కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/సీతారాముల శాపము

వికీసోర్స్ నుండి

6. సీతారాముల శాపము

"దేవాలయాలలోని విగ్రహాల నగలను ముట్టుకుంటే ఘోరమైన శాపం తగులుతుంది. ఆ పాపఫలాన్నీ వంశపారంపర్యా అనుభవించవలసివస్తుంది." అని భారతదేశాన్ని ఏలే మొగలుచక్రవర్తి టెవర్నియరు అనే ఫ్రెంచి దేశీయుడితో అన్నాడట. ఈ మాట టెవర్నియరు విషయంలోనే రుజువు అయింది.

టెవర్నియరు 1638-68 మధ్య అయిదుసార్లు హిందూదేశానికి వచ్చి దేశమంతా తిరిగిచూశాడు. టెవర్నియరు వజ్రాల వ్యాపారం చేసి చాలా సొమ్ము ఆర్జించాడు. ఎక్కడనైనా అపూర్వమైన వజ్రం వున్నదంటే యెలాగైనా దాన్ని సంపాదించాలని ప్రయత్నించేవాడు. ఇతడు మొగలుచక్రవర్తి దయ సంపాదించి ఆయనతో వెళ్ళి హిమాలయ పర్వతాలలో వుండే వజ్రపు గనులు చూశాడు. అప్పుడు చక్రవర్తి టెవర్నియరుకొక మహావజ్రాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఆ సమయంలోనే చక్రవర్తి టెవర్నియరుకు బర్మా వజ్రం సంగతి ఇలాగని చెప్పాడు. "ఐరావతీ నదీతీరాన్నివున్న పగను అనే నగరంలో ఒక పురాతన దేవాలయంలో ఒక గొప్ప స్ఫటికంలో చెక్కిన సీతారాముల విగ్రహాలు వున్నాయి. ఆ విగ్రహాల మెడలలోను వక్షస్థలాల మీదను భక్తులు సమర్పించిన అనేక అమూల్య రత్నాల ఆభరణాలు వున్నాయి. వాటిలోకల్లా అందమైనదీ, అపూర్వమైనదీ ఒక వజ్రం వున్నది. అది రెండువేల సంవత్సరాల నుంచి ఆ విగ్రహాలకు అలంకారంగా వున్నది. దానిని పూర్వం బర్మారాజు కొమరితయైన బ్రిస్బన్ ధరించేది. ఆ పిల్ల ఆతతాయిలవల్ల బలవన్మరణము నందినది. దీని పూర్వచరిత్రను గురించి యింక ఏమీ తెలియదు." అని చక్రవర్తి చెప్పాడు.

వజ్రాపహరణం

ఈ మాట వినేటప్పటికి ఎలాగైనా ఆ వజ్రాన్ని అపహరించాలని టెవర్నియరుకు కోరిక కలిగింది. అతడు ముందుగా మండలేపట్నం వెళ్ళాడు. పగను చాలా దుర్గమమైన ప్రదేశంలో వుంది. అక్కడికి వెళ్లడం చాలా కష్టం. అయితే టెవర్నియరు ఫ్రెంచి దేశాన్నుంచి నచ్చిన ఒక గొప్పదొర అనిన్నీ, హిందూ దేశాన్ని ఏలే చక్రవర్తికి స్నేహితుడనిన్నీ , అతని ప్రఖ్యాతి అతనికంటే ముందుగానే పాకినందు వల్ల అది సాధ్యం అయింది. అతడు గమ్యస్థానానికి దగ్గరికి వచ్చినకొద్దీ చాలా దాతృత్వం కనబరుస్తూ దానధర్మాలు చెయ్యడం ప్రారంభిం వాడు. తనను ఒక మహారాజు అని అందరూ అనుకోవడం మొదలు పెట్టారని టెవర్నియరే అన్నాడు.

విదేశీయుడిని అందులో తెల్లవాడిని దేవాలయంలోనికి సులభంగా రానివ్వరుగాని టెవర్నియరుకు ఇది సులభంగా సాధ్య మైంది. దేవాలయంలో కాలుపెట్టగానే టెవర్నియరు ఎంతో భక్తి పరుడిలాగి సాష్టాంగపడి దేవుడికి సమస్కరించాడు. ఈ సీతారాము లను చూడలేక కళ్ళు మిరుమిట్లు క్రమ్మినాయేమో అనేటట్లుగా తన అరచేతి వేళ్లను కళ్ళకు అడ్డముపెట్టికొని ఆ వేళ్ళసందులనుంచి తాను అపహరించగలచిన అపూర్వ వజ్రం ఎక్కడవుందో కనిపెట్టాడు.

తన రాకయొక్క. వింత కాస్తతగ్గి పాతబడేవరకు ఐదురోజులు పగనులోనుండి ప్రతిరోజు ఉదయమూ, మధ్యాహ్నమూ, రాత్రి కూడా దేవాలయంలోకి వెళ్ళి సీతారాములను అర్చిస్తూవుండేవాడు. వెళ్ళినప్పు డల్లా ఒక రత్నాన్ని బహుమానం యిచ్చేవాడు. ఆ రాళ్ళు ఎక్కువ విలువైనవి కాకపోయినా అర్చకులకు మాత్రం అతనిపైన చాలా గౌరవం కలిగింది.

ఐదోనాటి రాత్రి వెన్నెల లేదు. అందువల్ల టెవర్నియరూ అతని అనుచరులూ ప్రయాణానికి సిద్ధపరచిన ఏనుగులను ఎవరూ గమనించ లేదు. మొదట పగనుకు వచ్చేటప్పుడు వేసుకొన్న తెల్లనిదుస్తులను తీసివేసి వీళ్ళు నల్లటి దుస్తులు ధరించారు. అందున్న నక్షత్రాల వెలుతురు వీళ్ళపైన పడి గుర్తు తెలుస్తుందనే భయం లేదు ... హఠాత్తుగా ఆ రాత్రి వేళ ఇంత పొద్దుపొయ్యే వరకూ ఇంకా ఆ దేవాలయంలో దిగబడిన ఏ అర్చకునిదో, సేవకునిదో ఒక్క కేక వినబడి మళ్లీ గొంతుక నొక్కినట్లు ఆగిపోయింది. ఆ గుడిలో రాత్రి చపటామీద సాధార ణంగా పడుకునే బిచ్చగాళ్ళకు నిద్రాభంగమై ఒకమాటు ఇటు అటూ కదిలారు. ఇంతలో వాళ్ల కాళ్లుచేతులు బంధింపబడి నోటిలో గుడ్డలు కుక్కినందువల్ల ఏమి చెయ్యలేకపొయ్యారు. సీతారాముల విగ్రహాల దగ్గరికి గబగబపోతూవున్న పాదాలచప్పుడు, బంగారు గొలుసులు కదల్చినచప్పుడు, దానితరువాత వీథిలో ఏనుగుల పాదాలచప్పుడు వినబడినవి. ఇం తే-అంతా సద్దు అణిగింది.

ఆ మర్నాడు పొద్దున్న దివ్యవజ్రం పోయిన సంగతితెలియ గానే లబాయిలూ దిబాయిలూ ఎవరు ఎత్తుకుపోయివుంటారు ? అని అర్చకులు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. బిచ్చగాళ్ళను కట్టిన తాళ్ళను విప్పుతూవుండగా కొత్తగావచ్చిన వారు ఆ రాత్రి వెళ్ళిపోయారనే కేకలు వినబడ్డాయి.

శాపం యొక్క పీడ ప్రారంభం

టెవర్నియరు కోరిక సఫలమైంది. వజ్రం పోయిన సంగతి అర్చకులకు తెలిసేటప్పటికి అతడూ అతని అనుచరులూ తప్పించుకొని చాలా దూరంపోయారు.

ఈ వజ్రంతో టెవర్నియరు ఫ్రెంచి దేశానికి వెళ్లగానే ఫ్రెంచి రాజైన 14 వ “లూయీ” వజ్రం మీద కన్ను వేశాడు. టెవర్నియరుకు అమ్మడం యిష్టంలేదు. ఇతనికి ఒక లక్ష నవరసులూ ఒక ప్రభు బిరుదు ఇస్తానని రాజు అనడంవల్లనూ ఆ సమయంలోనే టెవర్నియరు కొడుకు ఋణబాధలవల్ల ఆస్తినంతా తాకట్టు పెట్టినట్లు తెలిసినందు వల్లనూ టెవర్నియరు ఒప్పుకున్నాడు. టెవర్నియరు మళ్ళీ తూర్పు దేశానికి వెడుతూ దారిలో తీవ్రమైన జ్వరంతో బాధపడి చనిపోయాడు. దారిలో అడవికుక్కలు పీక్కుతిన్నాయని కొందరన్నారు. ఏమైతేనేమి టెవర్నియరు దుర్మరణం పొందాడు. ఇది సీతారాముల 'శాప ఫలిత మే సని కొంద రన్నారు.

వ జ్రం లో పి శా చం

ప్రెంచిరాజు' ఈపజ్రాన్ని చెక్కించినందువల్ల అది 67 క్యారెట్లు


లైంది. దాన్ని 'రాజు ధరించేటప్పటికి దాని నీలవర్ల కాంతులు చూసిఅందరూ ఆశ్చర్యపడ్డారు. వజ్రం ధరించినందువల్ల రాజుగారికేమీ కీడు రాలేదు. కాని దాన్ని ధరించిన ఆయన ప్రియురాండ్రకు ఆయన స్నేహితులకు మాత్రం రాజాదరణము పోవడమో, గౌరవము పోవ డమో, చెరలో దుర్మరణము చెందడమో, జరిగేది. అందువల్ల ఈ వజ్రంలో ఏదో పిశాచ మున్నదనిన్ని పెట్టుకున్న వాళ్ళను నాశనం చేస్తుందనిన్ని పుకారులు బైలు దేరినాయి

ఫ్రెంచిరాజు 16 వ “లూయీ" భార్య మేరీ అంటాయినెట్టు దీనిని ధరించింది. ఆవిడకు చాలా చిక్కులు వచ్చినవి. ప్రెంచి ప్రజా విప్లవంలో ఆ రాజు పద భ్రష్టుడైనాడు. ఈ రాణి ప్రాణాలను గోల్పో యింది. విప్లవం జరిగిన తరువాత 1792 లో తక్కిన జవాహిరితో పాటు ఈ వజ్రాన్ని ఎవరో అపహరించారు.

దుర్మరణాలు - దురదృష్టాలు

తరవాత కొంత కాలానికి వజ్రాల మచ్చులచావడి అనదగిన “ఆంస్టర్ డాం” లో "ఫాల్స్" అనే వజ్రాల వర్తకుడి దగ్గరికి ఈవజ్రం ఎలాగోవచ్చింది. అతనికిచ్చిన వాడు దానిని కొయ్యమన్నాడు. అతడు కొన్ని నెలలు కష్టపడి పని పూర్తిచేసేటప్పటికి అతని కొడుకు దానిని హరించి అమ్మివేసి ఆ సొమ్ముతో వ్యభిచారాలలోనూ, దుర్మార్గాల లోనూ పడి పాడై ఆత్మహత్య చేసుకొన్నాడు.

ఈ కుర్రవాడిదగ్గర ఆ వజ్రాన్ని దాని నిజమైన విలువలో 10వ వంతుకు ఫ్రాన్సిస్ బాయిలూ అనే ఫ్రెంచివాడుకొన్నాడు. అతడు దానిని ఫ్రాన్సులో అమ్మలేక , లండనుకుపోయి అమ్మదలచి అందుకు సొమ్ము లేక రహస్యంగా ఆ వజ్రంలో ఒక చిన్న ముక్కా కోయించి అమ్మి, కోసినందుకు కొంత సొమ్మిచ్చి మిగతాసొమ్ముతో" లండను వెళ్ళి ఆ వజ్రాన్ని తన జోడు మడమలో దాచుకొని తిరిగేవాడు. దానిని అమ్మడానికి భయపడి వీధులు ఊడ్చే పాకీపనిచేస్తూ జీవించేవాడు తిండి లేక మలమల మాడి ఆకలిబాధ భరించలేక ఆఖరికి ఎలియాసన్


అనే యూథుజాతి వజ్రాల వర్తకుడిని పిలిచి తన వజ్రాన్ని 5 వేల సవ రనుల కిచ్చి వేస్తా నన్నాడు. ఎలియాసన్ ఆలోచించి చెబుతానని తరు వాత మళ్ళీ వెళ్ళేటప్పటికి ఆ యువకుడు శోషిల్లి చచ్చి పడివున్నాడు.

ఎలియాసన్ ఆ వజ్రాన్ని సంగ్రహించాడు.అతని దగ్గర ఆ వజ్రం 1880 వరకూ ఉంది. తరువాత అతడు దానిని తామస్ హెన్రీ హోపు అనే ఆయనకు 18 వేల సవరనులకు అమ్మాడు. ఆ వజ్రం నిజానికి 30 వేలు చేస్తుంది. హోపుగారి తదనంతరం ఈ వజ్రం ఆయన వారసుడైన లార్డు ఫ్రాన్సిస్ హోపు ప్రభువునకు సంక్రమించినది. దీనికి అప్పటినుంచీ “హోపు వజ్రం” అని పేరు వచ్చింది.

హో పు ప్ర భు వు

ఈ వజ్రం వచ్చిన ముహూర్తాన హోపుప్రభువుకి అన్నీ కష్టాలే కలిగినవి. అతడు చాలా ఆస్తి నష్టపడి కాపురం చెడి మనోవ్యాధితో బాధపడ్డాడు. హోపుగారు 1894 లో మే యో హే అనే నటకురాలిని పెళ్లాడి ఆ వజ్రాన్ని ఆమెకు యిచ్చాడు. వజ్రం యొక్క పీడవల్లనే తనకు మనశ్శాంతి లేకుండా పోయినదనిన్నీ, తాను ఇంకొకనితో లేచి పోయినా ననిన్నీ ఆవిడ తరువాత చెప్పింది. హోపు ప్రభువు 1902లో ఆమెతో విడాకులు పొందాడు. ఈ లోపుగా అతనికి సొమ్ము అవస రమై ఆ వజ్రాన్ని విక్రయించాడు. తరువాత కొంత కాలందాకా వజ్రం ఏమైనదో తెలియదు.

ఇంకా కొన్ని దుర్మరణాలు

1908 లో ఈ వజ్రాన్ని రష్యా దేశపు కోటీశ్వరుడైన కనిటోవిస్కీ అనే ప్రభువు కొన్నాడు . అతడు ప్యారిసు నగరములోని ఒక నర్తకిని ప్రేమించి ఈ వజ్రాన్ని ఒక రాత్రి ధరించేటందుకు దాని నావి డకు ఇచ్చాడు.ఆ వజ్రాన్ని ధరించి ఆమె రంగస్థలం మీదికి రాగానే కనిటోవిస్కీకి నేమి తోచిందోగాని ఆమెను తన తుపాకితో కాల్చి వేశాడు. తరువాత యింకో రెండు రోజులలో ఈ కనిటోవిస్కీని ఎవరో పొడిచి చంపి వేశారు. ఆ వజ్రాన్ని ఈ ప్రభువుకు అమ్మిన వర్తకుడు కొలట్ అనేవాడు తన వజ్రం ఖరీదు తాలూకు సొమ్ము తనకురాదనే అధైర్యంతో ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ వజ్రం మళ్ళీ ఒక గ్రీకువ ర్తకుడి చేతిలో పడింది. అతడు దానిని తురుష్క సుల్తాను అబ్దుల్ హమీదుకు అమ్మాడు. అమ్మినరోజురాత్రే ఆ గ్రీకువర్తకుడు, అతని భార్యా,పిల్లలూ ఒక పర్వతం ప్రక్క ప్రయా ణం చేస్తూ అగాధమైన లోయలోబడి మరణించారు.

తురుష్క సుల్తాను పదచ్యుతి

తురుష్క సుల్తాను దగ్గర ఆ వజ్రానికి కాపలాకాసే సేవకుడి పైన ఆ సుల్తానుకు ఆగహం వచ్చి అతనిని బంధిఖానాలో పెట్టి చావ గొట్టినందువల్ల వాడికి పిచ్చి యెత్తింది. తరువాత ఆ సుల్తానుకు విశ్వాస పాత్రుడుగా వుండే ఖాజా వాడిని ఎవరో గొంతుక పిసికి చంపారు. తరువాత తురుష్క, యువజన పక్షంవారు ఆ సుల్తానుగారిని తోసిరా జన్నారు.

ఆఖరికి అమెరికా

తగాదాలో మళ్ళీ కొన్నాళ్ళదాకా ఆవజ్రం ఏమైనదో తెలియదు. 1911 లో అమెరికాలోని ఒక వజ్రాల కంపెనీలో మెక్లీన్ సతి అనే ఆమె దానిని కొన్నది. అప్పటినుంచీ ఆవిడ ఆ కంపెనీతో ఒక వ్యాజ్యం తగాదాలో చిక్కుకుంది. ఈ వజ్రం మీదనున్న అపఖ్యాతివల్ల దానిని కొనేటప్పుడు ఒక గమ్మత్తుషరతు నిర్ణయించుకున్నారు. కొన్న వాళ్లకు ఏదైనా ఆపదవ చ్చే సందర్భంలో వజ్రం వాపసు చేసే పద్ధతిని దానిని 60 వేల నవరసులఖరీదు అని మొదట అన్నారుగాని తుదకు 52 వేల నవరసు లే నిశ్చయించు కొన్నారు. 1919 మే నెలలో మెక్లీసు సతియొక్క ఏకైక పుత్రుడు కోటీ శ్వరుడి కులదీపము- పసిపాపడు తన దాయి దగ్గరనుంచి హఠాత్తుగా అవతలికి వెళ్ళి ఒక మోటారు బండిచక్రం కింద పడి చనిపోయాడు. *[1] తరువాత ఏమి జరిగిందో ఇంకా తెలియ లేదు. .........................................................................................................

  1. The Curse of the Hope Diamond By Richard D. S. McMillan; (Great Stories of real life - George Newes Ltd.)