంది
  • బడి మానేసే వారి సంఖ్య తగ్గుతుంది

'యువతకు పారిశ్రామిక శిక్షణా మాధ్యమ భాషా

ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశాలలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. ౩56 మిలియన్ల యువత కలిగిన దేశం ఆర్థికంగా ఇంకా వెనుకబాటులోనే ఉంది. పారిశ్రామిక వెలుగుబాటతో మానవ అభివృద్ది విషయాలలో ఇప్పటికీ అభివృద్ది చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. దేశానికి బలం అని చాటే విధంగా నేటి యువత పారిశ్రామిక రంగంలో దూసుకుపోవాలని కేంద్ర ప్రభుత్వం 'మేక్‌ ఇన్‌ ఇండియా” ద్వారా యువతను పారిశ్రామిక పరంగా ప్రోత్సహిస్తున్నారు. దీని ద్వారా 2025 నాటికి పారిశ్రామిక రంగంలో 25% జాతీయ స్తూల ఉత్పత్తి(GDP) పెరిగే ఈ విధంగా లక్ష్యాన్ని రూపొందించారు. మన దేశంలో గ్రామీణ పట్టణ యువతకు కావాల్సిన శిక్షణనిస్తూ... వస్తుఉత్పత్తి, పర్విశమల నిర్మాణం, వాటి అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అదేవిధంగా “స్కిల్‌ ఇండియా” 'పేరుతో 40 కోట్ల మంది యువతకి, మహిళలకి శిక్షణ ఇచ్చి 2022 నాటికల్లా నైపుణ్యం గల యువతను, మహిళలను తయారుచేయాలని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే యువత, మహిళలు నైపుణ్యాన్ని నేర్చుకోవాలన్న పనికి కావాల్సిన అవగాహన కలగాలన్నాా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా శిక్షణ పాఠ్యాంశాలు స్థానిక భాషలో ఉండాలి. గ్రామీణ పేద మధ్యతరగతి యువకులకు నైపుణ్యత కేవలం వారి స్థానిక భాషలతోనే సాధ్యపడుతుంది. స్కిల్‌ ఇండియాలో ఉన్న వివిధ విభాగాలు మరియు శిక్షణ కార్యక్రమాలు స్థానిక భాషల్లో లేకపోవడం వలన అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కష్టమవుతుంది. కాబట్టి స్థానిక భాషల ప్రాముఖ్యతను తెలుసుకుని శిక్షణ కార్యక్రమాలను, పుస్తకాలు స్థానిక భాషల్లోకి అనువదించినట్లయితే దేశ ఆర్థికాఖివృద్ది మరింత వేగంగా జరుగడానికి అవకాశం ఉంటుంది.

దేశంలో ఉన్న ప్రతి రంగానికి కేంద్ర బిందువు పాఠశాలలే. ప్రాథమికవిద్య దేశ భవిష్యత్తుకి ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టీ పిల్లలకు ప్రాథమిక విద్యను 8వ తరగతి వరకు మాతృభాషలోనే అందించడం ఉత్తమం. నూతన విద్యావిధానం కూడా అన్ని భాషలకు, సంస్కృతులకు సమాన న్యాయం అందించేలా ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలకు మంచి వసతులు కలిగిస్తూ నాణ్యమైన విద్యను మాతృభాష అందించడానికి కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చిత్తశుద్దితో పని చేయాలి. విద్వారంగానికి జాతీయ స్తూల ఉత్పత్తిలో 4.6 శాతం నుండి 6 శాతానికి పెంచాలని విద్యావేత్తలు ప్రతిపాదించినట్టుగా కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలి. విద్యపై పెట్టే పెట్టుబడితో దేశానికి ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించుకోగలము. శిక్షణ మాధ్యమంలోనూ స్థానిక భాషల పాత్రను గుర్తెరిగి, అమలుపరిచినట్టయితే దేశంలో యువత నైపుణ్యతతో మరింత బలోపేతమయ్యి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుగా నిలుస్తారు. మాతృభాష విద్యామాధ్యమమే దేశ అర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది.

ఈ వ్యాసరచయిత పరిశోధక విద్యార్ధి, హైదరాబాదు విశ్వవిద్యాలయం.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

22