చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/కాకమ్మక్క కథ

వికీసోర్స్ నుండి

కాకులు పురాణకాలంనించికూడా ప్రసిద్దిగన్నవి. వెనక ఎప్పుడో ఒక కాకి అగస్త్యుడి కమండలం ఒలకబోసిందట. అప్పుడు అందులో ఉన్న గంగ బయటికి వచ్చి నదిగా ప్రవహించింది. శ్రీరామచంద్రుడు సీతతో అరణ్యంలో ఉన్నప్పుడు ఒకనాడు ఒక కాకివచ్చి సీతామహాదేవి రొమ్ముమీద పొడిచింది. రాముడికి కాకిమీద ఆగ్రహం వచ్చింది. దగ్గిరఉన్న గడ్డిపరక ఎత్తి కాకిమీద విసిరాడు. కాకిభయపడి మూడులోకాలూ తిరిగింది. రక్షించేవారు లేక ఆఖరుకు రామచంద్రుడినే శరణువేడింది. కాకికి ప్రాణం దక్కిందిగాని ఒక కన్ను పోయింది.

ఆనాటినుంచీ కాకులకు ఒంటికంటి చూపే.

కాకి ఎట్లా చూస్తుందో మీ రెరుగుదురుగాదూ?

కాకులలో ఉన్నకొన్ని మంచి లక్షణాలు మనుషులలో కూడా లేవు. వాటిలో వర్ణభేదంలేదు. అందుకనే 'తెల్లనికాకులునులేవు తెలియర సుమతీ' అన్నాడు కవి. కొన్నికాకులను మనం మాలకాకు లంటాం, కాని నిజంగా వాటిలో అంటరానితనం లేదు. కాకులు ఇళ్లకప్పులమీద వరసగా కూర్చుని చదువుకోవటం చూశారా? దాన్నే కాకిబడి అంటారు. కాకుల్లో ఇంకో మంచి బుద్ధికూడా ఉంది. ఒక కాకికి తినేటందుకేమైనా దొరికితే అన్ని కాకులనూ పిలుస్తుంది. అంతేకాని తనపొట్టకు మాత్రమే చూసుకోదు. వీటినిబట్టి కాకులు చాలా గొప్పవని చెప్పవచ్చు.

అటువంటి ప్రసిద్ధిగన్న కాకి వంశంలో పుట్టింది మన కాకమ్మక్క. ఆవిడ గొప్పసంగీత విద్వాంసురాలు. ఆవిడ గొంతెత్తి కాకధ్వనీ, కాకభైరవీ మొదలయిన రాగాలు పాడితే దిక్కులు మారుమోగుతాయి. వినేవాళ్ల చెవులు చిల్లులు పడతాయి.

కాకమ్మక్కయ్య మొగుడు కాకిబావ. చాలా విద్యలు నేర్చినవాడు. పిల్లల నెత్తి కొట్టి చేతిలోఉన్న అప్పచ్చులు కాజెయ్యటంలో నేర్పరి. ఇన్ని గొప్ప గుణాలుచూసే కాకమ్మక్క కాకిబావను వరించినది.

ఒకనాడు పొద్దున్నే కాకిబావయ్య కాకమ్మక్కయ్యతో అన్నాడు గదా:

"ఒసే, కాకామణీ! మనం ఈపూట ఎక్కడికైనా మంచిచోటికి విందుకుపోతే ఎట్లా ఉంటుందే?" అన్నాడు.

బావకు సంతోషంగా ఉన్నప్పుడు అక్కయ్యను కాకామణీ అని పిలుస్తాడు.

"బాగానే ఉంటుంది. ఎవరి ఇంటికి పోదాం?" అని రాగం తీసింది కాకమ్మ. కాకమ్మాక్క ఎప్పుడూ మామూలుగా మాట్లాడదు, సంగీతంలోతప్ప.

"దగ్గిరే నాయుడుగారిల్లుంది. పొద్దుటి పూట వారింటో చక్కని ఇడ్డెనలూ, ఉప్మా చేసుకుంటారు. అయితే నాయుడు గారు కుంభకర్ణుడు. బారెడు పొద్దెక్కిగాని లేవడు. ఏం మనుషులో వీళ్ళు! మనలాగా నీళ్లకు తెల్లారుజామునే లేచే అలవాటులేదు. వొట్టి సోమరిపోతులు. మన యిద్దరమూ నాయుడుగారింటికి పోదాం. నువు కమ్మగా ఆయనకు మేలు కొలుపులు పాడు. అప్పుడాయన లేచి మనకు ఫలహారం పెట్టిస్తాడు," అన్నాడు కాకిబావ.

నాయుడిగారి ఇంటిపక్కనే వేపచెట్టు ఒకటి ఉంది. దానికొమ్మ ఒకటి మేడ మీదికి ఉంది. ఆ కొమ్మమీద కాకి దంపతులు కూర్చున్నారు. ఇద్దరూ గొంతులు కలిపి ముచ్చటగా నాయుడుగారికి మేలు కొలుపు పాడ నారంభించారు.

       "కాకా! కాకాక్రా! అక్రా! కిర్ క్రీ! క్రా క్రా!"
       "కా అఅఅ! కా అఅఅ!క్రా అఅఅ!క్రు క్ర్ర్రీర్!"

కాకిపాటకు ఎంతటివాడైనా నిద్రలేవవలిసిందే. కాకిపాట రుషుల తపస్సు కూడా భగ్నం చెయ్యగలదు. కాని నాయుడుగారు ఎద్దుమొద్దు స్వరూపం అందుచేత ఆయన కాకిదంపతుల పాట లక్ష్యం చెయ్యకుండా గురకపెట్టి నిద్ర పోతున్నాడు.

అందుచేత మన కాకిదంపతులు స్థాయి హెచ్చించి రాగం మార్చి ఇంకో మాంచిపాట ఆరంభించారు. కాకభైరవి ఆలాపన జోరుగా సాగింది. అంతకంతకూ పంచమస్థాయికి వెళ్లింది. ఎట్లాగయితేనేం నాయుడుగారు లేచాడు. కాని కాకిపాట ఆనందించటానికి బదులు తనచేతికర్ర కాకులమీదికి కోపంగా విసిరివేశాడు. అది కాస్తా వేపకొమ్మల మధ్య చిక్కుకు పోయింది. చేసేదిలేక, నాయుడుగారు నౌకరును ఫలహారం పట్టుకురమ్మని కేకవేసి ముఖం కడుక్కోవటానికి వెళ్లాడు.

నౌకరు నాయుడుగారి పలహారం పట్టుకొచ్చి గదిలోపెట్టి వెళ్లాడు. ఆరు ఇడ్డెనలూ, కమ్మని నెయ్యీ, గారెలూ, బిస్కట్లూ, వెన్నా, అన్నీ పళ్లెంలో ఉన్నాయి.

కాకిబావా కాకమ్మక్కయ్యా చెట్టుమీదనుంచి దిగివచ్చి ఫలహారం ప్రారంభించారు. కాకమ్మక్కయ్య వొక్క ఇడ్డెనూ, వొక్కగారే తిన్నది. కాకిబావ మాత్రం దిట్టంగా తిన్నాడు. అయితే ఇద్దరూ వెన్న నంజుకున్నారు. ఇద్దరి ముక్కులకూ వెన్న అంటింది. ఇద్దరూ కాసిని మంచి

నీళ్ళు తాగారు. కాకిబావ నాయుడుగారి తివాసీమీద ముక్కు తుడుచుకున్నాడు. కాకమ్మక్కయ్య పక్కగుడ్డలతో తుడుచుకున్నది.

ముక్కు తుడుచుకుంటూ ఉండగా కాకిబావకు మంచి ఆలోచన కలిగింది. ఫలహారం పళ్లెమంతా తనుపట్టుకు పోతే ఎంతబాగుంటుంది, అని? ఆలోచన బాగానేఉంది కాని పట్టుకుపోవటం ఎట్లా? ఫలహారం పళ్లెం ముక్కుకు అరపదు, అందుకని కాకిబావ ఫలహారం పళ్లెం కిందఉన్న గుడ్డను ముక్కుతో పట్టుకు లాగాడు. బల్లమీద పళ్లెమూ, గిన్నెలూ, గ్లాసులూ పెద్ద చప్పుడుతో కింద పడ్డాయి.

ఇక గప్‌చిప్, అక్కడ ఏంజరిగిందో కూడా చూడకుండా కాకిబావా, కాకమ్మక్కయ్యా ఊళ్లోకి ఉడాయించారు.

అనగా అనగా ఒక నవాబు. ఆ నవాబుకు ఒక్కడే కొడుకు; ఒక్కతే కూతురు. కొడుకు చాలసాహసి. మిన్ను విరిగి మీదపడ్డా జంకేవాడుకాదు. పేరి ఫిరోజిషా. కూతురు చక్కని చుక్క. పేరు జహనారా.

ఆ నవాబు ప్రతి సంవత్సరం మహా వైభవంగా పీర్లపండగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడడానికి దేశ దేశాలనుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వచ్చేవాళ్ళు. వచ్చి తమతమ విద్యలనుచూపి నవాబువద్ద బహుమతులు పొందుతుండేవాళ్ళు.

ఒకయేడు ఆ ఉత్సవాలకు ఓముసలి శిల్పి వచ్చాడు. ఇతర శిల్పులు ఆడే బొమ్మలు, పాడేబొమ్మలు, ఇంకా రక రకాల ప్రతిమలుతెస్తే, ముసలితాత ఒక కొయ్యబొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే తతిమ్మా శిల్పులకు ఎక్కడలేని నవ్వువచ్చింది.

" ఈ గుర్రాన్ని నువ్వే చేశావా తాతయ్యా," అని అడిగాడు ఒక శిల్పి.

"బలేగుర్రం తాతయ్యా, ఎంత కిస్తావు?" అని వెక్కిరించాడు మరొక శిల్పి.

"ఏమిగుర్ర మనుకున్నావేమిరా అది దేవతాగుర్రం," అన్నాడు మరొక శిల్పి.

"వాళ్లతో నీకెందుకుకాని దీన్ని ఎంతకిస్తావో నిజంగాచెప్పు తాతయ్యా," అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి.

తాతకు కోపం వచ్చింది. "మీరు కొనలేరు, మీ అబ్బలు కొనలేరు. ఎందుకు