చీనా - జపాను/పాశ్చాత్య ప్రభుత్వముల వైఖరి

వికీసోర్స్ నుండి
జపాను
¶¶¶పాశ్చాత్య ప్రభుత్వముల వైఖరి¶¶¶

జపాను ఈవిధముగా చీనా నాక్రమించుచుండగా పాశ్చాత్యప్రభుత్వములేమి చేయుచున్నవి?గ్రేటుబ్రిటను తాను స్వతంత్రముగ నెట్టిచర్యయు తీసుకొనదు. నానాజాతి సమితి ద్వారా మాత్రమే అదియేమైనను చేయగలదు. నానాజాతి సమితిలో తగిన బలము కాని అయికమత్యము కాని లేదనుట విశదము. అమెరికా సంయుక్తరాష్ట్ర ములకు జపాను ఆక్రమణలు ఇష్టము లేదు.అయినను ఈవ్యవహారములను పైసలు చేసుకొనవలసినది చీనా వారే కనుక తాను యెక్కువ ప్రమేయము కలిగించుకొనదు. చీనాపౌరుల మిాదనే అది ఆశపెట్టుకొని కూర్చున్న ది.జర్మనీ జపానులో ప్రత్యక్షముగా సంధియే చేసుకొన్నది.సోవియటు తత్వమునకు ఇవిరెండును సమాన విరోధులు. నాంకింగుప్రభుత్వము బ్రిటను నుండి 200 మిలియనుల పౌనులను ఋణముగాకోరెను.కాని జపాను కిది యిష్ట ములేని కారణమున యేమి కొంపములుగునో అని గ్రేటుబ్రిటను ఇయ్యలేదు.జపాను అంటే బ్రిటనుకు బెదురు లేకపోలేదు.ఆబెదురువల్లనే బ్రిటను పసిఫిక్కుదీవులలో సింగపూరును బలపరచుచున్నది.దీనికి ప్రతిహతముగా జపాను సయాములో క్రాకెనాలును త్రవించి బలపరచుచున్నది. ఇంతవరకు బ్రిటనువైపు చూచుచున్న సయాము 1931 నుండి జపాను వైపు

5
65
66
చీనా-జపాను

తిరిగి పెట్టుబడి, యంత్రచాతుర్యము, పడవలు, సబ్మారెయినులను సేకరించుచున్నది.వాషింగ్టను ఒడంబడిక, కెల్లాగు ఒడంబడికనన్నింటిని జపాను తిరస్కరించినదునుట నిస్సంశయము.అమెరికా మన్రో సిద్ధాంతమునకు ను, జపాను మన్రోసిద్ధాంతమునకును హస్తిమశకాంతరమున్నది.అమెరికా సిద్ధాంతము,ఇతర తెల్లజాతులు లాటిను అమెరికాలోకి రావలదని మాత్రమే శాశించుచున్నది.జపాను సిద్ధాంతము జపాను చీనా నాక్రమింప వచ్చుననియు ఇతరదేశములు అందులో ప్రమేయము కలుగజేసుకొనరాదనియు నిషేధించుచున్నది.

రష్యా కూడా అమెరికా బ్రిటనులకు సహాయము కాకపోతే అవియుద్ధరంగములోనికి దిగవు.రష్యాకు విదేశాక్రమణ వాంఛలేదు.కనుకనే జపాను యెంత తుందుడుకుపడుచున్నను రష్యాఊరకొనుచున్నది.జపానుతో స్నేహము కొరకు రష్యా, చీనా తూర్పురెయిల్వేను జపాను కమ్మివేయుట కంగీకరించెను.జపాను కొనుక్కొనుటకు నిరాక రించి అల్లరులు చేయుచున్నది.జపాన్ ఒక్క రెయిల్వేలయినుతో తృప్తిపొందదు.మంచూకో సరిహద్దులను పొడ గించుటయే దాని సంకల్పము.రష్యా జపానులు రెండు సరిహద్దు రాష్ట్రములలో అనంతమగు సేనలను దింపు చున్నవి.వ్లాడివస్టకు వద్ద కూడ రెండుదేశములను తమనౌకాబలములను కేంద్రికరించుచున్నవి.ఎప్పుడో ఒకనాడు నౌకావైమానిక సైనిక యుద్ధమురాకమానదని పెక్కుఱు ఊహించుచున్నారు.ఇదివరలో
జపాను

ఐరోపాలో యుద్ధము జరిగితే జపాను బాగా జుఱ్ఱు కొనఁగలిగినది. ఇప్పుడు వచ్చేది ఒక్క ఐరోపాయుద్ధమే కాక దూరపు ప్రాగ్దేశ యుద్ధము కూడా అగును గనుక జపాను అందులో మునిగిపోవునని పాశ్చాత్యదేశము లూహిం చుచున్నవి.

♦♦♦1937 యుద్ధము♦♦♦

ప్రస్తుతము ఉత్తరచీనాలో చీనా జపానులకు యుద్ధము నడచుచున్నది. పీపింగు, టీన్సీలను మొదలగు నగర ముల నుండి చీనాసేనలు తొలగిపోవలెనని జపాను ప్రకటించెను.చీనాసేనలట్లు తొలగలేదు.ఆమిష మిాద జపా ను సేనలు చీనాసేనలనెదిరించినవి.చీనా సేనలు పీపింగువద్ద ఒక దేవాలయములోనికి తరుమబడినవి. బ్రిటను రాయబారులు అపాయమునుంది తప్పుకొనుటకు తాపత్రయము పడుచున్నారు.చీనా సేనలకు జనరలు సంగు చయను అధికారి.అతనికి నాంకింగు ప్రభుత్వము కావలసిన సహాయమునెల్లచేయుచున్నది.టంగుచౌ నగర మువద్ద 500 చీనావారు మరణించిరి. టెలిగ్రాముతీగెలు తెంచి వేయబడుటచే అక్కడి వార్తలు స్పష్టముగా బయటకు రాకున్నవి. ఫ్రాన్సు, బ్రిటను,అమెరికాదేశములు శాంతికొరకై ప్రయత్నించవలసినదని చీనా జపాను ప్రభుత్వములకు సందేశముల నంపినవి.అమెరికా జపానుకు తొమ్మొదిరాజ్యముల ఒడంబడిక ప్రకారము వర్తిం చుమని కబురు చేసినది.

67
70
చీనా-జపాను

నుండి వాల్జిమోస్టాక్‌ అనుప్రదేశం పొడుగునను ట్రాన్సుసైబేరియను రైల్వే అను పేరిట రైలుమార్గము వేసుకొనిరి. దీనికే తూర్పుచైనా రైల్వే అని పేరుంది.రష్యాలో కలిగిన విప్లవంవల్ల సోవియట్టు రష్యాగా మారిన తర్వాత రష్యా వారికి మంచూరియాలోనున్న అధికారం అంతటిని వదలుకొనెను.ఈ సందర్భములో ఈరైల్వేలైను నంతటిని సోవియట్టు రష్యావారు మంచూకో ప్రభుత్వమునకు అమ్మివేసిరి. జపానువారు మంచుకో అంతటిలోను రైళ్ళను వేసి ఒకవైపు రష్యా సరిహద్దులను కాపాడుకొనుటకున్ను మరోవైపున జపానుతో సులువుగా రాకపోకల ఏర్పా ట్లకున్ను తగిన సౌకర్యాలను చేసుకొనిరి.

మంచూకోను చైనా ప్రభుత్వము నుండి విడదీయుటకు జపాను కృషి చేసింది.మంచూకో చైనానుండి విడిపో యింది. ఆ విడిపోయిన ప్రదేశానికి ప్రత్యేక ప్రభుత్వము ఏర్పడినది.ఆ ఏర్పడిన మంచూకో ప్రభుత్వము జపా ను అధికారం క్రిందనుంటూ ఆ మంచూకో ఆర్థిక సౌకర్యాలకు జపానే పెట్టుబడి పెట్టుతూ ఆవిధముగా చైనాలో ఈమంచూకో భాగాన్ని జపాను ఆక్రమించి ఒకవైపున సోవియట్టురష్యా నుండి జపాను సామ్రాజ్యతత్త్వానికి ముప్పురాకుండా జూచుకుంటోది. మరోప్రక్కను మంగోలియా రాష్ట్రాలలో జపాను తన సైన్యమునువుంచి క్రమేణా చైనాను కబళించాలనుకుంటోంది.
1 వ అనుబంధము
♦♦♦చైనాలో మూడు ప్రభుత్వాలు♦♦♦

ప్రస్తుతం చైనాలో మూడురకాల అధికారాలున్నాయి.ఒకటి నాన్కింగు ;రెండు కాంటన్‌;మూడు సోవియట్టు ప్రభు త్వాలు.నాన్కింగు ప్రభుత్వమే పెద్దదిగా ఉంది.దీని తరువాత సోవియట్తు పెద్దది.కాంటన్‌ ప్రభుత్వము చిన్నది. కాంటన్‌ప్రభుత్వము కీ||శే|| సన్‌యెట్టుసేను యొక్క పద్ధతిలో కూడిన ప్రజాస్వామ్య పరిపాలన కావాలంటుం ది.నాన్కింగు ప్రభుత్వములో ప్రస్తుత అధికారులు జపాను ధాటీకి ఆగలేక ఏదోరీతిని జపానుతో సఖ్యత చేసు కోవాలంటూవుంటే అక్కడున్న యువకబృందానికి అదియుష్టము లేనందున యూవుభయులకు యూరీతి అంతః కలహాలునాయి. సోవియట్టులున్నచోట కార్మిక కర్షక ప్రభుత్వాన్నే బలపరచుకుంటూ మిగత యూనాన్కింగు, కాంటను ప్రభుత్వాలకు ప్రాకించి ఏక సోవియట్టు చైనాగా చేయాలనుకుంటున్నారు.చైనాలోని సోవియట్టులకు సోవియట్టు రష్యాయొక్క ఆంతరంగిక బలంవుందని సోవియట్టు రష్యాపై సామ్రాజ్యతత్త్వంతో కూడిన జపానుకు కోపంగా ఉంది.సోవియట్టు రష్యాలోని సామ్యవాదతత్త్వం ప్రక్కనున్న జపానులోనికి ప్రాకితే జపాను యొక్క సామ్రాజ్య ప్రాబల్యమునకు ముప్పుకలుగుతుందను భయంతో చైనానంతటిని జపానుయొక్క సామ్రాజ్యంలోనికి తీసుకొని రష్యాను అణచివుంచాలని జపానుకు ఉంది.చైనా స్వాతంత్ర్య

71