పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్యామాద్యమం

జె.డి.ప్రభాకర్‌ 8500227185

మాతృభాషా విద్యామాధ్యమం - దేశ ఆర్థికాభివృద్ధి


దేశ ఆర్థిక ప్రగతి దేశంలో ఉన్న వనరుల వినియోగం, దానికి కావలసిన నైపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. శ్రామికుల నైపుణ్యాలను మెరుగుపరిచే నాణ్యమైన విద్యతో అది సాధ్యపడుతుంది. మనిషిచేసే ఏ పనికి అయినా మూలం జ్ఞానమే. మానవుడు సంఘజీవిగా ఎదుగుతున్న క్రమంలో అనుభవంలో నుంచి తాను చేస్తున్న పనిని మెరుగు పరుచుకుంటూ సంపద సృష్టి మొదలుపెట్టాడు.పనికి నైపుణ్యాన్ని జోడిస్తూ పనిని ఆధునీకరించాడు. దాని ఫలితమే నేడు కోకొల్లలుగా వెలసిన పరిశ్రమలు, సేవా సంస్థలు మొదలగునవి. దాని కారణంగానే నేటి చదువులు కూడా నైపుణ్యాలను తీర్చిదిద్దే దిశగా మలచడం జరిగింది. దేశంలో ఆరోగ్య రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం, వ్యవసాయం ఇలా ఏ రంగం అయినా పఠిష్టంగా ఉండాలంటే నాణ్యమైన విద్యను అభ్యసించిన వారు వాటిలో పనిచేస్తూ వుండాలి. మానవాభివృద్దిని ఎటువంటి ప్రమాణాలతో కొలిచినప్పటికి వాటన్నిటా ఉమ్మడిగా కనిపించేది-మనిషి సంపాదించిన జ్ఞానము. అభివృద్ధి నాణ్యమైన విద్యతోనే సాధ్యపడుతుంది. విద్యార్థి దశ నుండే పాఠ్యపుస్తకాల ద్వారా వాటిని అభ్యసిస్తూ ప్రగతి దిశగా ప్రయాణించాలని నూతన విద్యావిధానం 2020లో కూడా చేర్చడం జరిగింది. విద్యారంగంలో భాష క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. జూలై 29, 2020న కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన జాతీయవిద్యావిధానం(NEP) పాఠశాలల్లో బోధనా మాధ్యమం సాధ్యమైన చోట 5వ తరగతి వరకు- ప్రాధాన్యంగా 8వ తరగతి వరకు- మాతృభాష లేదా స్టానిక లేదా ప్రాంతీయ భాష ఉంటుందని తెలిపింది. అలాగే కాలానుగుణంగా ప్రభుత్వం కూడా విద్యపై జాతీయ స్థూల ఆదాయం (GDP) పెంచుతూ వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం 2014లో నుండి ఇప్పటివరకు 3.8 శాతం GDP భాగాన్ని 4.6 శాతం GDP భాగానికి పెంచి విద్వారంగాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తోంది. ప్రభుత్వం విద్వారంగంపై ఖర్చు పెట్టడమే కాకుండా అందులో ఉపయోగించే భాష కొరకు కూడా ఖర్చు పెడుతూంది.

విద్యావిభాగం(రెవెన్యూఖాతా)ద్వారా రంగాలవారీగా విద్యపై ఖర్చు.

కేంద్రం మరియు రాష్ట్రాలు/యుటిలు శాతం వాటాతో 2017-18 (రూ. కోటి)

మూలం: మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం 2017-2018 నివేదిక

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికవిద్య పైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించి 48.87 శాతం ఖర్చు పెట్టారని తెలిపారు. మాధ్యమిక విద్యకు ౩1.16 శాతం, విశ్వవిద్యాలయాలు మరియు ఉన్నత విద్యకై 12.80 శాతం, సాంకేతిక విద్యకు 5.78 శాతం ఖర్చు చేసినట్టు వెల్లడించారు.

సమాజంలో ప్రజల ఆర్థిక అసమానతలకు, నిరుద్యోగానికి, పేదరికానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ అందులో విద్యా మాధ్యమం ముఖ్యమైనది. ఇంగ్లీష్‌ మీడియం సమాజంలో ఆర్థిక అసమానతలకు దారితీస్తుంది. అటువంటి చదువులు చదవక స్థామతకు నోచుకోక నిరక్షరాస్యతా, నిరుద్యోగం 'పెరుగుతాయి. మనిషి జీవితంలో ఆహ్వానించదగని విషయాలు చోటు చేసుకున్నప్పుడు మూలాల్లోకి వెళ్లి సమస్యను పరిష్మరించాల్సి ఉంటుంది. పిల్లలకి ప్రాథమిక, మాధ్యమికవిద్య తమ జీవితంలో మూలంగా నిలుస్తుంది. తల్లి ఒడిలో ఏ భాష నేర్చుకుంటాడో, చుట్టూ సమాజం ఏ భాషలో వ్యవహరిస్తుందో ఆ భాషలోనే ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య ఉండాలి. చిన్ననాటి నుండే నాణ్యమైన విద్యను అందించాలి. ఈ విధంగా మాతృభాషలోనే విద్యను అభ్యసింప చేసినప్పుడు ఆలోచన విధానంలో సృజనాత్మకతను అలవర్చుకున్నాడు. ఆక్స్‌ఫర్డ్‌ యూనీవర్సిటీ జరిపిన సర్వేలో మాతృభాష మాధ్యమంలో చదివిన విద్యార్థులు పరాయి భాష మాధ్యమంలో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

21