కాంతలు స.వెం. రమేశ్
- తెన్నాటి తెమ్మెర (తెలుగువారి తమిళ కతలు) విడుదల
శత శ్రీ .
స.వేం.రమేశ్ తమిళనుడి నుంచి తెలుగునుడిలోకి అనువాదం చేసిన 40 కథల సంకలనం 'తెన్నాటి తెమ్మెర” పుస్తకాన్ని తిరుపతిలో విడుదల చేశారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సైకాలజీ సెమినార్ హల్లో డిసెంబర్ 21న ఈ కార్యక్రమం జరిగింది. డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లట్ ప్రచురించిన ఈ పుస్తకాన్నీ ఆ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర చౌదరి విడుదల చేశారు. ప్రసిద్ద రచయిత మధురాంతకం నరేంద్ర, కథా సాహితీ నిర్వాహకుడు వాసిరెడ్డి నవీన్ ఈ కథలు రాసిన రచయితల నేవథ్య పరిస్థితులను వివరించారు. కొన్ని కథలను విశ్లేషించారు. తమిళ నుడి లోనే కథలు రాసిన, ఇప్పటికీ రాస్తున్న రచయితల్లో 200 మంది తెలుగువారు ఉన్నారనీ సవెమ్ రమేళ్ తెలిపారు. తెలుగులో చదువుకునే పరిస్థితులు లేకపోవడం వల్ల తమిళనాడు లో అందరూ తమిళం మాత్రమే చదువుకుంటూ ఉన్నారని, అందువల్ల వీరు తమిళ నుడి లోనే కథలు రాశారని చెప్పారు. ఈ పుస్తకం లోని పలువురు ప్రసిద్ద తమిళ రచయితలు తెలుగువారు అని ఇప్పటికీ తమకు తెలియదని వాసిరెడ్డి నవీన్ అన్నారు. వీరిలో కౌందరితో తనకు 20 ఏళ్లుగా స్నేహం ఉందనీ, అయినా తెలుగు మాట్లాడుతారు అనీ కూదా తెలియదనీ చెప్పారు. తెలుగు, తమిళ నుడుల, సంస్కృతుల స్నేహానికి వారధిలా * తెన్నాటి తెమ్మెర “= కథల సంకలనం ఉపయోగ పడుతుంది అనీ రాఘవేంద్ర చౌదరి అన్నారు. భవిష్యత్ లో ఇటువంటి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ కథల పుస్తకంలోని తమిళ రచయితల్లో కొందరు సభలో మాట్లాడారు. రాజుపాల్యం నుంచి గొట్టిముక్కల రాజేశ్వరి, మందలపాటి ఆనంది పాల్గొన్నారు. మదురైకి చెందిన కథా రచయిత జననేసన్, మధురాంతకం నుంచి శ్రీపతిరెడ్డి రామచంద్రా రెడ్ది ఉదుముల పేట నుంబి మార్తూరి వసంత నాయుడు పాల్గొన్నారు. రచయిత అన్ఫరసు కుమారుడు మణి వన్నన్ హాజరయ్యారు. చెన్న రసం, కొంగురసం, తొండ రసం, కృష్ణ రసం ప్రతినిధులు మన్నవ గంగాధర ప్రసాద్ సంజనా పద్మం, మునీరాజ, దామోదరం లకు పుస్తకం ప్రతులను వేదిక మీవ అందించారు. భూమన్, జిల్లెళ్ళ బాలాజీ, సాకం నాగరాజ, రాసానీ, ఆర్.ఎం. ఉమామహేశ్వర రావు, సుంకోజి దేవేంద్రచార్సి, కిరణ్ కుమారి, మౌని వంటి రచయితలు సభకు హాజరయ్యారు.
ఈ పుస్తకానికి స.వెం.రమేశ్ రాసిన ముందుమాట ఇది:
తెన్నాటి తెలుగు వెత
తెన్నాటి తెమ్మెరను మీ మేనుకు సోకించాలని చానేళ్ల కల నాది. అక్కలన్నలు తొంగి కూడా చూడకుండా ఉండిపోతే మేము కూడా ఇన్నాళ్లకు నెరవేరింది. కతల్లోకి వెళ్లే ముందు ఈ వెతను కూడా తెగిపడిన మీ మేనుకాయలమే,” అని ఎలుగెత్తి వేడుకాంటున్న వాళ్లం.
వినేసి వెళ్లండి. ఇప్పటి తమిళనాడును మేము 'తెన్నాడు” అంటున్నాం. తెన్నాడు అనీ ఎందుకు అంటున్నామంటే... వేము అంటే, తెన్నాటి తెలుగువాళ్లం. మేము అంటే, తమిళ ఒకప్పటి ఆంధ్రతావు తెలుగు పెద్దలు, గద్దెమీద 'పెద్దతనం
దొరతనం కరకుగా తొక్కేస్తుంటే ఆ అణచివేతను తొాలగదోసుకొనీ కోసం, తెన్నాటి తెలుగు పెద్దలమీద అలిగి, 1913 నుండి ఈ పైకి లేయాలనుకొంటున్నవాళ్లం. మేము అంటే, ఆంద్ర తెలంగాణ _ తావునంతా తమిళనేలగా చాటింపేసి, పెద్ద ఎసవు (ఉద్యమం) చేసి,
| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి ఈ బనవరి-2022 |