తెనాలి రామకృష్ణకవి చరిత్రము/కవిగండపెండేరము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నూపును కాఁబోలునని భావించి, తిమ్మన ఊఁ యనెను. వెంటనే వికటకవి తిమ్మనమోముపై నుమిసెను ఆగ్రహావేశమునొంది. 'ఓరి నీకేమి పోగాలమురా ? నిన్నుమియమంటినా? యని తిమ్మన గర్జింప, 'అవును మామా! ఊతునా! యని నిన్నడిగియే గదా నేనుమిసినాను, అని, రామకృష్ణుడు ప్రత్యుత్తరమిచ్చెను, కోపమాపుకొన జూలక తిమ్మనకవి యూయలపై నుండియే రామకృష్ణుని మొగముపై శక్తికొలదితన్నెను. ఆతాపునకు రామకృష్ణుని దంతమొకటి యూడిపోగా, నాతడు యింటికి బోయి దుప్పికొమ్ము నరుగదీసి పన్నుగా నమర్చుకొనెను ఆసంగతి రామరాజభూషణుడు తెలిసికొనెను నాటి మధ్యాహ్నము కొలువుకూటమున రాయలు 'రవిగాననిచో గవి గాంచునేకదా!' యనుసమస్యను పూర్తిచేయుమనెను. భట్టుమూర్తి యిట్లు పూర్తిచేసెను.

ఉ. “ఆరవి వీరభద్రచరణాహతిడుల్లిన బోసినోటికిన్
     నేరడు రామలింగకవి నేరిచెఁబో మన ముక్కు తిమ్మన
     క్రూరపదాహతిం దెగిన కొక్కెఱపంటికి దుప్పికొమ్ము ప
     ల్గా రచియించెనౌం! రవిగాననిచో కవిగాంచునేకదా!”

రాయ లాపద్యభావమును గూర్చి యాలోచనాథీనుఁడై యుండగా భట్టుమూర్తి జరిగినదంతయుచెప్పి రాయల కాహ్లాదము గలిగించెను.


17 కవి గండపెండేరము

కృష్ణరాయ లొకనాడు బంగరుపళ్ళెరమున గవిగండపెండేరమును దీసికొనినచ్చి, గీర్వాణాంధ్రములందునమోఘముగా కవిత్వము జెప్పువారికి గవిగండపెండేర మీయఁబడునని చెప్పగా కవులందఱు నాలోచనాధీనులై యుండగా, రాయలు మఱల నిట్లనెను-

ఉ. “ముద్దుగ గండపెండియరమున్ గొనుఁడంచు బహూకరింపఁగా,
     నొద్దిక నాకొసంగుమని యొక్క రుఁ గోరగ లేరు లేరొకో

అని యూరకుండఁగా పెద్దనకవిలేచి –

పెద్దనబోలు పండితులు పృథ్విని "లేరని నీ వెఱుంగవే
పెద్దన కీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా

అని యీక్రిందిమాలిక నాశువుగా జెప్పిను -

ఉ. “పూతమెఱుంగులుం బసరుపూప బెడంగును జూపునట్టివా
     కైతలు? జగ్గునిగ్గునెనగావలె గమ్మన గమ్మనన్వలెన్
     రాతిరియున్ పవల్ మరపురానిహొయల్ చెలియారదంపుని
     ద్దాతిరితిపులో యనగ దారసెలవ్వలె లోదలంచినన్
     బాతిగబైకొనన్ వలెను బై దలికుతుకలోని పల్లటీ
     కూతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
     జేతికొలందిఁగౌఁగిటను జేర్చినకన్నియ చిన్నిపొన్ని మే
     ల్మూతల చన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టిజూచినన్
     దాతొడనున్న మిన్నుల మిఠారపుముద్దులగుమ్మ కమ్మనౌ
     వాతెఱదొండపండువలె నాచశిగానలెఁ బంటనూదినన్
     గాతలఁదమ్మి చూలిదొరకైన పసపుంజవరాలి సిబ్బెపు
     న్మే తెలి యబ్బురంపుజిగి నిబ్బర వుబ్బ గబ్బిగుబ్బపొం
     బూఁతలపూనెకాయ సరిపోడిమి కిన్నెర మెట్లబంతిసం
     గాతి ప్రసన్న బంతి బయకాడపుఁ గన్నడగౌళపంతుకా
     సాతతతాతానంపనన్ దివుటాడెడు గోటమీటుబల్
     మ్రోతలనుంబలెన్ హరవు మొల్లముగావలె నచ్చ తెన్గు లీ
     రీతిగ సంస్కృతం బుపచరించెడు పట్టున భారతీవధూ
     టీ తపనీయగర్బవికటీ భవదానవసర్వసాహితీ
     భౌతిక నాటక ప్రకర భారతసమ్మత ప్రభా
     పాతసుధాప్రపూర బహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ

జాతక తాళ యుగ్మలయసంగతిచుంచు విపంచి కామృదం
గాతతతేహితత్తహితహా ధితదంధనుధానుదింధిమి
వ్రాతనయానుకూలపద నారికుహూద్వహహారికింకిణి
సూతనఘల్ఘ లాచరణనూపుర ఝాళఝళీమరంద సం
ఘాత వియద్దునీ చక చక ద్విక చోత్పల సారసంగ్రహా
యతకునూర గంధవహహారిసుగంధ విలాసయుక్తమై
చేతముచల్లఁ జేయవలె జల్లన జల్లవలెన్ మనోహర
ద్యోతకగోస్తనీ ఫలమధుద్రవగోమృత పాయస ప్రసా
రాతిరసప్ర సారరుచిర ప్రదంబుగ సారెసారెకున్.

రాయలంతట నానందభరితాత్ముడై కవిగండ పెండేరము నిచ్చి బహూకరించెనట. ఆగండపెడేరియిముం ధరియించి, పెద్దన కవి గర్వమును ప్రకటించుచు నొకనాఁడు సభలో నందఱును వినునట్లు శిష్యుల నుద్దేశించి యిట్లు పద్యములో సగము భాగమును జదివెను-

“చ. వదలక మ్రోయు నాంధ్రకవి వామపదంబున హేమసూపురం
      బుదితమరాళకంఠనినదోద్ధతి నేమనిపల్కు పల్కె రా”

రామకృష్ణుఁడు మిగతభాగము నిట్లు పూరించెను—

చ. 'సడలక మ్రోయు నాంధ్రకవివామపదంబున హేమనూపురం
     బుదితమరాళకంఠనినదోద్ధతి నేమనిపల్కు పల్కె రా
     గుదియల కాలినుండదగు కోమలకంధర భాగ్యరేఖ నీ
     నుదుటను లేదులేదనుచు నూఱు తెఱంగుల నొక్కిపల్కెరా?'
     పెద్దనకవి సిగ్గునొంది యానాటినుండి యట్లనుట మానివై చెను.

18 రామకృష్ణుఁడు-గూనిచాకలి.

కృష్ణరాయలొకప్పు డతిజరుగురగా శత్రురాజులపై దండెత్తుటను గూర్చి మంత్రివర్గముతో సహస్యాలోచనం బొనరించు