అని యనేకప్రకారంబులం గొనియాడుచు నదియె ముచ్చటగా నుండి రప్పుడు పురు
షోత్తముండు భేరీమృదంగాదివాద్యంబులును, శంఖకాహళవేణుప్రముఖతూర్యంబు
లును బోరుకలఁగ మహావైభవంబున నరిగి నిరంతరవిహార్యమాణేందిరంబగు మంది
రంబుఁ బ్రవేశించి, యమాత్యజ్ఞాతిసామంతబంధుమిత్రాదిపరివారంబుల దివ్యాంబరా
భరణతాంబూలాదివస్తుప్రదానంబులం బ్రహృష్టమానసులం జేసి, యుచితప్రకారంబులఁ
దత్తద్గృహంబులకు వీడు కొల్పి, యంతఃపురంబులకుం జని యిప్టోపభోగంబు లనుభవింపు
చుండె. నయ్యనిరుద్ధుకుమారుండు నుషాసమెతుండై దేవకీవసుదేవులకు రేవతికి రుక్మిణీ
సత్యభామ జాంబవతీ కాళిందీమిత్రవిందాసుదంతాభద్రాలక్షణాదులైన ముత్తైదు
వలకుఁ దన తల్లులైన రతీశుభాంగులకుఁ బ్రణామంబులు చేసిన వారును బరమానందర
సప్రవాహితాంతరంగులై యవ్వధూవరుల నాలింగనంబులు చేసి యనేకవిధంబుల దీవించి
రతండును నిజవియోగవేదనాభారంబునఁ గృశీభూతయైయున్న రుక్మలోచన
ననేకవిధంబుల గారవించి సంప్రీతహృదయం గావించి మజ్జనభోజనాదులఁ దృప్తుండై
బాణనందనాసురతసంభోగానందనిరతుండై యుండి.