పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాహిత్యరంగం

డా॥ మధురాంతకం నరేంద్ర 98662 438659

ప్రభావాలూ -ప్రలోభాలూ


వస్తువే తనకు సరిపోయే శిల్పాన్ని యెన్నుకుంటుందని విమర్శకులు అంతా అంటుంటారు. అయితే శిల్పాన్ని నిర్ణయించడంలో ప్రముఖపాత్ర వస్తువు మాత్రమే కాదని చరిత్ర చెబుతోంది.

పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా ఇంగ్లాండులో నవలారచన ప్రారంభమ్హైన కొత్తలో నవలను “వచనంలో వుండే హాస్య పురాణం”(comic epic in prime) అని జేబులో ఉండే నాటకమనీ (pocket thate) రచయితలు, విమర్శకులూ, నిర్వచించుకున్నారు. అంటే అప్పుడా నవలా నిర్మాణం ప్రాచీన పురాణాలలోని సంఘటనల సమాహారాల పద్దతినీ నాటకాల్లోని అంక విభజననూ నాటికీయతను దాదాపుగా అనుసరించిందని అర్థం. కథానిక శిల్చం దగ్గరకొచ్చేసరికి శిల్చ ధోరణులు నవలా పద్దతిలోనే సాగిందని తెలుస్తోంది. తెలుగు కథానిక శిల్చంలో వచ్చిన మార్పులకు సాహిత్య సాంస్కృతిక రంగాల్లోని పరిణామాలకు మద్య ఉండే సంబంధాల్ని తరచి చూసినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెల్లవయ్యాయి.

తెలుగు కథానిక శిల్చంపైన ప్రభావాన్ని చూపెట్టిన తెలుగు పత్రికలే! కథానిక నవల పక్రియలు పాశ్చాత్య దేశాల్లో గూడా పత్రికల ఆలంబనలోనే పుట్టిపెరిగాయి. 1908 లోనే ప్రారంభమైన ఆంధ్రపత్రిక వారపత్రిక; 1950 నాటికి గాని ప్రాచుర్వానికి రాలేదు. 1950 నుంచి ఇవ్పటివరకూ సాగుతున్న తెలుగు సాహిత్యాన్నీ కథానికాయుగమని పిలవడానికి ఆ కాలంలో గొప్ప మాధ్యమంగా ఎదిగిన కథానిక ప్రక్రియతోబాటు ఆ కథలకు ఆలంబనగా ఉన్న పత్రికలు కారణమే. అయితే ఆ పత్రికల ధోరణుల్లో వచ్చిన మార్పులు కథానిక శిల్చం లోనూ మార్పుల్ని తీసుకొచ్చాయి.

1950 నుంచి దాదాపు రెండు దశాబ్దాలు పాటు ఆంధ్ర పత్రిక ప్రభ వారవత్రికలోని కథలు మధ్యతరగతి జీవుల జీవితవు అన్ని పార్శ్యాలనూ, వస్తువులుగా తీసుకున్నాయి. అప్పుడు వారపత్రికల్లోని కథలన్నీ ఆనాటి పత్రికల కొలతల్లో ఐదారు పేజీల దాకా పెరిగేవి. అంటే 1/4 దమ్మీ అని మనం పిలిచే 8.5X 11" యించీల కొలతల్లో వుండే పేజీల్లో ఆ కథలు పది పన్నెండు 'పేజీలదాకా వచ్చేవి.అందువల్ల వస్తువులేవైనా అప్పుడా పత్రికలకు రాసిన కథకులంతా తమ కథల్ని ఆ కొలత మేరకి పెంచేవారు. కొందరు స్పృహ తోను కొందరు తెలియకుండా కూడా ఆ సరిహద్దుల్లోపలే తమ కథల్ని యిచ్చేవాళ్ళు.

భారతి మాసపత్రికలో నవలికలంత పెద్దదైన కథల్ని ఆంధ్రపత్రిక వుగాది సంచికల్లో నవలికలకూ కథానికకూ మధ్య రూపమైన కథల్నీ ప్రచురించడం కూడా 1950 _ప్రాంతాల్లొనే ప్రారంభమయ్యింది. అప్పుడు ప్రచురించబడిన చాలా కథలు విసృతంగా అంగలు చాచుకుంటూ, తీరిగాగ్ర నెమ్మదిగా విష్పారేధోరణిలో, అడవిలో చెట్లు 'పెరిగేటంత స్వేచ్చగా "పెరిగాయి. 1991లో భారతి మూతపడగానే నవలికంత పెద్దగా పెరిగిన కథానికల కాలమూ చెల్లిపోయింది.

ఆంధ్ర పత్రిక కంటే యొక్కువగా వెలిగిన ఆంధ్ర ప్రభ కూడా ఆగిపోయిన తరువాత ఆంధ్రజ్యోతి వారపత్రిక తెలుగు కల్చనా సాహిత్యానికి పెద్ద ఆలంబనగా వుండేది. యాజమాన్యపు మార్పులు, సంపాదకుల మార్పులమధ్య వూగిసలాడుతూ 'నవ్య ' అనే పేరుకూడా మార్చుకున్న ఆంధ్రజ్యోతి వారపత్రిక, యిటీవల కరోనా సాకుతో ఆగిపోయేంతవరకూ పది పదిహేనుపేజీల విస్త్రృతుండే (1/4 డమ్మీ) కథలకు ప్రోత్సాహకరంగా వుండేది. ఆ ఒక్క పత్రిక తప్పితే పాలపిట్ట, చినుకు లాంటి మాసపత్రికలు కూడా అదే రకపు కథలకు వేదికగా వుండేవి. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలు ప్రాచుర్యంలో వున్నప్పుడే ఆంధ్రభూమి, స్వాతి వంటి వారపత్రికలూ, యువ,జ్యోతి,విజయ వంటి మాసపత్రికలు, అదే ధోరణిలో వెలువడేవి.

1975-77 మధ్య కాలంలో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు నూరంటే నూరు వెలువడ్డంతో కథామాలికలనే కొత్త ప్రక్రియకు నాంది పలికింది. పత్రికల్లో వొక పేజీలో ఇమిడిపోయే ఈ కథామాలికలెంత ప్రాచుర్యంలోకి వచ్చాయంటే అలాంటివిష్పటికీ తెలుగులో నూరుదాకా వెలువడి వుంటాయి. త్వరగా చదివేయగలగడం, బాల్య స్మృతుల్ని నెమరేసుకోవడం అనే రెండు ఆకర్షణీయమైన లక్షణాలున్న కథామాలికలంతా పెద్ద ప్రాచుర్యానికి రావడం వెనకగూడా తెలుగువాళ్లదే అయిన స్వభావం స్పష్టంగా కనబడుతోంది. క్రమంగా సాహిత్య పఠనానికి అయిదు పది నిమిషాలుకంటే ఎక్కువ ఏకాగ్రతనివ్వలేని తెలుగు వాళ్ల వ్యాపార స్వభావానికి పెద్ద ఉదాహరణగా వుండేది.

2000వ సం॥ తరువాత వారపత్రికలు ఆగిపోవడంతో కథానికలకు దిన పత్రికల ఆదివారం అనుబంధాలే వేదికలయ్యాయి. 4 పేజీలతో ప్రారంభించిన ఆదివారం కథానికలు యిప్పుడు మూడుపేజీలకే కుదించుకుపోయాయి. యేమాత్రం రసవంతంగా అనవసరపు కాని బంగారాల వార్తా కథనాల మధ్యలో కథానికకు అంతతంటే యెక్కువ స్థలమివ్వలేని ఆదివారం అనుబంధాలు గొల్లుమంటున్నాయి. ఈ ఆటంకాలపైన తిరగబడిన కొందరు కథకులు ఒకే కథతో చిన్న పుస్తకాలు ప్రచురించసాగాయి. పదినుంచి 20 పేజీలుండే ఈ చిన్న పుస్తకాల మనుగడ పెద్దగా లేకపోయింది.

2010 ప్రాంతానికి వెట్‌ పత్రికలు ప్రారంభమయ్యాయి. మొదట్లో యీ వెబ్‌ పత్రికలన్నీ అమెరికా నుంచే వచ్చాయి. తొలి రోజుల్లో వచ్చిన 'భారతి మాస పత్రికల కృషి చూసి అబ్బుర పరచినట్లే 'ఈ మాట'వెజ్‌ పత్రికలో వ్యాసాల్ని కథల్నీ చూసి అబ్బుర పడవచ్చు. తొలిరోజుల్లో అమెరికాలో స్థిరపడిన కథకులు భారతీయ వేర్లను వెతుక్కోవడంతోనే గడిపేసారు. యిప్పుడు వాళ్లు అమెరికన్‌ సమాజంలో కలిసి పోయి అమెరికా కథలే రాస్తున్నారు. భారతీయ వారసత్వమున్న మహిళ అమెరికాకు ఉపాధ్యక్షురాలు కావడం ఈ

ర్హ్తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఈ ఫిబ్రవరి-2021

47