పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందులో పేర్ళొన్న భాషావిధానానికి సంబంధించిన అంశాల విషయంలోనూ ఈ పోకడ వుంది.

జాతీయ విద్యావిధానంలో ఉన్న ముఖ్యమైన లోపాలను ఆగస్టు, సెప్టెంబరు, డిసెంబరు “అమ్మనుడి సంపాదకీయాల్లో ప్రస్తావించాము. అంజేగాక, ఈ అంశంపై కొన్ని వ్యాసాలను కూడా ప్రచురించాము.

ఇప్పుడు తాజాగా ముందుకొచ్చిన మరొక అంశం - 'భారతీయ భాషలకు ఒక జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయం. దీనిపై భారతీయ భాషాశాస్రజ్ఞుల సంఘ అధ్యక్షుడు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు విశ్లేషణాత్మక వ్యాసాన్ని ఈ సంచికలో చదవండి. భారతీయ భాషల అభివృద్ధికి కృషిచేయడం కోసం ఇప్పటికే పనిచేస్తున్న సె ఐ.ఐ. ఎల్‌.(మైసూరు)ను శక్తిమంతం చేసే బదులు, దానిని జాతీయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్బడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భాషలపై పరిశోధన, వాటి అభివృద్ధి జరిగేందుకు కృషి జరగాలి గాని, అందుకై వున్న సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలి గాని, విశ్వవిద్యాలయ చట్రంలో దానిని బిగించకూడదనేది ఆయన వక్కాణింపు. నిజమే, భాషల కోసం ఇప్పటికే ఉన్న విశ్వవిద్యాలయాలు ఎంత దీనమైన స్థితిలో ఉన్నాయో మనం చూస్తున్నాం. విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా తన అనుభవంతో వ్రాసిన మాటలతో ఎక్కువమంది ఏకీభవిస్తారు.


దేశభాషలన్నిటికీ మూలం సంస్కృతమనీ, సంస్కృతం నుండే అన్ని భాషలూ పుట్టాయనే విశ్వాసంతో ఉన్నవారు భారతీయ జనతాపార్టీ సైద్ధాంతిక భావజాలంపై పలుకుబడి కలిగివున్నారు. ఇది ఏనాడో తిరస్మరించబడిన ఆధిపత్యవాదం. ఇటువంటి వాదాలకు వర్తమానమూ భవిష్యత్తూ రెండూ ఉండవు. శాస్రీయ నిరూపణలకు సరిపడినవే నిలుస్తాయి. ఇప్పుడీ భారతీయ భాషల జాతీయ విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం నియమించబడిన మేధావుల్లో కాలం చెల్లిన నమ్మకాలను పట్టుకొని వెళ్లాడేవారిదే పెద్దపీట. భారతీయ భాషలన్నిటినీ సంస్కృతంతో సంస్మరించాలనీ ఆ విధంగా సువిశాల భారతదేశానికాక జాతీయభాషను నిర్మాణం చెయ్యాలనే పవిత్ర లక్ష్యంతో వీరి ఆలోచనలు సాగుతున్నాయన్నది నిజం కాదా?

ప్రభుత్వం గుర్తించిన విశిష్ట ప్రాచీన భాషలు ఆరు. అవి: తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడం, ఒరియా, మలయాళం. జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకై నియమించిన కమిటీలో వీటి ప్రాతినిధ్యం ఎంత? తెలుగుకు ప్రాతినిధ్యం ఎందుకు లేదు?

భాషారాష్ట్రాలెందుకు ఏర్చ్పడ్డట్లు! మనది యూనిటరీ వ్యవస్థ కాదని, ఫెడరల్‌ విదానాలను మనం అనుసరించాలని కేంద్రపాలకులకు తెలియదా? రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించని విధంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ దేశాన్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై వుంది. భాష చాలా సున్నితమైన అంశం. దీనితో రాజకీయాలాడడమే ప్రమాదం. ఇందుకు సంబంధించి స్వాతంత్రానికి పూర్వమూ, ముఖ్యంగా స్వాతంత్రానంతరం ఎన్నో చేదు సంఘటనలనూ చరిత్రనూ మనం చూశాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది రాజకీయ విస్ఫోటనాన్ని కలిగించే ప్రమాదం ఉన్నది.

చివరగా మరొకమాట : పాలకులు ఈ దేశ ఐక్యతా సాధకంగా హిందుత్వ అంశాన్ని చూస్తున్నారు. అయితే హిందూత్వ అనే మాటకు వీరు చెప్పే అర్థం వేరు. విశాల హైందవ భావనతో కూడుకున్న పరిభాష అది. అది మతాలకు అతీతం. ఈ పుణ్యభారతదేశంలోని అన్ని మతాల అవలంబకులూ హిందువులేనని అంటారు. కాని, హిందూ అనే మాట వినగానే చాలామంది దాన్నొక మతంగా అనుకొంటారు! నిజానికి ఈ పాలకపార్దీని బలపరచెవారిలో కూడా కొన్ని వర్ణాలు ఆవిధమైన ఆలోచనలతో ప్రభావితమైనవే. అదృష్టవశాత్తూ వీరి సంఖ్య పరిమితం. అయితే అన్నిరకాల హిందూభావజాలాల వారిలోనూ ఉన్న భావన సంస్కృతం దైవభాష అని. అందుకే దానిపట్ల ఆరాధనాభావం. దేవుడికి రూపమే లేనప్పుడు దైవభాష ఎక్కడనుండి వచ్చింది! సంస్కృతం కూడా మానవసమాజం నిర్మించుకొన్న భాషే అది కొన్ని ప్రయోజనాలకు అద్భుతంగా తన పాత్రను నిర్వహించి, చరిత్రలో నిలిచిపోయింది. దాన్ని మనం గౌరవించుకోవాలి. కావాలంటే నేర్చుకోవాలి. అంతేగాని, దాన్ని ఒక 'వేలుపుభాషగా చేసి, ప్రత్యేక పవిత్రతనాపాదించడమేగాక, ప్రజాభాషలనెత్తిన ఆధిపత్యం వహించే సాధనంగా వారి జీవితాల్లోకి చొారబడడాన్ని సహించకూడదు.

ఇప్పుడు భారతీయ భాషల జాతీయ విశ్వవిద్యాలయం ఆలోచన రెండు రకాలుగా తప్పు. 1. ఆచరణలో దేశీయభాషల అభివృద్ధికి ఉపయోగపడకపోగా, ఇప్పుడు అప్రతిష్టకు లోనవుతున్న అనేక విశ్వవిద్యాలయాల సరసన ఇదీ చేరుతుంది.

2 ఈ విశ్వవిద్యాలయ ఆశయాలు సందేహాస్పదం. వాటిని పైన వివరించాము. అదంతా నిజమే అయితే, ఇది దేశానికీ ప్రజలకూ విషాదాన్నే మిగిల్చుతుంది.

కేవలం పార్డీ రాజకీయాల కోణం నుంచిగాక, దేశంయొక్క ప్రజలయుక్క శ్రేయస్సునూ, భవిష్యత్తునూ దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని పాలకవర్గాల నేతలకు, మేధావులకు, ప్రజానీకానికి మనవి చేస్తున్నాము!

తేదీ : ౩0-12-2020.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

8