పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపయోగపడింది. విజయవాడలోని మహిళా డాక్టర్లు, ముఖ్యంగా గుడిపాటి వెంకటాచలం వదిన అయిన డాక్టర్‌ రంగనాయకమ్మ ఈ శరణాలయానికి ఎంతగానో సహాయపడింది. బిడ్డలు లేని దంపతులు యిక్కడి పిల్లల్ని తీసుకొనిపోయేవారు. (నేనూ - నాదేశం పు. 234-235)

అన్నపూర్ణమ్మ ఆంధ్ర సార్వజనిక క్షేతంలో పనిచేయడం ప్రారంభించేనాటికి, వలసాంథ్రలో మహిళోద్యమం బలంగా వూళ్ళూనుకొని ఉంది. ఆంధ్రలోని పలు పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ మహిళా సంఘాలు యేర్చడి మహిళాభి వృద్దికి పాటుపడనారంభించాయి. యావదాంద్ర స్త్రీల విశాల వేదికగా “ఆంధ్ర మహిళా మహా సభ " 1910లో ఉనికిలోకి వచ్చి ప్రతిసంవత్సరం ఆంధ్రలోని వివిధ ప్రాంతాల్లో మహిళా సమావేశాలను యేర్పాటు చేసేది.” 'ఆల్‌ ఇండియా వుమెన్స్‌ కాన్ఫరెన్స్‌” ఆంధ్రరాష్త్రశాఖగా “ఆంధ్ర రాష్ట్ర మహిళా మహాసభ” 1927లో యేర్పాటు చేయబడి, ప్రతిసంవత్సరం క్రమం తప్పకుండా మహిళా సమావేశాలను నిర్వహించేది. ఈ నేపధ్యంలో 1928లో కొమఱాజు అచ్చమాంబ విజయవాడలో “భారత మహిళా మండలి” ని స్థాపించింది. దీనికి తుర్లపాటి రాజేశ్వరమ్మ అధ్యక్షురాలు కాగా దరిశి అన్నపూర్ణమ్మ కార్యదర్శిగా వ్యవహరించింది. అంతేకాకుండా 'ఆల్‌ ఇండియా వుమెన్స్‌ కాన్ఫరెన్స్‌, బెజవాడ శాఖకు కూడా అనేక సంవత్సరాలు అన్నపూర్ణమ్మ కార్యదర్శిగా పనిచేసింది. 1929లో బొంబాయిలో జరిగిన నాలుగవ * అఖిల భారత మహిళా సభకు ప్రతినిధిగా వెళ్ళిన ముగ్గురు ఆంధ్రస్తీలలో అన్నపూర్ణమ్మ కూడా ఉంది. ఈ విధంగా అన్నపూర్ణమ్మ సమకాలీన మహిళోద్యమంలో చురుకుగా పాల్గొని మహిళాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడింది.

అన్నపూర్ణమ్మ క్షేతన్భాయిలో పనిచేసిన కార్యకర్తేకాకుండా సంస్మరణోద్యమ సాహిత్యాన్ని సృష్టించిన మేధావికూడా. ఆమె కొన్ని కథల్నీ వ్యాసాల్నీ రచించిన సృజనశీలి. ఆమె రచనలు సంస్మరణ పక్షంవహించిన వైశ్యుల పత్రిక అయిన “వాసవి "లో ఎక్కువగా ప్రచురితమయ్యాయి. స్రీల పత్రిక అయిన “గృహలక్క్ష్మి " లో కూడా కొన్ని రచనలు ప్రచురించబడ్డాయి. “హైందవస్త్రీల హక్కులు -కర్తవ్యము ” అనే వ్యాసంలో స్త్రీల హక్కులు - బాధ్యతలకు సంబంధించిన అనేక విషయాలను చర్చించింది అన్నపూర్ణమ్మ. స్త్రీ-పురుషల మథ్య లింగబేధం తప్పిస్తే మరే విధమైన తేడాలేదని నొక్కివక్కాణించిన అన్నపూర్ణమ్మ స్త్రీలు “అబలలు " అనే పితృస్వామ్య భావజాలాన్నీ బద్దలు కొట్టింది. అవకాశాలు లేకపోవడం వల్లనే స్రీలు అబలలుగా మిగిలిపోతున్నారనీ, పురుషులు అవకాశాలు కల్సించినపుడు స్త్రీలు అన్ని రంగాల్లోనూ తమ శక్తిసామర్ధ్యాలను కనబర్చారనీ, కనబర్చగలరనీ విశదం చేసింది. రాచకార్యదురంధరులైన స్త్రీలనూ, బలశాలులైన స్త్రీలనూ, పండితస్త్రీలనూ, కవయిత్రులనూ ఉదాహరణలుగా చూపెట్టింది. “ఈ విధముగ అన్ని విషయములందును పురుషులతో సమానముగ స్త్రీలు కీర్తి గడించిరి” అని స్పష్టం చేసింది. పురుషులు కూడా శక్తిహీనులుగా ఉన్నారనీ అందుకే వారు విదేశీయుల పాలనలో మగ్గుతున్నారనీ తెలియజేసిన అన్నపూర్ణమ్మ “స్త్రీలు రాజ్య పాలనము చేసే యెడల ఇంతకంటె కనిన్టముగా చేయగలరా?” అని ప్రశ్నించింది.

“ప్రస్తుత హిందూ స్త్రీల కష్టాల్లో బాల్యవివాహాలు, అవిద్య ప్రధానమైనవిగా చెప్పిన అన్నపూర్ణమ్మ బాల్యవివాహాలు ప్రీవిద్యకు ఏవిధంగా ఆటంకంగా ఉంటున్నాయో చెప్పింది. అందుకే “వివాహమునకు పూర్వమే ప్రతిస్త్రీ పురుషుడు సంపూర్ణ విద్యావంతులై యుండవలెను” అనీ, విద్య అంటే “కేవలము అక్షరజ్ఞానము” కలిగి ఉండడం కాదనీ, “ప్రతి స్త్రీయును సుమారు పది పండ్రెండు సంవత్సరములైనను గురుకులవాసము చేసి విద్యనభ్యసించవలెను” అని నిజమైన విద్య అంటే ఏమిటో స్పష్టపరిచింది. వివాహం విషయంలో తల్లిదండ్రుల జోక్యం పోయి ఎంపిక విషయంలో వధూవరులకు ఎక్కువ స్వాతంత్య్రం ఉండాలని కోరుకొంది. పాశ్చాత్య స్రీలవలె భారత స్త్రీలకు ఆజన్మాంతం బ్రహ్మచారిణిలుగా వుండే అవకాశం లేదనీ, వివాహం చేసుకోవడం ఇష్టంలేని స్రీలకు బ్రహ్మచారిణిలుగా వుందే అవకాశం ఉండాలనీ చెప్పింది. అలాంటి స్త్రీలు పాశ్చాత్య దేశాల స్త్రీల మాదిరి తమ జీవితాల్ని సంఘసేవలో గడపగలిగే పరిస్థితులుండాలని వాంఛించింది.

శారదా శాసనం (బాల్యవివాహ నిరోధక చట్టం) పట్ల సంతృప్తి వెలిబుచ్చిన అన్నపూర్ణమ్మ శాసనాన్ని జయప్రదం చేయడానికి “శారదా సంఘా "ల్ని స్థాపించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. హైదరాబాద్‌ మొదలైన స్వదేశీ సంఘాల్లో శారదా చట్టంలాంటి చట్టాన్ని చేయాల్సిన అవసరాన్ని తెలియజేసింది. శారదా శాసనం కనీస వివాహ వయస్సు స్త్రీలకు 14గాను, పురుషులకు 18గానూ యేర్పాటు చేసింది. అన్నపూర్ణమ్మ వివాహ వయస్సును పెంచాలని భావించి కనీస వివాహవయస్సు స్త్రీలకు 16గానూ పురుషులకు 21 గానూ వుండే విధంగా శారదా శాసనంలో సవరణ చేయాలని కోరుకుంది. స్రీలకుగానీ, పురుషులకు గానీ, “నిర్భంధ వివాహములు” ఉండకూడదంది. బహుభార్యత్వాన్ని నిరసించింది. చిన్న బాలికల్ని ముసలివాళ్ళకిచ్చి పెళ్ళి చేసే పద్ధతిని అసహ్యించుకొని అలాంటి “అనమ వివాహములను జరిపించిన తలిదండ్రులు శిక్షాపాత్రులగుటకు రాజశాసనముండవలెను” అంది. వితంతు సమస్యలపై స్పందిస్తూ “ఛిన్న బాలికలను సైతము భర్త చనిపోయినపుడు వితంతువులని పిలుచుట, నిర్బంద బ్రహ్మచారిణులుగా యుంచుట ధర్మమా?” అని ప్రశ్నించింది. నిర్బంధ బ్రహ్మచర్వాన్ని “అన్యాయము” అని ఈసడించింది. “ఇటువంటి అన్యాయము ఏ జాతీయందుగాని, ఏ దేశమందుగానీ, చివరకు పశుపక్ష్యాదులయందుగాని లేదు” అనీ తెలియజేస్తూ వితంతువులకు పునర్వివాహాలు చేయాల్సిన ఆవశ్యకతను తెలియబరిచింది.

స్త్రీలకు అస్తి హక్కు ఉండాలని బలంగా వాదించిన అన్నపూర్ణమ్మ తనకాలంలో స్త్రీలకు సదరు హక్కు లేకపోవడాన్ని గూర్చి వాపోతూ ఈ విధంగా అంది. “తల్లిగారి స్వగృహమందు పుత్రులతో సమానముగా పుత్రికలకు ఆస్తి పంచి యివరు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

31