దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువెళ్ళఱై

వికీసోర్స్ నుండి

విశే: ఈ సన్నిధిలో శివాలయము, బ్రహ్మకు ఆలయమును కలవు. సన్నిధిలో పురాతనమైన అరటి చెట్లు కలవు.

శ్రీరంగమునకు ఉత్తరమున 2 కి.మీ.దూరమున గలదు. శ్రీరంగము నుండి తిరుచ్చి నుండి బస్ సౌకర్యము గలవు. శ్రీ రంగము నందుండియే సేవింప వలెను.

   పేరానై కుఱుబ్గుడి యెమ్బెరుమానై ; తిరుత్తణ్గా
   లూరానై క్కరమ్బనూరుత్తమనై ; ముత్తిలజ్గు
   కారార్ తిణ్ కడలేழுమ్‌ మలై యేழிవ్వులగే ழுణ్డుమ్‌
   ఆరాదెన్ఱిరున్దానై క్కణ్డదు తెన్నరజ్గత్తే
         తిరుమంగై ఆళ్వార్ పె.తి.మొ. 5-6-2

6. తిరువెళ్ళఱై (శ్వేతగిరి)

శ్లో. తీర్దై: పుష్కల పద్మ చక్ర కుశకై స్సంశోభ మానస్థితే
   రమ్యే శ్రీ మణి కర్ణి కాహ్వాయ వరాహఖ్యాత తీర్దాఞచ్‌తే |
   గంధ క్షీరసు దివ్య పుష్కరిణికా యుక్తే సితాద్ర్యాహ్వయే
   రాజంతం నగరేతు వెళ్లర పదే ప్రాగస్య సంస్థానగమ్‌ ||

శ్లో. శ్రీ మచ్చంపక వల్లికా పరిగతం శ్రీ పంగయచ్చెల్వికా
   నాయక్యా విమలాకృతిం సురుచిరం వైమాన వర్యశ్రితమ్‌ |
   మార్కండేయ శిబిక్షితీశ గరుడ క్షోణీ దృశాం గోచార
   పద్మాక్షాహ్వయ మాశ్రయే కలిరిపు శ్రీ విష్ణు చిత్త స్తుతమ్‌ ||

వివ: పుండరీకాక్షులు-పంగయచ్చెల్వి తాయార్-(చంపకవల్లి) పుష్కల, పద్మ, చక్ర, కుశ, మణి కర్ణిక, వరాహ, గంద, క్షీర, పుష్కరణులు-శ్వేతాద్రి-విమలాకృతి విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-మార్కండేయ, శిబి, గరుడ, భూదేవులకు ప్రత్యక్షము-పెరియాళ్వారులు, తిరుమంగై ఆళ్వారులు కీర్తించినది.

విశేషములు: ఈ క్షేత్రమునకు శ్వేతగిరి యనిపేరు. శిబి చక్రవర్తి ప్రార్ధనచే స్వామి ప్రయోగచక్రముతో పుండరీకాక్షు లనుపేర సేవ సాయించిరి. ఇచట స్వామికి ఇరువైపుల సూర్య చంద్రులు వింజామరలు వీచుచుందురు. మరియు ఇచ్చట ఉత్తరాయణ-దక్షిణాయన ద్వారములు గలవు. ఉయ్యక్కొండార్ (పుండరీకాక్షులు) అవతార స్థలము. మీన మాసమున బ్రహ్మోత్సవం.

మార్గము: శ్రీరంగము నుండి ఉత్తమర్ కోయిల్ మీదుగా తిరుచ్చి-ఉరయూర్ బస్ మార్గములో శ్రీరంగమున నుండి 15 కి.మీ దూరమున గలదు. బస్ దిగిన పిమ్మట 1/2 కి.మీ దూరంలో సన్నిధి కలదు. ఏ వసతులు లేవు. శ్రీరంగము నుండి సేవించాలి.

   ఇన్దిరవోడు పిరమన్ ఈశన్ ఇమయవ రెల్లామ్‌
   మన్దిర మామలర్ కొణ్డు మఱైన్దువరాయ్ వన్దు నిన్ఱార్‌
   శన్దిరన్ మాళిగై శేరుం శదురరగళ్ వెళ్లఱై నిన్ఱాయ్‌
   అన్దియ మ్చోదిదువాగుమ్‌ అழగనే ! కాప్పిడ వారాయ్.
          పెరియాళ్వార్-పెరియాళ్వార్ తిరుమొழி 2-8-1

7. తిరుప్పుళ్ళం పూతంగుడి

(కుంభఘోణము 10 కి.మీ)

శ్లో. శ్రీ గృధ్రాభిధ తీర్థ సుందర తటే భోగేశయ ప్రాజ్మఖ:
   పుళ్లంపూద పురే తు శోభసపదం వైమాన మభ్యాగత: |
   శ్రీమాన్ వల్విలిరామ నామక విభు: పొత్తామరాఖ్య ప్రియ:
   గృధ్రేంద్రాక్షి పదం కలిఘ్న వచసాం పాత్రం తు రారాజతే:

వివరణ: వల్ విల్లి రాములు-పొత్తామరైయాళ్ తాయార్-శోభన విమానం గృధ్ర తీర్థము-తూర్పు ముఖము-భుజంగ శయనము-జటాయువునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశేషములు: శ్రీరామచంద్రులు జటాయువునకు ప్రత్యక్షమై మోక్షము నిచ్చిన స్థలము. ఈక్షేత్ర స్వామి విషయమై శ్రీ వేదాంత దేశికులు "పరమార్థ స్తుతి" అను స్తోత్రమును అనుగ్రహించిరి. తొండరడిప్పొడి యాళ్వార్ల అవతారస్థలమైన "మణ్ణబ్గుడి" ఈ దివ్యదేశమునకు అతి సమీపములో గలదు. 1 కి.మీ దూరములో తిరువాదనూర్ దివ్య దేశము కలదు.

మార్గము: కుంభకోణం-స్వామిమలై-తిరువైకావూర్ టౌను బస్ మార్గములో స్వామిమలైనుండి 5 కి.మీ దూరములో నున్నది. ఈ సన్నిధి అహోబిల మఠంవారి నిర్వాహములో నున్నది. మఠములో తగిన వసతులు గలవు.

   అఱివదయాన న్తె త్తులగుముడై యానెనై యాళుడై యాన్‌
   కుఱియ మాణురువాగియ కూత్తన్ మన్నియమరుమిడమ్;
   నఱియ మలర్‌మేల్ శురుమ్చార్క వెழிలార్ మఇజై నడమాడ
   పొఱిగొళ్ శిఱై వణ్డిశై పాడుమ్‌ పుళ్లమ్‌బూదబ్గుడిదానే
          తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 5-1-1