చీనా - జపాను/పాశ్చాత్యజాతులతో ప్రధమసంబంధములు

వికీసోర్స్ నుండి

చీనా - జపాను

చీనా

పాశ్చాత్యజాతులతో ప్రధమసంబంధములు

చీనా ప్రాచీనచరిత్రతో మనకిప్పుడు ప్రయోజనము లేదు.18 వ శతాబ్దముతో చీనాయొక్క నవీనచరిత్ర ప్రారంభిం చబడినది.బ్రిటిషు తూర్పుఇండియా వర్తకసంఘము హిందూదేశములో పండించిన నల్లమందును చీనా దేశమున కెగుమతిచేయుటకై సర్వహక్కులను అనుభవించగోరినది.కాంటను నగరమునందలి చీనావర్తక సంఘ ములు ఆసదుపాయములను కూడా వారికి కలుగజేతుమని యొప్పుకొనిరి.కాని 1839 లో చీనా ప్రభుత్వము చీనాలో నల్లమందును మానిపించబూని ఒక నిషేధాజ్ఞను ప్రకటించినది.ఇది ఈస్టుఇండియా కంపెనీ వారికోరికకు విరుద్ధము కనుక ఈ కంపెనీ నల్లమందు ప్రచారమునకై చీనాతో మూడు“పవిత్ర” యుద్ధములనొనరించినది.

ఈయుద్ధముల ఫలితముగా ఇండియాలోపండిన నల్లమందును, లంకాషైరులో నేయబడిన మిల్లుబట్టలను నిరాటంకముగా చీనాదేశములో దింపి విక్రయించగల సర్వాధికారములు బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీకి చిక్కినది.ఇంతే 2
చీనా-జపాను

కాకుండా హాంకాంగు అనేద్వీపము వీరికి దానముచేయబడినది.బ్రిటిషు వస్తువులమీద చీనాప్రభుత్వము దిగు మతి సుంకములను విధించకుండా చూచుటకై బ్రిటిషు ఉద్యోగస్థులను కంపెనీవారు యేర్పాటు చేసుకొనుటకు చీనా అంగీకరించినది.పైగా,చీనాలో కిరస్తానీ మత ప్రచారము చేయుటకు కూడ బ్రిటిషువారికి అనుజ్ఞ యీయ బడినది.

చీనా సింహద్వారము మొట్టమొదట పాశ్చాత్యవర్తకులకు ఈ రీతిని తెరువఁబడినది.ఒక్కబ్రిటను ప్రవేశించిన, తక్కిన దేశములు ఊరకుండునా?జారుప్రభుత్వము క్రిందనుండిన రష్యా కూల్జారాష్ట్రమును తీసుకొని మంగోలియా ఆక్రమణమునకుపక్రమించెను.ఫ్రెంచివారు అన్నాము అను విశాలప్రదేశమును తీసుకొనిరి.జర్మనీ,ఇటలీఁ బెలిజియము దేశములు కూడా ప్రవేశించి వారివారికి కావలసిన వర్తకసౌకర్యములు మొదలగువానిని నిర్బంధించి తీసుకొనియెను.చీనా మీద జపానుయుద్ధమును ప్రకటించి ఫార్మోజా, కొరియా, దక్షిణమంచూరియా యందున్న లియావోటంగు రాష్ట్రములను తీసుకొనెను.

ఈ దేశములు ఈరాష్ట్రములను చీనానుండి త్రుళ్లగొట్టి తీసుకొనిటయే కాక తమకు కావలసిన షరతులను పత్రముపై వ్రాసుకొని చీనాప్రభుత్వముచే బలవంతముగా సంతకము చేయించి“ఒడంబడిక”లు చేసుకున్నవి.ఈఒడంబడికల షరతులు విచిత్రములు.(1)చీనాలో యెక్కడ పట్టిన నక్కడ
చీనా


ఇవి స్వేచ్ఛగా వాణిజ్యము చేసుకొనవచ్చును.(2)వీరి దేశపు వస్తువులమీద చీనాప్రభుత్వము నూటికి 5 కంటె యెక్కువగా దిగుమతి సుంకములను విధించరాదు.(3)ఇట్లు విధించకుండా చూచుటకై ఈ దేశముల "నేషనల్సు" అనగా రాయబారులను లేక ప్రతినిధులను వీరు నియమించి చీనాలో కాపలా యుంచుటకు చీనా అంగీకరించవలెను.(4)ఈ విదేశస్థులు చీనాలో యెట్టినేరములు చేసినను వీరిని చీనాచట్టముల ప్రకారము శిక్షిం చరాదు.వీరిని వేరే కోర్టులలో విచారణ చేయవలెను.వీనికి"ఎక్స్ట్రాటెర్రిటోరియలు" కోర్టులు లేక చీనాదొరతన ప్రవేశమునకతీతమైన కోర్టులు అని పేరు.ఈ కోర్టుల ఉద్యోగస్థులను,సూత్రములను నిర్ణయించుట లేక యేర్పా టు చేయుట ఈ కూటము పనికాని చీనాకందులో నెట్టి ప్రమేయమును ఉండరాదు.(5)మంచిమంచి వర్తక కేంద్రములు,రేవు పట్టణములు మొదలగు వానిలో స్థిరావాసములు చేసుకొనుటకు వీరికి హక్కు లీయబడి నవి.(6)చీనామధ్య ప్రదేశములందు సేనలు,రేవు పట్టణములందు నావలు నిలువయుంచుకొని వారి దేశపు రాయబారులు(నేషనల్సు)కు అపాయము రాకుండా వారు చూసుకొనవలెను.(7)ఇంతే కాకుండగా చీనారెయిళ్ళు,ఫోస్టాఫీసులు,ఉప్పు మొదలైన వానివల్లవచ్చే ఆదాయములను తనిఖీచేయుటకు హక్కులను పిండుకొనినారు.

3
4
చీనా-జపాను

సమృద్ధిలో దారిద్ర్యము

ఈసంబంధముల వలన చీనాప్రజలు నానాటికి దరిద్రులగుచున్నారు.చీనా వ్యావసాయక దేశమై జీవనాధారములైన పంటలన్నిటినీ యెక్కీదొక్కీ పండించుచున్నను, ఈ పంటయంతయు నేమియగుచున్నదో కాని, చీనావారికి కావలసిన ఫోక్తు ఆహారపదార్థములలోనే నూటికి యెనిమిది వంతులు విదేశములనుండి అవి విధించిన వెలలకు కొనుక్కొన వలసి వచ్చుచున్నది.దీనికి సరిపడునట్లు వ్యవసాయమును వృద్ధిచేయవలె నంటే, భూమికి కొదువలేదు.ఇప్పుడు నూటికి 10 వంతుల భూమి సాగులోవుంటే తక్కిన 90 వంతులూ బీడే, ఈ 90 వంతుల భూమి తక్షణ వ్యవసాయమున కర్హమైనదే అయినప్పటికీ అందుకు తగిన పరికరములే చిక్కకున్నవి.పూర్వపు సాగు కాలువలను జలాధారములను మరమత్తు చేయుంచేటందుకు క్రొత్తవానిని నిర్మించే టందుకు దిక్కులేదు.కొన్ని చేలు యెండలకు మాడి పోతూవుంటే కొన్ని వరదలకు కొట్టుకొనిపోవుచుండెను. పేదలై నిరాధారులైయున్న ప్రజలు ఇట్టి దుర్భర వ్యయప్రయత్నముల కెట్లు పూనుకొనగలరు?అన్యదేశ నిర్బంధ ప్రభుత్వమునకు వీరిని బాగుచేయగల సమర్ధతకాని దీక్షకాని యెట్లు కుదరగలదు?

ఈస్వల్పమాత్రపు ఫలసాయమైనను ప్రజలు అనుభవించగలరేమో అంటే,దానిని అమ్ముకొని విదేశవస్తువులను