పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు 9866128846

'భారతీయభాషల సంస్థ' విశ్వవిద్యాలయంగా మారుతోందా?!


నవంబరు 27, 2020 న భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్వా విభాగంలోని భాషా విభాగం ఒక జీ.ఓ.ను విడుదలచేసింది. స్థూలంగా ఆ జీ.ఓ. ప్రకారం ఇప్పుడు మైసూరులో ఉన్న భారతీయభాషల సంస్థ (సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌) అనే కేంద్ర ప్రభుత్వసంస్థను భారతీయ భాషా విశ్వవిద్యాలయంగా మార్చాలి. కొత్తగా ప్రారంభించబోయే భారతీయ అనువాద, వ్యాఖ్యానాల సంస్థను కూడ అందులో చేర్చాలి. దీనికోసం పదకొండుమంది సభ్యుల సలహాసంఘం ఒకదానిని కూడా ఏర్పాటు చేసింది. పత్రికలలో వచ్చిన వార్తల ప్రకారం ఈ పనులన్నీ రెండు నెలల్లో జరగాలి. ఆ జీ.ఓ. సారాంశం ఇలా ఉంది:

మైసూరులో ప్రతిపాదిత భారతీయ భాషల విశ్వవిద్యాలయమూ(భాభావి) ఇంకా అనువాద, వ్యాఖ్యానాల భారతీయ సంస్థ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌, ఐఐటిఐ) విధివిధానాలను వివరించడానికి ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈ సలహాసంఘం ఈ దిగువన చూపిన నిబంధనలలో పేర్మాన్న సూచనల ప్రకారం సమస్యలను అధ్యయనం చేసి, తమ సిఫారసులను ప్రభుత్వ పరిశీలన కోసం అందించాలి.

భారతీయ భాషలవిశ్వవిద్యాలయ లక్ష్యాలనూ ఉద్దేశాలను కమిటీ సిఫారసు చేయాలి. అందులో భారతీయభాషల సంస్థ(సిఐఐఎల్‌) లక్ష్వాలనూ ఉద్దేశాలనూ కూడా చేర్చాలి. అనువాద, వ్యాఖ్యానాల భారతీయ సంస్థకి స్వయంప్రతిపత్తిని ఇస్తూ భారతీయ భాషల విశ్వవిద్యాలయ పాలనా నిర్మాణం జరగాలి. భారతీయ భాషల విశ్వవిద్యాలయం (భాభావి) ఇంకా అనువాద, వ్యాఖ్యానాల భారతీయ సంస్థ (అవ్వాభాసం) లో విభాగాలూ, కేంద్రాలూ శిక్షణాశాలలూ ఉంటాయి. భాభాసం (సిఐఐఎల్‌) కి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను ఈ సలహాసంఘం అధ్యయనం చేసి, భూమి, భవనాలు, మానవశక్తి (విద్య+విద్యేతర) ఇంకా వాటిని ప్రతిపాదిత భారతీయ భాషల విశ్వవిద్యాలయ (భాభావి), అనువాద, వ్యాఖ్యానాల భారతీయ సంస్థల(అవ్యాభాసం) కోసం వినియోగ పరంగానూ వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలనూ సూచించాలి.

భారతీయ భాషల సంస్థ (సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌)ను ఐఐటిఐతో సహా భాభావిగా మార్చడానికి కావలసిన పెట్టుబడి, తిరుగుదల (కాపిటల్‌, రికరింగ్‌) మొదలైన ఆర్జిక అవసరాలను కూడా కమిటీ సూచించాలి. ఏదైనా అదనపు భూమి అవసరమైతే కూడా ఈ సలహాసంఘం సూచించవచ్చు. భాభాసం (సిఐఐఎల్) ను అవ్వ్యాభానం (ఐఐటిఐ)తో కూడిన భాభావిగా మార్చడానికి అవసరమైన పరివర్తనా నిబంధనావళిని సమకూర్చాలి. ప్రాచీన భాషల విశిష్ట అధ్యయన కేంద్రాల (ఎక్సలెన్సు సెంటర్స్‌ ఆఫ్‌ క్లాసికల్‌ ల్యాంగ్వేజస్‌) పని తీరును అధ్యయనంచేసి వాటిని ప్రతిపాదిత విశ్వవిద్యాలయంలో ఎలా కలపవచ్చో సూచించాలి.

ఈ పనులు చేయదానికి ఉద్దేశించిన సలహాసంఘానికి భారతదేశానికి పూర్వ ఎలక్షన్‌ కమిషనర్‌గా పనిచేసి ఇప్పుడు తిరుపతిలోని కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయానికి ఛాన్సెలర్‌గా ఉన్న పద్మభూషణ్‌ ఎన్‌. గోపాలస్వామి, ఐఏఎస్‌. గారు నేతృత్వం వహిస్తున్నారు. ఆయన తరువాత ఇందులో ఇంకా, విశ్వవిద్యాలయాల విరాళాల సంఘం అద్యక్షుడూ, ఖాభాసం ఇన్బార్డ్‌-డైరెక్టరూ కూడా కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా ఉన్నారు. ఇక మిగిలినవారిలో తమిళం, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, సంస్కృత భాషలకు చెందిన సాహితీవేత్తలు సభ్యులుగా ఉన్నారు. వీరు కాక సంస్కృత ప్రమోషన్‌ ఫౌండేషన్‌కు చెందినవారు మరొకరు. వీరిలో అందరూ సాహిత్యకారులే. ఆయితే, సమస్యల్లా ఎక్కడ వచ్చిందంటే, భారతీయ భాష సంస్థ మాత్రం భాషాశాస్తానీకి సంబంధించిన సంస్ద ఈ సలహాసంఘంలో భాషాశాస్రజ్ఞుల ప్రాతినిథ్య లేమి కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

భాషల శాస్త్రీయ అధ్యయనమే ప్రధాన లక్ష్యంగా భారతీయ భాషా సంస్థ (సి.ఐ.ఐ.ఎల్‌) ను ఇప్పటికి సరిగ్గా 50 ఏండ్ల కిందట కేంద్ర ప్రభుత్వం నెలకొల్పింది. భాషల మధ్య తులనాత్మక పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఉమ్మడి లక్షణాల అధ్యయనంద్వారా భారతీయ భాషలను సమన్వయపరుస్తూ ఐక్యతను పెంచడానికీ వాటి అభివృద్ధికి సహాయపడటం ద్వారా ఈ దేశ ప్రజల భావోద్వేగ సమైక్యతకు దోహదం చేయటం దీని ఉద్దేశం. భాషా విశ్లేషణ, భాషా బోధన, భాషా సాంకేతికత, భాషా వినియోగం, విద్య,అక్షరాస్యత, సామాజిక మాధ్యమాలూ, పాలన, భావోద్వేగ సమైక్యత వంటి వివిధ సామాజిక - సాంస్కృతిక రంగాలలో భాషకు సంబంధించి ఎప్పటికప్పుడు పొడసూపే సమస్యల పరిష్కారానికి వాటిపై పరిశోధన, వాటి అభివృద్ధి కార్యకలాపాలన్నీ దీని ద్వారానే నిర్దేశించబడతాయి. అల్పసంఖ్యాక, ఆపన్న అంతరించిపోతున్న భాషలూ వాటి సంస్కృతుల వివరణ, క్రోడీకరణలో ఈ సంస్థ పాల్గొంటుంది. విద్యారంగంలో వాటి ఉపయోగం కోసం నమూనాలు, పద్ధతులు, జోధనాసామ[గి, మానవ వనరులను కూడా అభివృద్ది చేస్తుంది. 8వ షెడ్యూల్‌లో ఉన్న భాషల అభివృద్దికి ప్రణాళికల రచన, అన్ని స్థాయిలలో బోధన, పరిపాలనా

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

9