నైల్యంబైన బాణబాహుళ్యంబువలన మార్తాండమండలగోచరలక్షణంబులేమి
దుర్దినంబై యుత్కర్షవర్షాగమంబు ననుకరించియుండె నప్పుడు వేతాళప్రేతపిశా
చశాకినీఢాకినీప్రముఖభూతంబు లుత్సాహసమేతంబులై మాంసఖండంబులు కడు
పులనిండ మెక్కి రక్తపానంబు చేసిన గఱ్ఱునం ద్రేపుచు, శ్వేతతురంగచర్మంబులు
ధవళాంశుకంబులుగా ధరియించుకొనుచు, మేదఃపంకంబు రక్తజలంబులం బదనుచేసి
లేపనంబులుగాఁ దనువుల నలందికొనుచుఁ, దునుకలై పడిన యాతపత్రంబులఁ బువ్వు
లుగా నలంకరించుకొనుచు, గజకళేబరంబులు పర్యంకంబులుగాఁ బవ్వళించుచు,
ఘోటకాండంబులు క్రముకఖండంబులును, గుంజరకర్ణంబులు తాంబూలపర్ణంబులు
ను, వసలు చూర్ణంబులునుం గాఁ గలయ నమలి విడియంబులు చేసి జిహ్వావలోకనం
బులు చేసికొనుచుఁ గామినీభూతంబులతోడి సురతక్రీడావిలాసంబులం జొక్కుచు,
గంధర్వపిశాచంబులు సేయు గార్దభస్వరసంగీతంబులకు నానందంబు నొంది కరితురగ
నరమాంసంబులు త్యాగంబు లిచ్చుచో వారల గానంబులకుఁ దాముం దమవదాన్యతా
సౌందర్యవిశేషంబులకు వారును శిరఃకంపంబులు చేసి మెచ్చుకొనుచు, నివ్విధంబున
వివిధభోగంబులం దనిసి యుభయబలంబులం బొగడుకొనుచుం దాండవంబులు సలుపు
నమ్మహాకోలాహలంబువలన సంగరప్రకారంబు ఘోరంబై వర్తిల్లె నందు.