చీనా - జపాను/మంగోలియా చరిత్ర

వికీసోర్స్ నుండి
జపాను

ప్రతికూల ఉత్తరచీనా స్వతంత్ర రిపబ్లికుసభ” అధికారము క్రింద నుంచవలెనని కోరినది.నవంబరు 23 వ తేదిని ఇందుకై యుద్ధమునకు కూడ దిగినది.కాని కొందరు కర్షకులు పన్నులీయమని తిరగబడుట వలన జపాను కొంచెము శాంతించి వెనుకకు తగ్గినది.పీపింగు, టీస్ట్సిను మొదలగు నగరముల ప్రజలు చీనా పక్షపాతులే యైనను జపాను సహాయము లేనిదే తాము నెగ్గలేమని తక్కిన మూడు రాష్ట్రముల గవర్నరులకును తెలియ వచ్చినది.కనుక ఈ అయిదు రాష్ట్రములును నేడు చీనానుండి యింకా సంపూర్ణముగా స్వతంత్రములు కాకున్న ను చీనాకందు పలుకుబడి లేదనియు జపాను చెప్పినట్లుగా ఆడి జపానుకు లొంగియుండుచున్న వనియు విశదమగుచున్నది.

₪₪₪మంగోలియా చరిత్ర₪₪₪
మంచుకో దేశమునకు పడమరను రెండుదేశములున్నవి.దక్షిణభాగమునకు లోపలి మంగోలియా అనియు, ఉత్తరభాగమునకు వెలుపలి మంగోలియా లేక మంగోలియన్‌ రిపబ్లికు అనియు పేర్లు.ఈ రెండింటికిని చాలా భేదములున్నవి.మంచూకో రాజవంశమువారు మొట్టమొదట దక్షిణభాగముతో స్నేహముచేసి ఉత్తరభాగమును కూడా బెదరించి చీనానంతటిని జయించి ఒక సామ్రాజ్యముగా కొంతకాలము వరకును పరిపాలించిరి. ఈవిధము గా 1911 వరకు ఉండెను.1911 లో చీనా రిపబ్లికుస్థాపించబడగానే ఉత్తర మంగోలియా 58
చీనా-జపాను

తాను వేరే రిపబ్లికుగా ప్రకటించుకొనెను. లోపలి మంగోలియా మిాద చీనా అధికారము కలిగి యుండగోరెను గాని అదిసాగలేదు.కనుక ఈ రెండు రాష్ట్రములును అప్పటినుండి చీనాతో సంబంధము లేక స్వతంత్రముగానే ఉన్నవి.

క్రమక్రమముగా ఉత్తరమంగోలియాకు చీనాతోకంటె రష్యాతోనే సంబంధము ముదరజొచ్చెను.ఈదేశమునకు ఉర్గా నగరము రాజధాని, రష్యా సహాయముతో ఇక్కడ శాంతి నెలకొనెను. మధ్యయుగమునాటి జమిాందారీ తత్వము వదలిపోయెను.పశువుల మందలు పెరిగెను.1911-15 మధ్యను జారులు 5మిలియను రూబుల్సు మంగోలియాకు బదులిచ్చి బాగుచేసిరి. జపాను, చీనా కూడా తిరిగీ మంచి మాటలతో మంగోలియాను తమలో చేర్చు కొన గోరినవి కాని సాధ్యము కాలేదు.

వెలుపలి మంగోలియాలో చీనా జనరలు హ్సూ అనునతడు 1919 ప్రాంతమున కొంత భయంకరదారుణ పరి పాలనమును ప్రారంభించెను.కాని అంగెర్ను స్టెర్నుబర్గు అను ఒక్క పిచ్చి ప్రభువు(మేడ్‌బారిన్) ఆసమయమున లేచెను.అతడు జెంఘిస్కాను వంశీయుడు. లోపలి, వెలుపలి మంగోలియాలను కలిపి మంగోలియా సామ్రాజ్యముచేసి“ఆసియా వాసులకు ఆసియా” ఉండవలెనని అతను కొంత అలజడి చేసెను,జపాను ఇతనికి చాలాసాయమును కూడా చేసెను. కాని మూడు నెలలు దాటకుండా ఇతని పిచ్చిపరిపాలన మంతమొందెను.
జపాను

చీనా జనరలు హ్సూక్రిందను,మంగోలియా ప్రభువు అంగెర్నుస్టెర్ను క్రిందను పీడితులైన ప్రజలందరును మంగోలి యను ప్రజాపక్షమును స్థాపించిరి. ప్రభుత్వమును కూడానెలకొల్పిరి.పిచ్చిప్రభువును, చీనా జనరలును కూడా ఓడించిన వారు వీరే. వీరికి రష్యా సోవియటు ప్రభుత్వము సహాయమొనరించెను.చీనాప్రభుత్వము మంగోలియా ను తనక్రిందనుండి విడతీయరాదని సోవియటు ప్రభుత్వమునకు అర్జీ పెట్టుకొనెను. సరే చీనా క్రిందనే ఉండనీ అని రష్యాఊరకొనెను.అయినను మంగోలియా రిపబ్లికుపై చీనాకు నిజమైన యెట్టిఅధికారమును లేదు.ఈ దేశ ములో చాలామందిది బౌద్ధమతము.వారు సజీవబుద్ధుని(లివింగుబుద్ధ)పూజింతురు.కనుక బౌద్ధ లామాకు కొం త మతాధికారమున్నను,నిజమైన పరిపాలకులు మంగోలియను ప్రజాపక్షమువారే.1924 వరకుఒక బుద్ధుడు చస్తే మరియొక బుద్ధునెన్నుకొనుచుండిరి.కాని అప్పటినుండి ఆబుద్ధుని అనుచరులకు కాస్త ఆస్తిని విడచిపెట్టి తిరిగీ బుద్ధుని ఎన్నుకొనుటెమానిరి.

మంగోలియా రిపబ్లికు కాకముందు ఆదేశవర్తకమంతయు చీనావారి చేతులలో నుండెను.చీనావారు వారికి సరు కులరువిచ్చి అప్పులలో ముంచి పీడించుచుండిరి.రిపబ్లికు రాగానే ఆఅప్పులన్నీ రద్దుచేసినది. సహకార వ్యాపా రము వృద్ధియైనది. వెలుపలి మంగోలియాలో ఉన్నంత జాతీయత లోపలి మంగోలియాలో కాని మంచూకోలో కాని లేదు.ఇక్కడి పాఠశాల

29
60
చీనా-జపాను

లలో మంగోలుభాష, సేనలు మంగోలియా సేనలు, ఉద్యోగస్థులు మంగోలియనులు, వ్యవహారములు మంగోలి యాకు లాభప్రదములు:రెయిల్వేలు మొదలైనవి మంగోలియా స్వాధీనములో ఉన్నవి.రష్యా తూర్పుదేశ అంత ర్వ్యవహారములలో ఎట్టి జోక్యమును కలిగించుకొనదు.పరిశ్రమలు ఆధునిక పద్ధతులతో నడుచుచున్నవి.

దీనికంతకును కారణము రష్యాకు సామ్రాజ్యతత్వదురాశలులేకుండుటయే.1925 లో టర్కీతోను, 1926 లో అప్గనిస్థానముతోను,1927 లోపెర్షియాతోను పరస్పర స్నేహము, ఆక్రమణ విరుద్ధము అయిన ఒడంబడికలను చేసుకున్నది.మంగోలియా రష్యాచేతిలో కీలుబొమ్మ రాజ్యము కాదు.మంగోలియా రష్యాకు లొంగివున్న కంటె స్వతంత్రమై వుంటేనే రష్యాయొక్క తూర్పుదేశవ్యవహారనీతి కెక్కువ అనుకూలము.1933 లో రష్యా బలవంతమై యుంటే జపాను మంచూకోను స్వాధీనము చేసుకొనలేకుండేడిదట.మంచూకో స్వాధీనమైనంత మాత్రమున జపాను మంగోలియా రిపబ్లికుమిాద సులభతరముగా దాడి వెడలగులుగు ననుకొనుట కల్ల.మంగోలియాకు రష్యాపూర్ణముగా అండనిలచి యున్నదిగనుకనే జపాను ఆటలు సాగకున్నవి. మంగోలియా సరిహద్దులో జపాను ఎన్నో పితూరీలు రేపినది కాని దండయాత్రకు పూనుకొనలేకున్నది.జర్మనీ రష్యామిాదికి దాడి వెడలినను, జపాను దక్షిణచీనా, మధ్య చీనాలమిాదికే తగులునుకాని మంగోలియా మిాదికి వెళ్ళగలుగునేమో సందేహమే.
జపాను
♦♦♦చియాంగుకాయ్‌ సంకల్పములు♦♦♦♦

చియాంకుకాయ్‌షేకు నేడు చీనాకు డిక్టేటరు.నాంకింగు రాజ్యస్థాపకుడు.బుర్జువా వర్గమునకధినాధుడు.చీనా ఆయువుపట్టులన్నియు అతని స్వాధీనములో ఉన్నవి, నిజమే.కాని జపాను కతను లొంగిపోవుచుండుట ఆశ్చర్యము.అతనిలో జాతీయతత్వమునకు లోపమున్నదని యెవ్వరును అనలేరు.రష్యా సహాయముతో జపా ను ను కొట్టుటకాని,జపాను సహాయముతో రష్యానోడించుటకాని చీనా జాతీయవాదులకు సరిపడదట. నానా జాతి సమితివారు చీనా నుద్ధరింతురేమో అన్న ఆశ కొంతకాలముండెడిది కాని అది నిరాశయైనది. జపానుతో తాను డీకొనలేనన్న కారణము తప్ప చియాంగుకాయ్‌షేకుకు జపాను పక్షపాతముకాని ఆశకాని యేమిాలేదని చెప్పవచ్చును.అతనికి కావలసినదంతయు స్వతంత్ర చీనారాజ్యము.దీనికి భంగముగా జపాను యెన్ని కార్య ము లొనరించుచున్నదో, రష్యాపక్షపాతియగు చీనా కమ్యూనిష్టుపార్టీ అన్ని అవకతవకలు చేయుచున్నదని అతని విశ్వాసము.ఇల్లు చక్కపడనిదే పై వారిని తడుమలేమని అతని వ్యవహారనీతి.ఈకారణమున అతడు తన ప్రయత్నములను జపాను మిాద కంటె చీనా కమ్యూనిష్టు పార్టీమిాద కూడా యెక్కువగా కేంద్రికరించు చున్నాడు:పోనీ చీనా కమ్యూనిష్టుల దన్నుతో జపాను మిాద తగులుదమన్నను, ఈ కమ్యూనిష్టులు అంతవరకే అత

61