దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరువయిందిర పురమ్‌

వికీసోర్స్ నుండి

పా. ఆగుజ్కొల్ ఐయమొన్ఱిన్ఱి; యగలిడ ముత్‌తవుమ్‌ ఈరడియే
   ఆగుమ్‌ పరిశు నిమిర్‌న్ద; తిరుక్కుఱళప్ప నమర్‌న్దుఱై యుమ్;
   మాగమ్‌ తిగழ் కొడిమాడజ్గళ్; నీడుమదిళ్ తిరువాఱన్‌విళై
   మాకన్ద నీర్ కొణ్డు తూవి వల--య్‌దు; కై తొழ క్కూడుజ్గొలో.
         నమ్మాళ్వార్-తిరువాయిమొழி 7-10-2

శ్లో. ఇత్థం శ్రీమళయాళస్థ దివ్యదేశా స్త్రయోదశ|
   మయా సంకీర్తితా శ్రీమత్ రామానుజ కృపాబలాత్||

వివ: భగవద్రామానుజులవారి కృపాబలము వలన మళయాళ దేశమున గల పదమూడు క్షేత్రములు వర్ణింపబడినవి.

శ్లో. అథద్వే మధ్య దేశస్థా వర్ణ్యతే క్షేత్ర సత్తమౌ|
   రామానుజార్య కరుణా కటాక్ష బలతోమయా !

వివ: భగవద్రామానుజులవారి కరుణా కటాక్ష బలముచేత మధ్య దేశమున గల రెండు క్షేత్రరాజములు వర్ణింపబడుచున్నవి.

72. తిరువయిందిర పురమ్‌

శ్లో. శ్రీమత్ తార్ద్య తరజ్గిణీ తటతలే శేషాఖ్య తీర్థాంచితే
   దేవ శ్శ్రీమదహేంద్ర పట్టణ వరే చంద్రాఖ్య వైమానగ:|
   వైకుంఠాఖ్య రమాయుతో విజయతే శ్రీ దేవనాథ ప్రభు:
   ప్రాగాస్య స్థితి రిందు తార్ద్య విషయ స్తుత్య: కలిద్వేషిణ:||

వివ: దెయ్‌వనాయకన్(దేవనాథన్)-వైకుంఠనాయకి(హేమాబ్జవల్లి)-గరుడనది-శేషపుష్కరిణి-చంద్రవిమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-చంద్రునకు, గరుత్మంతునుకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: శ్రీమత్ వేదాంత దేశికులు తపమాచరించిన ప్రదేశము. ఇచటనేవారు గరుడోపాసన చేసి వారి వలన హయగ్రీవుల యనుగ్రహము పొందుటకై హయగ్రీవ మంత్రమును పొందిరి. ఇచటగల కొండపై వారు ఆరాధించిన హయగ్రీవుల సన్నిధి కలదు. ఈ కొండకు ఔషధాద్రి యనిపేరు. ఈక్షేత్రమున శ్రీమద్వేదాంతదేశికులు నలుబది సంవత్సరములు వేంచేసియుండిరి. వారి తిరుమాళిగ (ఇల్లు) వారు స్వయముగా స్వహస్తములతో నిర్మించిన కిణర్ (నుయ్యి) ఇప్పటికిని గలవు.

ఈక్షేత్రస్వామి విషయమై శ్రీవేదాంత దేశికులు దేవనాయక పంచాశత్, అచ్యుతశతకం(ప్రాకృతభాష)-గరుడదండకం, గరుడ పంచాశత్, హయగ్రీవ స్తోత్రములను అనుగ్రహించిరి. ఇచట శ్రీమణవాళమహామునులకును సన్నిధి గలదు. మేషము-పౌర్ణమి తీర్థోత్సవము-కన్యాశ్రవణం వేదాంతదేశికుల తిరునక్షత్ర మహోత్సవం చాలా వైభవముగా జరుగును.

                                              88 మార్గం: మద్రాస్-తిరుచ్చిరైలు మార్గంలో తిరుప్పాప్పు లియూర్ స్టేషన్ నుండి 5 కి.మీ. టౌన్ బస్ కలదు. మద్రాస్ నుండి మిగతా పట్టణముల నుండి "కడలూరు" బస్ గలదు. అక్కడ నుండి టౌన్ బస్ 5 కి.మీ.

పా. మిన్ను మాழிయజ్గై యవన్; శెయ్యవళుఱైతరు తిరుమార్వన్;
   పన్ను నాన్మఱైప్పల్ పొరుళాగియ; పరనిడమ్‌ వరై చ్చారల్;
   పిన్ను మాదవి ప్పన్దలిల్; పెడైవర ప్పిణియవిழ் కమలత్తు;
   తైన్న వెణ్ఱు వణ్డిన్నిశై ముఱల్‌తరు; తిరువయిన్దిరపురమే.
            తిరుమంగై ఆళ్వార్లు-పెరియ తిరుమొழி 3-1-2

73. తిరుక్కోవలూర్ 2

(గోపాలనగరమ్‌)

శ్లో. శ్రీమత్కృష్ణ సరోవరేణ కలితే శ్రీ కోవలూర్ పట్టణే
   భాతి శ్రీకర దేవయాన వసతి:పూంకోవలాఖ్యాం రమాం
   ప్రాగాస్య స్థితి రాయనారితి విభు: ప్రాప్తోమృకండోర్మునే:
   ప్రత్యక్షశ్చ బలే: సర: కలిరిపు శ్రీ భూతయోగి స్తుత:||

వివ: ఆయనార్(త్రివిక్రముడు)-పూంగోవల్ నాచ్చియార్-కృష్ణ పుష్కరిణి-శ్రీకర విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-మృకండుమహర్షికి, బలిచక్రవర్తికిని ప్రత్యక్షము. పొయిగై ఆళ్వార్-పూదత్తాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: పంచకృష్ణారణ్య క్షేత్రములలో నొకటి. శ్రీకృష్ణుని నిత్యసాన్నిధ్యము కలక్షేత్రము. ముదలాళ్వార్లని ప్రఖ్యాతులైన పొయిగై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ అను ముగ్గురు ఒకరి వెనుక ఒకరుగా ఈ దివ్యదేశమునకు వేంచేసి ఒక అరుగుపై నిలచుని యుండగా వీరి సంశ్లేషమును గోరిన పెరుమాళ్ళు వీరిమధ్యకు వచ్చి నిలచుండిరి. తమ మధ్య మరియెవరో నుండిరని భావించిన ఆళ్వార్లుకు పెరుమాళ్లు సేవ సాయింపగా ఆళ్వార్లు వరుసగా ముదల్ తిరువందాది, ఇరండాం తిరువందాది మూన్ఱాం తిరువందాదులు అను గ్రహించిన స్థలము. ముదలాళ్వార్లు మువ్వురు ఇటనే తిరునాడలంకరించిరి. ఇచట మూలవర్ త్రివిక్రమన్ కుడిపాదము పైకి ఎడమపాదము క్రిందకు గలదు. మరియు కుడిచేత శంఖము ఎడమచేత చక్రము ధరించియుందురు. మీనం-ఉత్తరా నక్షత్రం తీర్థోత్సవము-వృశ్చికమాసము కైశికి ఏకాదశి నాడు గొప్ప ఉత్సవం జరుగును. మరునాడు ద్వాదశి రోజున ఎంబెరుమానార్ జీయర్‌కు

                                          89