పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతృభాషలొ బొధన

డాక్టర్‌ "షేఖ్‌ మహబూబ్‌ బాషా 9160579705

డాక్టర్‌ మొహమ్మద్‌ కరీం

విద్యనూ భాషనూ ప్రజాస్వామీకరించడంతోనే అభివృద్ధి

మాతృభాషలోనే చదువులూ, పరిపాలనా తప్పని సరి; మౌలానా ఆజాద్‌


“తనలో అంతర్నిహితంగా ఉన్న శక్తులను అభివృద్ధిపరచుకొని పరిపూర్ణమానవ జీవితాన్ని జీవించేందుకై విద్యను సముపార్ణించే హక్కు ప్రతి వ్యక్తికీ వుంది. అలాంటి విద్య పౌరుల జన్మహక్కు ఈ అవకాశాన్ని పౌరులందరికీ కల్పించనంత వరకూ- రాజ్యం తన బాధ్యతల్ని నిర్వర్తించినట్లు చెప్పుకోజాలదు...ఉద్యోగ అవకాశాలతో సంబంధం లేకుండా సెకండరీ స్థాయిదాకా రాజ్యం తన పౌరులకు విద్యావకాశాలను కల్పించాలని నేను ప్రగాడంగా విశ్వనిస్తాను.” అని భారత స్వాతంత్రోద్యమ అగ్రనాయకుల్లో ఒకరైన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ అన్నారు. స్వతం త్రభారత విద్యాశాఖా మాత్యుని హోదాలో 30 'సెస్టెంబరు, 1950న ఆకాశవాణి ద్వారా ప్రసంగిస్తూ ఆయన ఈ సందేశం ఇచ్చారు. మౌలానా ఆజుద్‌గా ప్రఖ్యాతులైన మోహియుద్దీన్‌ అహ్మద్‌ భారత స్వాతంత్య్రొద్యమంలో పోషించిన మహత్తర పాత్రగూర్చి మనకు కాస్తోకూస్తో తెలుస్తున్నప్పటికీ, స్వతంత్రభారత ప్రప్రధమ విద్యాశాఖామంత్రిగా ఆయన అందించిన సేవలు దాదాపుగా మరుగున పడ్డాయి. ఈ నేపథ్యంలో మాతృభాషలో విద్యాబోధనపై వివిధ సందర్చాలలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలను పౌరులకు పరిచయం చెయ్యడమే ఈవ్యాసం ఉద్దేశం. విషయంలోకి వెళ్ళేముందు స్వతంత్ర భారత విద్యారంగానికి ఆయన అందించిన సేవలను స్థూలంగా తెలుసుకుందాం.

స్వాతంత్య్రం రాక పూర్వమే జవహర్‌లాల్‌ నెహ్రూ నాయకత్వంలో ఏర్పడ్డ తాత్మాలిక ప్రభుత్వంలో వివిధ నాయకుల ఒత్తిడి మేరకు ప్రవేశించి ఐచ్చికంగా విద్యాశాఖను స్వీకరించారు మౌలానా ఆజాద్‌. 15 జనవరి 1947 నుండి 22 ఫిబ్రవరి 1958న చనిపోయేదాకా 11 సంవత్సరాలకు పైగా కేంద్రప్రభుత్వ విద్వాశాఖామంత్రిగా పనిచేశారు. శాస్త్రీయ పరిశోధన, సాంస్కృతిక వ్యవహారాల శాఖలనూ ఆయనే నిర్వహించారు. న్వతహాగా గొప్ప దార్శనికుడూ, మహాపండితుదూ, విశ్లేషకుడూ అయిన మౌలానా ఆజాద్‌ ఈ రంగాలకు పటిష్టమైన పునాదులు వేశారు. దేశాన్ని నిజమైన 'ప్రజాస్వామీకరణకు శ్రీకారం చుట్టారు. అందుకే విద్యా సముపార్జన పేదల జన్మహక్మని నినదించిన అజాద్‌, వారికి విద్యనందించడం రాజ్యం మౌలిక బాధ్యత అన్నారు. ఈ లక్ష్య సాధన దిశగా ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలకు నిర్దిష్టమైన ప్రణాళికలేర్చరిచారు. ప్రజాస్వామ్య ఆదర్శాలను గ్రామీణ ప్రాంతాలదాకా తీసుకెళ్లాలని భావించి గ్రామాల్లో విద్యావకాశాల మెరుగుదలకు కృషి చేశారు. ముఖ్యంగా ప్రాధమిక విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఉచిత, నిర్బంధ ప్రాధమిక విద్యను ప్రవేశపెట్టారు. మౌలానా ఆజాద్‌ పట్టుదల కారణంగా 1947లో కేవలం రెండుకోట్లున్న విద్యాశాఖ కేటాయింపు 1957 నాటికి 30 కోట్లకు పెరిగింది. అంతస్తుల దొంతరల భారతీయ సమాజంలో తరతరాలుగా తీవ్ర వివక్షకు గురైన దళిత, వెనుకబడిన కులాలు, బలహీన వర్షాలకు చెందిన పిల్లలకు విద్యావకాశాలను కల్పించే లక్ష్యంతో ఉపకారవేతనాలందించే అధికారిక విధానానికి స్పష్టమైన రూపురేఖలనిచ్చారు. 1944లో కేవలం మూడు లక్షలే ఉన్న సదరు కేటాయింపు ఆజాద్‌ కృషి ఫలితంగా 1960 నాటికి 2.25 కోట్లకు అంటే 75 రెట్లు పెరిగింది. కేంద్ర బడ్జెట్‌లో కనీసం 10% విద్యకు కేటాయించాలని ఆయన డిమాండు చేశారు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో తన దేశ పురోభివృద్ధిని కాంక్షించిన మౌలానా ఆజాద్‌ చేతుల్లో జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక పరిశోధనా సంస్థలూ, ప్రయోగశాలలూ ప్రాణం పోసుకున్నాయి. ఐ.ఐ.టి లూ, సి.యస్.ఐ.ఆర్‌., ఏ.ఐ.సి.టీ.ఈ., ఐ.ఐ.యస్‌- బెంగుళూరు, ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ పాలిటెక్నిక్‌ మొదలైనవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఉన్నత ప్రమాణాలు కలిగి, అంతర్జాతీయంగా పోటీపడగలిగే విదంగా యూనివర్సిటీ విద్య ఉండాలనీ, ఉపాధ్యాయుల జీతభత్యాలూ, వారి జీవన ప్రమాణాలూ మెరుగ్గా ఉండాలనీ ఆయన భావించారు. దాంతో యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ ఉనికిలోకి వచ్చింది. రాధాకృష్ణన్‌ కమిషన్‌ (1948) ఖేర్‌ కమిటి (1948), మొదలియార్‌ కమిషన్‌ (1953) లు ఆయన మార్గదర్శకత్వంలో నడిచాయి. శాస్త్రసాంకేతికాభివృద్ధి మోజులో పడి మానవీయ శాస్త్రాల్ని విస్మరించరాదని ఆయన హెచ్చించాడు. స్త్రీల అభివృద్ధిపట్ల నిర్దిష్ట అభిప్రాయాలు కలిగిన ఆజాద్‌ స్త్రీవిద్య పట్ల ప్రత్యేకదృష్టి సారించారు.

దేశప్రజల మభ్య మానసిక ఐక్యతను సారించే దిశగా విద్యావ్యవస్థను మలచదలచుకొన్న మౌలానా ఆజాద్‌ -దేశ, సాంస్కృతిక బహుళత్వంలో వివిధ సంస్కృతుల మధ్య సామరస్యంతో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

15