కవి జీవితములు/హుళిక్కి భాస్కరుడు

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

కవి జీవితములు.

రామాయణాంధ్రకవులు.

6.

హుళిక్కి భాస్కరుఁడు.

వాల్మీకిరామాయణముం దెనిఁగించిన కవిశిఖామణి యీతఁడే. ఈయనపేరిటఁ దెనుఁగురామాయణము భాస్కరరామాయణ మనంబరఁగును. ఇది భారతమునకంటెఁ గొంచెము పురాతనము. ఇది భాస్కరునిచేఁ దెనిఁగింపఁబడినట్లు విఖ్యాతి గల్గియున్నను గొంతభాగ మతని పుత్రుం డగుమల్లికార్జునభట్టారకునిచేతను, నా శేష మతనిశిష్యుం డగునయ్యలభట్టారకునిచేతను దెనిఁగింపఁబడియెను. ఇదియును భారతంబువలెఁ గారణాంతరమున శైథిల్యము నొంది పిమ్మట నీయిర్వురిచే తను సంపూర్తి చేయంబడినట్లు గోచరంబయ్యెడిని. ఈవిషయం బగు వృత్తాంతం బేమియు వాడుకలో లేదు కాని భాస్కరుఁడు మొదట గ్రంథంబు రచియించి యొకరాజునకుఁ గృతి యిచ్చుటకుఁ గొనిపోయె ననియు, నపు డారాజు దానిం గైకొనకుండుటకుఁ గనలి దాని నచ్చో నుండుగుఱ్ఱపువానికిఁ గృతి నిచ్చె ననియు, నతఁ డాతనికి విశేషంబుగ వరాల నిచ్చె ననియుం గలదు. ఆగుఱ్ఱపువాఁడే సాహిణిమారుఁడు. ఇందు గుఱ్ఱపువాఁ డనుమాటకు గుఱ్ఱమును గాచువాఁడని సాధారణముగ నర్థము చేయుదురు. ఇతఁడు గుఱ్ఱమును గాయువాఁడు గాక గుఱ్ఱపుదళవాయి యైనట్లు గాన్పించును. దానికి దృష్టాంతముగ నీవఱకే మనము భీమనచారిత్రములో కొంతచరిత్రము సూచించి యున్నారము. రాజు కృతి నంద లేదుగనుకను భాస్కరునకు స్వవాక్యపేఇపాలన


మే కావలసి యున్నది గనుకను నాకృతి మారనపేరిట నిచ్చి యుండును. అట్లు గాకున్నచో సత్కవి నీచు నేల కృతిపతిం గావించును? అట్లుండదు. సాహిణిమారునిపూర్వులు తగినంతగొప్పవారు కాకపోవచ్చును. కావున రామాయణకృతిముఖంబున నతనివంశముమాత్రము వర్ణింపఁ బడక యుండవచ్చును. భాస్కరుఁ డీసాహిణిమారుని నుతించి చెప్పినపద్యము లనేకములు. అందొకచాటుధారాపద్యము నీక్రింద వివరింతము :-

"క. అప్పు లిడునతఁడు ఘనుఁడా, యప్పు డొసఁగి మఱలఁ జెందునాఁతడు రాజా
    చెప్పఁగవలె సాహిణిమా, రప్పను దానమున ఘనుఁడు రాజు నటంచున్."

ఈ రామాయణగ్రంథకవులశయ్యాదులంగూర్చి ముందు వ్రాయుదము :-

గ్రంథోత్పత్తికారణము.

ఈగ్రంథోత్పత్తినిగూర్చి "పురాణనామచంద్రిక" అనుగ్రంథములో నొకతీరునఁ జెప్పఁబడి యుండెను. అది యెంతవఱకు నిజమో మనము చెప్పఁజాలము. అందు యధార్థము విశేషీంచి యుండవచ్చు నని యూహింపఁదగి యున్నది. ఆకథ యెట్లన్నను :-

"భాస్కరరామాయణము" భాస్కరునివలన నైనరామాయణము. ఇది భాస్కరుఁడు, అతనికుమారుఁ డగుమల్లిఖార్జునభట్టు, శిష్యుఁ డగుకుమారరుద్రదేవుఁడు, స్నేహితుఁ డగునయ్యలార్యుఁడు, ఈనలుగురుకవులచేతను రచియింపఁబడినది. అయినను వారిలో భాస్కరుఁడు ముఖ్యుఁ డగుటచేత నీగ్రంథము భాస్కర రామాయణము మన నెగడి యున్నది. ఇది యిట్లు రచింపఁబడుటకుఁ గారణ మేమనఁగా నాకాల మం దితనికి నాశ్రయుండై యుండినరాజునొద్ద నతనిబంధు వైనరంగనాథుఁ డనునాతఁడు రాజుయొక్క యాజ్ఞను బొంది ద్విపద రామాయణము రచియింపఁబూనుకొనఁగా నతనియందుఁ దనకుఁ గలసహజమత్సరము చేత రాజుతో "నీఘనతకు ద్విపదకావ్యము తగినది కాదు. నేను బద్యకావ్యమును జేసికొని వచ్చెదను. దానినిఁ బరిగ్రహింపుము" అనఁగా నతఁడు చెప్పినమాట తప్పుట యుక్తము గాదు గనుక రంగనాథుని


గ్రంథమునే కైకొనుతలంపున "నెవరు ముందు దెత్తురో వారికృతిని గ్రహించెదను" అని చెప్పి పంపెను. అప్పటికి రంగనాథుని రామాయణము మూఁడుపాళ్లు తీరియుండును. కనుక నితఁ డది ముగియుటకు ముందే తనరామాయణమును ముగించి కొనిపోవ నెంచి మీఁదఁజెప్పిన ముగ్గురిసహాయముచేతను త్వరితముగా ముగించుకొని పోయెను. అప్పటికి రంగనాథుడు తనరామాయణమును ముగించి యా స్థానమునకుఁ దెచ్చియుండెను. అది చూచి రంగనాథునితట్టు కుడిచేతిని భాస్కరునిత ట్టెడమచేతినిఁ జాఁచెను. అందులకు భాస్కరుఁడు కోపగించుకొని "పక్షపాతము గలనీవంటిరాజునకు నిచ్చుటకంటె నాకృతి నొకగుఱ్ఱపువాని కిచ్చుట మేలు" అని పలుకుచు నాస్థానమునుండి వెడలి పోవుచు నుండఁగా నా రాజుయొక్కగుఱ్ఱపుదళవాయి "కవిసార్వభౌమా! ఆడినమాట తప్పవలదు" అని దారికి నడ్డముగా వచ్చి మ్రొక్కెను. అంత నతఁడు వానికిఁ దనకృతిని నంకితముం జేసెను. కనుకనే యీగ్రంథాదియందు "సాహిణిమారా" యని సంబోధించి చెప్పఁబడి యున్నది. దీనిలోఁ గొన్ని యంశములంగూర్చి మనము చెప్పియుంటిమి గావున దీని నిపుడు విమర్శింప నవసరము లేదు. మనవిమర్శనమునకు వ్యతిరేకింప నది యంతయు మనయభిప్రాయము ననుసరించి యున్నట్లు గ్రహింపదగును.

రంగనాథరామాయణము.

రామాయణగ్రంథము పురాణము లన్నిటికంటెను ముందుగాఁ దెనిఁగింపఁబడినది. దీనినిఁ బెక్కండ్రు పెక్కుభంగులఁ దెనిఁగించిరి. వారిలో రంగనాథరామాయణగ్రంథకర్త మొదటివాఁడు. ఇతఁడు దీనిని ద్విపదగఁ దెనిఁగించెను. ఇది నెల్లూరిజిల్లాప్రాంతమున సర్వజనులకు వీథిపురాణముగ నుండెను. దీనిశైలి మృదువు గావున దీనిని జను లందఱును మిగుల నాదరంబుతోఁ జదువుదురు. ఇది కోనబుద్ధభూవిభునిచేతఁ దెనిఁగింపఁబడి యతనితండ్రి యగు విఠ్ఠలరంగనాథునకుం గృతి యియ్యఁబడినది. కావున దీనికి రంగనాథ


రామాయణ మని నామము కల్గినది. ఈరాజు దీనిఁ దెనిఁగించుకాలమునకు నన్నయభట్టారకుఁడు వ్యాకరణము చేసి యున్నట్లు కానరాదు. ఇందుఁ గొన్ని ప్రయోగములు నన్నయభట్టీయమతానుసారముగ నుండవు. ఆయాప్రయోగభేదములు గ్రంథము సావకాశముగఁ జూచినచో గోచరము లగును. పూర్వ వ్యాకరణములకు నిందు లక్ష్యములు పెక్కులు గాన్పించును. ఈగ్రంథములోనికల్పన లన్నియు మృదువు లయినవియు మధురము లయినవియు. ఇట్టిగ్రంథమును జూచి పద్యముగ దీని నితకంటెను బ్రౌఢిమతోఁ దెనిఁగింపఁ దలఁచి భాస్కరుఁడును రామాయణమును శిష్యులతోఁ గలిసి యారంభించి గ్రంథము ముగించె నని కొందఱయభిప్రాయము. ఈగ్రంథమును దొలుత మల్లికార్జునభట్టారకుఁడు ప్రారంభించి కోనభూవిభుఁడు తనతండ్రిపేరు గ్రంథమున కుంచినట్లతఁడును దనతండ్రిపే రాగ్రంథమున కుంచినట్లును మఱికొందఱు వాడుదురు.

రామాయణముపై విమర్శనము.

1. ఇందలిబాల కాండములోఁ గృతిముఖమునఁ గృతిపతి వర్ణన గాని, కవివంశవర్ణనము గాని లేదు. ఆశ్వాసాంతమునందును గృతిపతి పేరు చెప్పఁబడక గిరిజాధీశునకుం గృతి యిచ్చినట్లుగా నున్నది. దీనిచివరను గవినామము తెలుపుగద్యముమాత్ర మున్నది. అందులో "అష్టభాషాకవిమిత్రకులపవిత్రభాస్కర సత్కవిపుత్త్ర మల్లికార్జునభట్ట ప్రణీతం బైన" అని వ్రాసి యున్నది.

2. అయోధ్యాకాండములో "బుద్ధయకుమార సాహిణిమారా" అని కృతిపతి సంబోధింపఁబడియెను. ఆశ్వాసాంతములో "కాచమాంబాకుమారా" యని చెప్పఁబడియె. ఆశ్వాసాంతగద్యములో "సకలకళావిశారదశారదాముఖముకు రాయమాణసారస్వతభట్ట బాణనిశ్శంకవీర మారయకుమారకుమారరుద్రదేవప్రణీతం" బని గ్రంథకర్త వివరించెను.

3. ఆరణ్యకాండముమొదట నాశ్వాసారంభములో సాహిణి


మారుని సంబోధన యున్నది. రెండవయాస్వాసాదియందును నట్లే యున్నది. ఈరెండాశ్వాసాంతములయందును సాహిణిమారునిపేరు స్పష్టీకరింపఁబడ దయ్యెను. ఈరెండాశ్వాసాంతగద్యములయందును "సకలసుకవిజనవినుతయశస్కరభాస్కరప్రణీతం బైన" యని యున్నది.

4. కిష్కింధాకాండము మొదటిపద్యములో సాహిణిమారుఁడు స్పష్టపఱుపఁబడలేదు. ఆశ్వాసాంతమునందు "రథినీపాలాగ్రణీ సాహిణీ" యని చెప్పఁబడియెను. ఈయాశ్వాసాంతమందును "అష్టణాషేత్యాదిభాస్కరసత్కవిపుత్త్రమలికార్జునభట్ట ప్రణీతం" బని యున్నది.

5. సుందరకాండారంభమున "సాహిణిమారా" యనుసంబుద్ధి యిన్నది. ఆశ్వాసాంతమున సాహిణిమారునివిశేషణములు లేక యీశ్వరునివిశేషణము లున్నవి. ఆశ్వాసాంతగద్యమందు "అష్టభాషేత్యాదిభాస్కరసత్కవిపుత్ర మల్లికార్జునభట్ట ప్రణీతం" బని యున్నది.

6. యుద్ధకాండారంభములో "సాహిణిమారా" యనుసంబోధన మున్నది. ఆశ్వాసాంతమునందు నీశ్వరనామంబే స్మరియింపఁబడినది. ముద్రితగ్రంథములలో మాత్రము ఆశ్వాసాంతగద్యమందు "అష్టభాషేత్యాదిభాస్కరసత్కవిమిత్త్రాయ్యలార్యరచితం బైన" అని యున్నది. క్రొత్తప్రతులలో నున్న దానిని ముందు తెల్పుదము.

దీనినంతయుఁ బరిశీలించి చూడఁగా నీగ్రంథము మొదట సాహిణిమారునిపేరిట నుద్దేశింపఁబడనట్లును ననంతరము కారణాంతరమున నితనిపే రందుఁ జేర్పఁబడినట్లును గాన్పించును. లేకున్నచోఁ గృతిముఖంబునఁ గృతిపతివంశము వర్ణించుటయును షష్ఠ్యంతములు మొదలగునవియును గాన్పింపక మానవు. అట్టివి లేవు గనుకనే సాహిణిమారుఁడు గుఱ్ఱపుకాసుదా రని కొందఱును గాదు తదితరుఁ డని కొందఱును క్షత్రియుఁ డని మఱికొందఱును వచియించుటకు నవకాశ మిచ్చెను. "బుద్ధయకుమారసాహిణిమా రా" యని యుండుటచేతను బుద్ధరాజుకుమారుఁ డీసాహిణిమారుఁ డనియు "మారయ


కుమారరుద్రదేవప్రణీతం" బని యుండుట చేత నితనికుమారుఁడు రుద్ర దేవుఁడనియుఁ జెప్పుటకు సరిపడి యున్నది. కాని యిచట సాహిణిశబ్ద మేమిగాఁ బ్రయోగింపఁబడినదో దానిని యోచింపవలయును. కిష్కింధా కాండాంతమున "రథినీపాలాగ్రణీ సాహిణీ" అని యుండుటచేత నిది వంశనామముగా సూచించుచున్నది. ఇది వంశనామమే కాకున్నచోఁ బ్రతిచోటను "సాహిణిమారా" అని సంబోధనతో నవసరముండదు. మారయకుమారకుమారరుద్రదేవప్రణీత కృతిలో నీతని కుమారుం డని చూపుటకుఁ దగినవిశేషణములు వ్రాయక "సకలకలావిశారద" మొదలగునితరవిశేషంబు లుంపఁబడియెను. దీనిచేత మన మీవిధ మని నిర్ణయింపఁజాలము. కాని పైకథ యంతయు నవిశ్వస నీయ మని చెప్పఁదగినయొకవృత్తాంతముమాత్ర ప్రస్తుతము మనకు లభ్య మయినది. దాని నిచ్చో వివరించి మనయభిప్రాయము పిమ్మట దెల్పుదము ఈదేశములో ముప్పదియిద్దఱునియోగులపద్య మని యొక సీసమాలిక సర్వత్ర వాడుకలో నున్నది. అందులో నీసాహిణిమారుఁడును నొక్కఁడుగా లెక్కింపఁబడినాఁడు. దీనిఁబట్టి యిప్పు డితఁడు నియోగిబ్రాహ్మణుఁ డని నిర్ణయించి క్షత్త్రియపరముగా నన్వయింపఁబడినవిశేషణము లుపమలుగాఁ గై కొనవలయు నని చెప్పుదము. ఆపద్య మెట్లన్నను.

ముప్పదియిద్దఱునియోగులపద్యము.

సీ. కవు లిచ్చి భూపతి గాచి పట్టగ నొల్పెఁ, బ్రజలకై రాయనభాస్కరుండు
   వర దాతయై మణీవలయము ల్కవి కిచ్చె, దండిభాస్కరునూతి కొండమంత్రి
   భాస్కరువలెఁ గీర్తిఁ బడసెఁ దత్పౌత్రుఁ డౌ, ఘనరామలింగభాస్కరుఁ డొకండు
   గణకనిర్వాహంబు గల్గించె నూరూర, మహి గోపరాజు రామప్రధాని
   దుర్గ మియ్యక శత్రువర్గంబుతోఁ బోరెఁ, బెల్లుగాఁ గరణముమల్లమంత్రి
   యాత్మీయతపముచే నర్థి నాలుకమడ్డు, కేడించె బండారుకేతమంత్రి
   కవి పాముచేఁ జావఁగను నాయు వాతనికై యిచ్చె నేదమయాజిఘనుఁడు
   వేటారుతునిలయ వినుతులఁ జెండాడె, నాజిలో నాదెళ్ల యయ్య లయ్య
   పోరిలో నసహాయశూరుఁడై తెగి వెన్కఁ, బ్రతికె సిద్ధయతిక్కఁ డతులితముగఁ

    బట్టిసపురవీరభద్రుని ప్రేమచేఁ, జెన్నొందె శ్రీకోటసింగ రాజు
    ఇలుచూర యాచకావళికి దాతలదాత, యై యిచ్చె నిట్టలహరివరప్ప
    తనదుమీసముఁ దీసి తాకట్టుగా నుంచి, కొఠ్ఠరెఱ్ఱం డర్థికోర్కెఁ దీర్చె
    గణపతిదేవునికరుణ భట్టుకు మణి, యడపం బొసంగె గుండార్యవరుఁడు
    అష్టసహస్రంబు లర్థి కిచ్చి సుకీర్తి, మహిని సింగనమంత్రిమాచఁ డుండెఁ
    గొనియే భాస్కరునిచేఁ దెగుఁగురామాయణం, బారూఢి సాహిణిమారమంత్రి
    యాంధ్రనైషధకావ్య మందె శ్రీనాథునిచే, మామిడిసింగ నామాత్యమౌళి
    ఘనదానకర్ణుఁ డై గండపెండెముఁ దాల్చెఁ, గొఱవియన్నా మాత్యకుంజరుండు
    పగతుఁ జుట్ట మటంచుఁ బల్కఁగా ధన మిచ్చి, చేపట్టెఁ బెమ్మయసింగరాజు
    గురుజగత్త్రయదానగురుమూర్తియై మించె, నండూరిభీమన్న గుండమంత్రి
    పాణికోటికి నెల్ల బహుభక్ష్యభోజ్యాన్న, సత్త్రము ల్పెట్టె విస్సప్రధాని
    భట్టుమూర్తికిఁ గిన్క రెట్టింపఁ బచ్చల, హార మర్పించెఁ దిమ్మరసుమౌళి
    ఘనదైవతంబు ద్రాక్షారామభీమేశుఁ, డని కొల్చె బెండపూడన్న మంత్రి
    నీడఁ ద్రొక్కెడునీళ నెఱి నర్థి కభిమతం, బిప్పించెఁ జేమకూరప్ప రాజు
    ఘనసప్తసంతతు లొనరించి సత్కీర్తి, వెలయించె విఠ్ఠలవెఱ్ఱమంత్రి
    యమితశత్రుల గెల్చి యవనిఁ బాలనఁ జేసె, రహి గుంటుపలి ముత్త రాజమంత్రి
    తను నేలునృపతిచేతనె మేటికృతిఁ గాంచె, శ్రీగుంటుపలినరసింగమంత్రి
    ఘనభట్టుసుకవికి మణికుండల మొసంగి, నందితిమ్మకవీంద్రుఁ డందెఁ గృతులఁ
    గవుల కర్థ మొసంగి ఘనకీర్తిని వహించె రహిఁ గూరగాయలరామమంత్రి
    వాకిటికావలిజోకతో నొనరించి, దివ్యకీర్తి వహించెఁ దిమ్మమంత్రి
    రిపు గెల్వ నృపుఁ డిచ్చువిపులార్థముల నర్థి, కర్పించెఁ గటికికామన్న మంత్రి
    కవిబుధావళి నేలి ఘనకీర్తిని వహించె, వరకోటిపల్లిశ్రీశరభమంత్రి
    నిరతాన్న దాతయై నిత్యకీర్తి వహించెఁ, గాశిబందాపరదేశమంత్రి.

ఈ పద్య మే నిజమగునదియేని (కాదనుట కాధారములు లేవు) సాహిణిమారుఁడు నియోగిబ్రాహ్మణుఁడు కాని వేఱుజాతివాఁడు కాఁడు. దీనికి వ్యతిరేకముగాఁ జెప్పఁబడినకథ యంతయు విశ్వసింపఁదగ దని నిశ్చయింపక తప్పదు. ఇఁక మంత్రిభాస్కరుఁ డెవరు? హుళిక్కిభాస్కరుఁ డెవరు? అను మీమాంస యొకటి యున్నది. ఆవృత్తాంత మీ క్రింద ముచ్చటింతము :-

మంత్రి భాస్కర, హుళిక్కిభాస్కరు లొక రని తిక్కనసోమయాజి తననిర్వచనోత్తర రామాయణములోఁ దాను "గుంటూరివిభుని


మంత్రిభాస్కరునిమనుమఁడ" నని చెప్పెను దానిం బట్టి యీ రామాయణమును రచియించినభాస్కరుఁడే యతఁడు కానోవునా యని యొకసంశయము పొడముచున్నది. ఇట్టిసంశయమే కొందఱుపండితులకుం గల్గి శ్రీయాంధ్రాభాషాసంజీవనిలోఁ బ్రశంసింపఁగా, ఆ 1881 సంవత్సరము ఫిబ్రేవరునెల శ్రీ ప్రబంధ కల్పవల్లి "ఆంధ్రభాషాసంజీవనిలోని హుళిక్కి" యనుపేరిట నీక్రిందియుపన్యాసమును బ్రకటించినది. అది ప్రస్తుతాంశమున కెంతయు నుపయోగించును గనుక దాని నిట వివరింతుము. అదెట్లన్నను :-

తిక్కనసోమయాజియొక్క పితామహుఁడు మంత్రి భాస్కరుఁ డనియే సంజీవనిలోఁ బలుకఁబడెను గాని హుళిక్కి భాస్కరుఁ డని కాదు "మంత్రిభాస్కరు మత్పితామహునిఁ దలంచి" యని సోమయాజియే స్వరచితనిర్వచనోత్తర రామాయణముయొక్క ప్రథమాశ్వాసమున న్వక్కాణించెను. మంత్రిభాస్కరుఁడే హుళిక్కిభాస్కరుఁ డని ప్రబంధకల్పవల్లీవి లేఖకులు నిష్కర్షించుటకుం గలకారణముల నెఱుంగ నుత్సహించుచున్నారము" అని యుండెను. మఱియును సోమయాజిగారు స్వకృతభారతమున దేవా ! జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె." అని యనియే వాగనుశాసనమతానుసారులై రచియించిరి. కాని వారు భారతమునకంటెఁ బూర్వము రచియించిననిర్వచనోత్తర రామాయణమునందుఁ దమతాత యైనమంత్రిభాస్కరునిపథకము ననుసరించిరి. అదెట్లన్నను; సకలసుకవిజనప్రణుతయశస్కర భాస్కరప్రణీతం బైనశ్రీరామాయణమునం దారణ్య కాండంబునఁ బ్రథమాశ్వాసము తుదను "శా. పుణ్యుండూర్జిత... ఉర్వినెందున్" అనియు నీ మొదలగుకొన్ని సంగతులు వ్రాసియుండెను, దానిచే సంజీవనిలో రామాయణ గ్రంథకర్థ యగు మంత్రిభాస్కరుఁడు తిక్కనసోమయాజికిఁ దాత యనియే తెలిసినది.

1. ప్రథమమున నిర్వచనోత్తర రామాయణములోఁ దనకుఁ బితామహుఁడు గుంటూరివిభునిమంత్రిభాస్కరుం డనియు, నతనిమనుమఁ


డ నని యుఁ జెప్పికొనినచోఁ దనకవిత్వము సంప్రదాయశుద్ధ మని లోకమునకుం దెలియు ననియుం జెప్పెను. ఎట్లన్నను :- నిర్వచనోత్తర రామాయణములోని :-

గీ. సారకవితాభిరాము గుంటూరివిభుని, మంత్రిభాస్కరు మత్పితామహునిఁ దలఁచి
   యైనమన్ననమెయి లోక మాదరించు, వేఱె నాకృతిగుణములు వేయు నేల.

అనుపద్యముంబట్టి సోమయాజి నిర్వచనోత్తర రామాయణమును రచించుటకుఁ బూర్వము కవిత్వసంప్రదాయమునకు విశేషముగఁ బ్రసిద్ధి కెక్కినభాస్కరుఁ డనునొకకవి యుండె నని యూహింప వలసి యుండును. అట్టివారిలో రామాయణమును దెనిఁగించినభాస్కరుఁడు తప్ప మఱెవ్వరును భాస్కరులు గానరారు. ఇందుచేత నీతఁ డే తిక్కనసోమయాజి వక్కాణించినభాస్కరుఁ డని యూహింతము.

2. ఇంతియ కాక తిక్కన సోమయాజి యుత్తర రామాయణమును దెనిఁగించుటకుఁ గారణము నీతనిమనుమఁ డగుటచేతనే యని తోఁచెడిని. రామాయణముయొక్క పూర్వభాగము తిక్కనతాతచే రచియింపఁబడినచోఁ దిక్కన యాగ్రంథమంతయుఁ బూర్తి సేయుటకు యత్నించుట లెస్సయై యుండునుగదా. అపుడు రామాయణ మంతయు వారి వంశజులచేతనే తెనిఁగింపఁబడె ననుఖ్యాతి గల్గును. అట్టిసంబంధ మేది యేని లేనిచో నొరులు రచించినగ్రంథ శేషమునే తిప్కన తెనిఁగింప నుత్సహించుట గలుగదు. భారత మెట్లు తెనిఁగించి రంటిరో దానికిఁ గారణాంతరము లున్నవి.

3. భారతములోఁ దెలఁబడిన యీక్రిందిపద్యము పైయూహలను మఱికొంత బలపఱచుచున్నది. ఆపద్య మెద్ది యనిన భారతమువిరాట పర్వములో :-

"సీ. మజ్జనకుండు సన్మాన్యగౌతమగోత్ర, మహితుండు భాస్కరమంత్రితనయుఁ
    డన్న మాంబాపతి యనఘులు సింగన, మల్లన సిద్ధనామాత్యవరుల
    కూరిమితమ్ముండు గుంటూరివిభుఁడు కొమ్మనదండనాథుండు మధురకీర్తి."

అని యున్నది. దీనింబట్టి భాస్కరునకు నల్గురుకొడుకు లనియు వారినామములు సింగన, మల్లన, సిద్ధన, కొమ్మన యనియు నుండెను.


రామాయణమును రచియించినభాస్కరునకు మల్లికార్జునభట్టారకుండనుపుత్త్రుఁ డున్నట్లు స్పష్టమే. ఇతనినే మల్లన యని చెప్పినఁ జెప్ప నొప్పును. వీనింబట్టి చూడఁగా రామాయణగ్రంథకర్త యగుభాస్కరుఁడే తిక్కనసోమయాజికిఁ దాత యగుభాస్కరుఁ డని చెప్పఁదగి యున్నది.

కాని కొందఱమతముచేతను హుళిక్కిభాస్కరుఁడును, మంత్రి భాస్కరుఁడును వేఱని యున్నది. దానికి వారిచేఁ జెప్పఁబడిన కారణ మేమనఁగా హుళిక్కి భాస్కరునిగద్యము "శ్రీమదష్టభాషాకవిమిత్త్రే" త్యాది యైనట్లు బాల కాండాదులు రచియించినమల్లికార్జునభట్టుగద్యము చేతను, యుద్ధకాండశేషమును రచియించిన యయ్యలార్యునిగద్యము చేతను దెలియవచ్చు చున్నట్లు నున్నది. ఇది యెంతవఱకు సయుక్తికమౌ యాలోచింతము. బాలకాండము, కిష్కింథాకాండము, సుందరకాండము వీనితుదను "అష్టభాషాకవిమిత్త్రకులపవిత్రభాస్కరసత్కవిపుత్ర" అని యున్నది. ఈ మొదటివిశేషణము భాస్కరుని కన్వయించి యీసందేహముల నందుచున్నారు. ఇవి మల్లి కార్జునభట్టునకే విశేషణము లేల కాఁ గూడదు? ఆపక్షములో నరణ్యకాండాంతములో నున్న "సకలసుకవిజనవినుతయశస్కరభాస్కరప్రణీతం బయిన" యనుగద్యము పై దానిని బాధింపదు. ఇఁక నయ్యలార్యుఁడు యుద్ధకాండాంతమున వ్రాసినగద్యములో నుండు "అష్టభాషాకవిమిత్త్రకులపవిత్రభాస్కరసత్కవిమిత్త్రాయ్యలార్యరచితం బయిన" యనుదాని నాలోచింపవలసి యున్నది. ఇక్కడ నైన నీబిరు దయ్యలార్యునకును గలదా యని యూహింప వలసి యున్నది. అది యెట్లనఁగా :-

"ఇది శ్రీశాకల్ల్యమల్లకవివరరామనృసింహవరజాప్పలార్యవరనందనోభయ భాషాకవితావిశారద శారదాచరణకమల పరిచరణపరిణత మానసాయ్యలార్యవిరచితం బయిన శ్రీమద్రామాయణంబునందు యుద్ధకాండశేషంబునందు సర్వంబును నేకాశ్వాసము"

ఆని. ఈతఁడు తాను "హుళిక్కిభాస్కరుఁడు చెప్పఁగా మిగిలియున్న యుద్ధకాండమును బూర్తిచేసితి: ననియును. యుద్ధ కాండాంతమునం దొకపద్యము గద్యస్థానీయముగాఁ జెప్పెను. దీనితోడనే


గ్రంథము ముగియునట్లుగాఁ దోఁచుచున్నది దానిక్రింద వ్రాయఁబడిన రెండుమూఁడుపద్యములును గద్యమును బై గద్యములో నవీనకల్పితములుగాఁ దోఁ చెడిని. యుద్ధకాండముతుదను వ్రాయఁబడినపద్య మిట వివరింతము. అ దెట్లన్నను :-

చ. అమర హుళిక్కిభాస్కరమహాకవి చెప్పఁగ నున్న యుద్ధకాం
   డముతరువాయి చెప్పె వికటప్రతిభాషణుఁ డప్పలార్యస
   త్తమసుతుఁ డయ్యలార్యుఁడు కృతస్థితి నార్యులు మెచ్చునట్లుగా
   హిమకరతారభాస్కరమహీవలయస్థిరలక్ష్మి చేకుఱన్.

అను నిట్టివానిం బట్టిచూడఁగా రామాయణమును రచియించి నట్టి భాస్కరుఁ డొక్కఁడే కాని యిర్వురు కా రనియును, నతనికే "సకలసుకవిజనవినుత యశస్కరభాస్కరుఁ డనియును, హుళిక్కి భాస్కరుఁ డనియును నామము లనియును నూహింపనై యున్నది. ఇదివఱలో సూచింపఁబడిన కారణములచేత నితఁడే గుంటూరిప్రభునిమంత్రి యగుభాసరుఁడనియుఁ దిక్కనసోమయాజికి దాత యనియు నూహింపఁదగి యున్నది. గుంటూరివిభుఁ డెవ్వరోమాత్ర మూహింపఁజాల కున్నారము. తిక్కన నెల్లూరిప్రభుఁడగు మనుమసిద్ధికడ నున్నట్లు ప్రసిద్ధి గలదు. ఇతని పూర్వులు మనుమసిద్ధికిఁ బూర్వులకడ నుండుట సహజము. అట్లు గానుపించక తిక్కనయొక్కపూర్వులు గుంటూరివిభునికడ నున్నట్లుగాఁ గాన్పించును. పైపద్యములో "గుంటూరివిభున్ మంత్రిభాస్కరు" నని విడఁదీసినచో గుంటూరికి మిరాసీదా రని కాని మొఖాసాదారని కాని కూడ నర్థము చెప్పవచ్చును; గ్రంథదృష్టాంతము లేదు గావున నీవిషయము ముగించి, యిట్టిగుంటూరి విభునికడ మంత్రిగా నున్న భాస్కరుఁ డనేకపదపద్యముల నంది యుండుటంగూర్చి యోజింతము. ఇప్పుడు మనము మాటలాడుకాలములో దేశచారిత్ర మేమియును దెలియదు. దేశములో నాభాస్కరుఁ డేయేఘనకార్యములు చేసి పదపద్యము లందెనో దాని నూహింప నలవి కాక యున్నది. అట్టి పదపద్యము లేమయిన నున్నవా యనియు సంశయింపవలసియున్నది. ఆంధ్రకవిచరి


త్రములో వ్రాయఁబడినపద్యము లన్నియుఁ గృష్ణరాయనికాలములోఁ బ్రసిద్ధిఁ జెందినరాయనిభాస్కరునివియును, నతని వంశస్థులవియును గాని రామాయణగ్రంథకర్త యగుభాస్కరునివి కావు. రాయనిభాస్కరునిచారిత్ర మీవఱకే మత్కృతము లగురాజచారిత్రములతో వ్రాయఁబడి యున్నది. అం దీపద్యములును వానివానికిఁ గలకారణములును సూచింపఁబడినవి. "రాయ" లనుబిరు దాంధ్రదేశపు ప్రభువులకుఁ గాక కర్ణాటదేశప్రభువులకే చెల్లును. దానిచేతనే యిప్పటికిని నాదేశములో గొప్పవారిని సంబోధించునపుడు సర్వత్ర "రాయల వారూ 3" అని వాడఁబడుచుండును. అట్లుండఁగా "రాయనిమంత్రిభాస్కరుఁ డని ప్రత్యేకము" వక్కాణించి చెప్పినపద్యములుగూడ రామాయణకవి యగుభాస్కరునకు సమన్వయించుట సంప్రదాయవిరుద్ధ మని మాయభిప్రాయము.

రాయనిమంత్రిభాస్కరునికుమారుని పేరు. [1] కొండన. ఈకొండనయే కొమ్మన యని వ్యవహరింపఁబడు ననుమాటకు గ్రంథదృష్టాంత మేమియును లేదు. కొండన కొమ్మన కావచ్చు ననుదానికిఁ గారణము భాస్కరునివిషయ మయి కలిగినపొఱపాటే యగును.

భాస్కరుని కాలనిర్ణయము.

ఇఁక నీ రామాయణకవియొక్క కాలనిర్ణయముంగూర్చి యాలోచింపవలసి యున్నది. అది యంతయు తిక్కనకాలనిర్ణయముంబట్టి నిష్కర్షింపఁబడును. తిక్కనకాలనిర్ణయ మయినది గనుక నతనితాత యగుభాస్కరునికాలమును సులభముగ నిర్ణయింపవచ్చును. అయినను నాంధ్రకవిచరిత్రములో నీయఁబడినభాస్కరునికాలముంగూర్చి కొంచెము సంవాదింతము :-

బెజవాడమల్లేశ్వరస్వామికి భూమి యిచ్చినట్లుగా నచటి స్తంభమున నొకశాసన మున్న దనియును, నాశాసనములోఁ జెప్పఁబడినరాయన


ప్రగ్గడ రాయనిభాస్కరుఁడే యనియును నతనిదానశాసనకాలము శా. సం. 1138 అవుటంబట్టి భాస్కరునికాల మదియే యనియును వ్రాయఁబడియెను. కాని యీ శాసనము తిరుగా నొకపరి పరిశీలింతము. ఈ శాసనసంగ్రహ మింగ్లీషులో న్యూయలుదొరవలన బ్రాచీనశాసనపట్టికలో నీక్రిందివిధముగా వ్రాయఁబడియున్నది. ఎట్లన్నను :-

"(35) On the Same. S. S. 1138 (A. D. 1216) Grants by Bollana, Brahman "minister" and by Rayana Peggada, Commander of the Forces of Sriman Mahamandalika Gunturi Odaya Rajah"

దీనింబట్టి చూడఁగా శ్రీమన్మహామండలీక గుంటూరియుదయరాజుయొక్క సేనానాయకుఁ డగురాయనప్రగ్గడవలనను, బొల్లన యను నొకబ్రాహ్మణమంత్రివలనను దానములు శా. సం. 1177 సంవత్సరమునం దీయఁబడినట్లుగాఁ గాన్పించును. ఇందులో గుంటూరిప్రభునికి రాయనప్రగ్గడ సేనానాయకుఁడు గాని మంత్రి కాఁడు. మంత్రికిని సేనా నాయకునకును భేదము చాలఁ గలదు. కావున నాసమన్వయము సరిపడి యుండదు. ఇంతియకాక రాయనప్రగ్గడ యనఁగా రాయన్న యను మంత్రి యని యర్థమగును గాని రాయనిభాస్కరుఁ డని యర్థము కాఁ జాలదు. ఇట్టిశాసనబలంబున నీహుళిక్కిభాస్కరుని కాలనిర్ణయముఁ జేయుట యెంతమాత్రమును యుక్తియుక్తము గాదని యూహించెదము.

ఇఁక భాస్కరునికాలనిర్ణయము చేయుటకుఁ దగినసాధనము లేవి యని యూహింపఁగాఁ బ్రతాపరుద్రవంశచారిత్ర మనంబరఁగు సోమదేవరాజీయములో రుద్రమహారాజుసభకు హుళిక్కి భాస్కరుఁడు రంగనాథుఁడు మొదలగువారలు వచ్చుచుండి రనుకథంబట్టి యితఁడు రుద్రునికాలమువాఁ డని నిర్ణ యింపవచ్చును. కాని యారుద్రునికాలమును నాగ్రంథములో నొకవిధముగా విశదీకరించినను రుద్రనాము లిర్వురు మువ్వురుప్రభువు లుండుటచేత నొకరికాలమందు జరిగినవృత్తాంతము లింకొకరికాలములో జరిగినట్లు కాలనిర్ణయసామగ్రి లేకుండుటం


జేసి యట్లుగా గ్రంథకర్తవలనం దెల్పఁబడియె నని తోఁచును. ఇప్పటికి మనకు దొరకినశాసనసహాయముంబట్టి యేకథ యేరుద్రునికాలములోనిదో కొంత నిర్ణయింపఁగలము. ప్రస్తుతము మనము మాటలాడుచున్న హుళిక్కిభాస్కరునికాలము నుడివినతోడనే పద్మనాయకుల (వెలమల) వృత్తాంతము చెప్పి యట్టివెలమ లందఱును రాజును సేవించి యుండి రని వ్రాసెను. ఈవెలమలశాఖ ప్రతాపరుద్రునికాలములో బడబానలభట్టారకునివలన శపింపఁబడినట్లు పద్మనాయకచరిత్ర యనునొకచారిత్రమువలనం గాన్పించును. అందులకు నొకశాసన మున్నట్లాగ్రంథములో వ్రాయఁబడియున్నది. ఆశాసనకాలము శా. సం. 1019 అయి యున్నది. దీనికి సంబంధించు మొదటిప్రతాపరుద్రునికాలమును సోమదేవరాజీయములో వ్రాయఁబడి యున్నది.

అదెట్లన్నను :-

శా. సం. శా. సం.
కాకతిపోల్రాజు 909 982
రుద్రదేవరాజు 982 1054
మహాదేవరాజు 1054 1057
గణపతిదేవరాజు 1057 1085

ఈప్రకారముగా నున్నవి. కావున సోమదేవరాజీయములో హుళిక్కిభాస్కరుఁడు ప్రతాపరుద్రునియాస్థానమునకు వెళ్లినాఁడని చెప్పినవృత్తాంతమునకు మొదటిరుద్రదేవరా జని సమన్వయించినచో సరిపడి యుండును. ఇది యథార్థముగాఁ గూడఁ గాన్పించును. ఏమనిన నితనిమనుమఁ డగుతిక్కనసోమయాజి గణపతిరాజుసభకుం బోయె ననియు నచ్చో నతనికి భారతార్థంబు లుపన్యసించి చెప్పె ననియు నీగ్రంథములోననే కాన్పించుచున్నది. కావునఁ దిక్కనసోమయాజికిఁ బూర్వుఁ డగుభాస్కరుఁడు గణపతిదేవునకుఁ బూర్వుఁ డగురుద్రమహారాజు కాలములో నుండె నని చెప్పుట సయుక్తికమును నిర్బాధకమును నై యున్నది. కావున భాస్కరునికాలము శా. సం. 950 మొదలు 1000


లోపున ననఁగా క్రీ. శ. 1027 మొదలు 1077 లోపుగానై యుండును. కావుననే యీకృతిరచన భారతమునకుఁ బూర్వమే యని నిర్ణయింప వలసి యున్నది. అప్పటికి నన్నయభట్టారకునియాంధ్రశబ్దచింతామణి పుట్టి యుండినట్లు కాన్పించదు. కావున నిందు నాంధ్రశబ్దచింతామణికి విరుద్ధము లైనకొన్ని ప్రయోగములు గాన్పించును. ఆంధ్రశబ్దచింతామణి ననుసరించియే భారతము రచియింపఁబడినది గనుక భాస్కరరామాయణము దానికిఁ బూర్వ మనియే చెప్పనొప్పును.

సోమదేవరాజీయములోఁ బ్రతాపరుద్రునిదర్శనమునకు వచ్చు వారు "శాకల్లిమల్లికార్జునభట్టు" మొదలయిన బ్రహ్మవిద్వాంసులు బంగరుపల్లకీ లెక్కి వచ్చువారు నూటయేఁబండ్రును, హుళిక్కిభాస్కరుఁడు మొదలుగాఁ గలనత్కవీశ్వరు లిన్నూటయేఁబండ్రును, గుండభొట్లు, ప్రతాపభోట్లును మొదలగు వేద వేదాంగపారగు లయినపురోహితు లిన్నూట యిరువండ్రును" అని చెప్పఁబడి యుండెను. అందులోనే హుళిక్కిభాస్కరునివిషయమై మఱియొకచోటఁ గొన్ని మాటలు వ్రాయఁబడి యున్నవి. అవియును నాగ్రంథక ర్తచేఁ గాలనిర్ణయ మెఱుఁగ కుంటచే వ్రాయఁబడినవిగా భావింపవలసియున్నవి. అందుఁ గొన్ని రెండవరుద్రుని వృత్తాంతములును గొన్ని మొదటిరుద్రునివృత్తాంతములును వ్రాయఁబడినవి. ఆరుద్రచరిత్రములో నదియంతయు స్పష్టపఱుపఁబడును.

భాస్కరనాములంగూర్చి.

రామాయణమును దెనిఁగించినభాస్కరుఁ డాంధ్రదేశములో సుప్రసిద్ధుఁడే. అయినను నతనినామము గలవారు మఱికొన్ని కార్యములలోఁ బ్రసిద్ధి నొందినవారును మఱికొందరు గలరు. కావునఁ బాఠకులు "గుంటూరిభాస్కరుఁడు, హుళిక్కిభాస్కరుఁడు" అనువా రిరువురును నొకరే యనియును, "వినుకొండభాస్కరుఁ"డని యున్న పు డతఁడు దానమున విఖ్యాతుఁ డగు "రాయనిభాస్కరుఁ"డనియును, "గుంటుపల్లిభాస్కరుఁ"డని చెప్పినచో నింద్రజాలాదికములఁ జేసి నేఁటివఱకును విప్రవినోదులు మొదలగువారివలనఁ దద్విద్యాప్రకటనావసరమున స్మరియింపఁబడు


వాఁ డనియును, "రామలింగభాస్కరుఁ" డని యుండినచో భట్రాజులచే నుతియింపఁబడు "రాయనిభాస్కరునిమనుమఁ" డనియును గ్రహింపవలయును. ఇట్టియేర్పాటులు చేసికొనిననాఁడు వీరివృత్తాంతములు కల గలపులే వీరికాలనిర్ణయమును జేయనీయక యెట్టివారి కైనను దిగ్భ్రమనుఁ బుట్టించును. కావున మెలఁకువతో దీనినిగ్రహింపవలయును.

రామాభ్యుదయకావ్యము.

ఇదివఱలో రామాయణము నాంధ్రీకరించినకవులవృత్తాంతమును జెప్పియున్నాము. ఇపుడు మనము రామాయణనామముతో నొప్పు గ్రంథములు రచియించినకవులను జెప్పవలసియున్నది. కాని యట్టినామములు గలపుస్తకము లనంతములై యున్నవి. కొందఱు తమగ్రంథములను బ్రబంధములుగా రచియించిరి. మఱికొందఱు కేవలసంగ్రహములుగా రచియించిరి. ఇంకొకకొందఱు శతకములుగా రచియించిరి. అవి యన్నియు రామాయణనామముతో నొప్పక యున్నను రామకథ కలవిగా నున్నవి. కావున నే నట్టిగ్రంథములు వదలి పురాణములతో పాటుగ గణనకు వచ్చిన వాల్మీకి రామాయణమును బ్రబంధములతో పాటుగ గణనకు వచ్చినరామాభ్యుదయ మనుగ్రంథములఁగూర్చియే యిందుఁ బ్రశంసింప నై యున్నాను. అం దిదివఱకుఁ బురాణముగా నెన్న బడిన వాల్మీకి రామాయణము నాంధ్రీకరించిన కవుల గూర్చి వ్రాసియున్నాను గావున నే నిపుడు రామాభ్యుదయగ్రంథకర్త యగునయ్యలరాజు రామభద్రయ్య చారిత్రముంగూర్చి వ్రాసెదను :-

_________

7.

అయ్యలరాజు రామభద్రయ్య.

ఇతఁ డొంటిమిట్ట (ఏకశిలానగర) నివాసి. ఒంటిమిట్టరఘువీరశతకము చిన్న తనములో రచియించెను. ఇఁతడు నిరుపేద. బహుకుటుంబ వంతుఁడు. ఏడెనమండ్రుపిల్లలు గలవాఁడు. ఇట్టిహేతువుచేత నితనికిఁ

  1. చూ. ముప్పదియిద్దఱ్దునియోగులపద్యము.