| ల]
రనత్వ నంవద
డా! పి.శివరామకృష్ణ “శక్తి 9447077
అడుగంటిపోతున్న అమ్మనుడి ఒ నిర్దివంగా మారుతున్న మాతృభాష
వ్యవసాయం, పశుపాలన అభివృద్దికి పునాదులు. నరమానవుడు వేలయేళ్ళుగా (శ్రమించి జంతువులను మచ్చిక చేసుకున్నాడు. విత్తనాలు తయారు చేసుకున్నాడు. బుతువులు గమనించాడు. కార్తెలలోకి మార్చుకున్నాడు. ఇళ్ళు, బట్టలు కట్టుకున్నాడు. నోటిమాటగా, పాటగా, వృత్తిగా, తంతుగా తరతరాలకు ఈ జ్ఞానం అందిస్తూ వచ్చాడు.
“వ్యవసాయ విజ్ఞానం అమ్మనుడి/ జానపదంలో కలికితురాయి. వ్యవసాయం వాతావరణానీకి, [ప్రాంతానీకి సంబంధించి వేరు వేరుగా ఉంటుంది.
కార్తెలు; ఆరుద్రలో అడ్జెడు చల్లితే, పునాసకు పుట్టెడు పండుతుంది. పుబ్బలో చల్లే దానికంటే దిబ్బలో చల్లింది మేలు. చిత్తలో చల్లితే చిట్టెడుకాపు. ఆరుద్ర కార్తె విత్తనానీకి అన్నం పెట్టిన ఇంటికి సేగిలేదు. అనురాధ కార్తెలో వర్షానికి అనాథ కొమ్మయినా ఈనుతుంది. అళ్విని కురిస్తే అంతా నష్టం. ఆరుద్ర వాన - అదనువాన. కత్తెరలో వాన కనకపు పంట. సవతి వర్షం చేనుకు హర్షం. మూల ముంచును. జ్యేష్ట చెరుచును.
తాలకరివాన మొలకలుకులకు తల్లి. తూనీగ లాడితే తూమెడు వర్షం. పంట కాల్వ నీరు అన్ని పైర్లకు మేలు.
దుక్కి దుక్కి ఉంటె దిక్కు ఉంది.పత్తికి పది చాళ్ళు. జొన్నకు ఏదు.నువ్వులకు ఏడు, ఉలవకు ఒకటి దుక్కులు. ఎరువుకన్నాా గొ(రైలమంద కన్నా లోతయిన దుక్కి మేలు.
ఎరువు; గారెల పెంట ఏదాది. ఆవుల పేడ ఆరేంద్సు పుట్టమన్ను ఎరువైతే పుట్ల కౌద్దీపంట. పూచిన తంగేడు, కాచిన వెంపలి వేసినా పండుతనన్నవట వరి.
ఆహారం; ఎందాకాలంలో వచ్చే ఉగాది, శ్రీరామనవమి రోజుల్లో ఉగాది పచ్చడి, పానకం, చల్లనీ మజ్జిగ, వడపప్పు లాంటి తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకుంటాం. చలికాలంలో తీపి ఎక్కువగా వాడుతుంటాం. సంక్రాంతి రోజుల్లో కాన్ని ప్రాంతాల్లో గుమ్మడి
అవిశాకు తప్పని సరిగా వాడితే, మునగ కూర, ములక్కాడ అసలు వాడరు. కాని కర్మ క్రియరోజున ఆ రెండూ ఖచ్చితంగా వాడతారు. వేపపూవు పచ్చడి అబ్టీకాలలో చేసేవారు. దుక్కులు దున్నటం వృధా అనుకుని
(ట్రాక్టర్లతో ఒకేసారి దున్ని వ్యవసాయం చేస్తున్నారు. వీటి ఫలితం రైతు పెట్టుబడికి ఆదాయానికి లంకె కుదరక ఫోవటమే” నని జరుగుతున్న నష్టాన్ని గూర్చి చెపుతూ.
7
]
స్తే అని మాత్రమే ఆకాశంవంక చూసాడు కాని, నేడు విత్తనాల దగ్గరనుండి ప్రతిదానికి అకాశం వంక చూడకతప్పటం లేదు” అని బాధపడతారు. (జానపద విజ్ఞాన సమాలోచన. ఆచార్య భక్తవత్సలరెడ్ది 1995). తెలుగు సామెతలను, మాండలిక పదకోశాన్ని వ్యవసాయ వృత్తి పదకోశాన్ని సాహిత్య అకాడెమీ 1960లలోనే సేకరించి ప్రచురించింది. “తెలుగు సామెతలలో జనజీవనం” (పాపిరెడ్డి నరసింహారెడ్డి. తెలుగు అకాడెమీ 2009) వంటి అధ్యయనాలు వస్తున్నాయి. ఇవన్నీ మన వ్యవసాయ సంప్రదాయంలో పటిష్టతతను నిరూపిస్తాయి.
విధ్వంసం దిశగా “అభివృద్ధి
| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి ఆ జనవరి-2022 |
విద్యుత్తు, పెట్రోలు, బొగ్గ, పెన్సిలిన్ రాకతో ఇంధనం, సేద్యం, వైద్యం మారింది. ఈ మార్పును సార్వత్రికవిద్య వేగిరపరిచింది. చదువుకున్న వాళ్ళ పెత్తనం పెరిగింది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు రసాయనీక ఎరువులు, వురుగుమందుల వాడకం ఫొలాలను ఊషర క్షేత్రాలుగా మార్చింది. తల్లిపాలుకూడా విషపూరితమయ్యాయి దిద్దుబాటు చర్యలలో లోపించిన నుడికారం. సేంద్రియ వ్యవసాయం, శ్రీసాగు, జీరో బేస్ట్ నాచురల్ ఫార్మింగ్ /పెట్టుబడి లేని సహజవ్యవసాయం అంటూ, కొత్త సీసాలో పాతసారాలాగా, కొత్తచదువులతో దిద్దుబాటు మొదలైంది. పాలేకర్, ధబోల్మ్కర్- వగైరా మరాఠీ వ్యవసాయ శాస్త్రవేత్తలకు, వారి రాష్ట్రంలోకాక, మన రాష్ట్రంలో ఆవరణ పెరిగింది. వారి రాష్ట్రంలో ఆదరణ పెరిగితే, తప్పకుండా అక్కడి జనసామాన్నానికి చెప్పటానికి, తరతరాలుగా వాడుకలో ఉన్న వ్యవసాయ పద్దతులలో ఉన్న పలుకుబడులను గుర్తు చేసేవారేమో 1. అదే పద్ధతిలో ఇక్కడి వలుకుబదులను తెలుసుకుంటూ కలుపుకు